శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్థి పధకాలలో ఉపాధి హామి పధకం అత్యంత సమర్థవంతంగా అమలవుతుందని రాష్ట్ర రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాధరావు అన్నారు. గార మండలం అంపోలు గ్రామంలో నిర్వహించిన ప్రజాపధం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వై.యస్.రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్థి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ముందుగా త్రాగునీరు, విద్యుత్తు, ఉపాధి హామి పధకం, 108, 104, పనితీరును అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు పూర్తిస్ధాయిలో వినియోగించుకోవాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కొక్కరికి కూలీ ఎంత వస్తుంది అడిగితెలుసుకున్నారు. మే 1 నుండి కూలీ రేట్లు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఆరోగ్య పరిస్జితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్శాఖ పనితీరును అడిగి తెలుసుకొనగా కొన్ని పనుల నిమిత్తం గ్రామస్తుల భాగస్వామ్యంగా కొంత పైకం కట్టవలసిందిగా ఎఇ. వివరించారు.
మంత్రి గ్రామస్తులు చెల్లించవలసిన పైకాన్ని తన నిధులనుంచి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్డీఓ నక్కసత్యనారాయణ, మత్స్యశాఖ ఉపసంచాలకులు కోటేశ్వరరావు, అంపోలు సర్పంచ్ గొండు సౌధామణి, ఎంపిపి గొండు రఘురామ్, డిసిఎంఎస్.చైర్మన్ గొండు కృష్ణ హౌసింగ్ పిడి.విద్యాసాగర్ఒ, ఎంపిడిఓ వెంకటరామన్, తాహాశీల్దార్ఒ దయానిధి, విద్యుత్ శాఖ ఎఇ.తదితరులు పాల్గొన్నారు.
Filed under: వార్తలు | Tagged: అభివృద్థి, ఉపాధి హామీ, పధకం, పధకాలు, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాధరావు, శ్రీకాకుళం | Leave a comment »