గుంటూరు: గుంటూరు జిల్లాలో హడలెత్తిస్తున్న వైరల్, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై రాష్ట్ర మాద్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అధికారులతో సమీక్షించారు. జ్వరపీడితులు ప్రతి ఇంటిలోనూ ఉంటున్నారని వీరికి అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ఎవరు ఉదాసీనంగా వ్యవహరించినా వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులతోనూ సమావేశమైన మంత్రి రైతులకు ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
Filed under: వార్తలు |
Leave a comment