హైదరాబాద్: నగరంలోని మంగల్హాట్లో ఒక ప్రభుత్వభూమిలో తవ్వకాలలో బయల్పడిన నందివిగ్రహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇది భూగర్భదేవాలయమని పాతబస్తీలో పుకార్లు వ్యాప్తి చెందాయి. దాంతో భారీగా గుంపులు అక్కడకు చేరుకున్నాయి.” విద్యుత్ శాఖ ఒక విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించేందుకు తవ్వకాలు జరుపతున్నపుడు ఒక నందివిగ్రహం బైటపడింది.” అని మంగల్హాట్ పోలీస్ స్టేషన్ అధికారి జి.శ్రీధర్ చెప్పారు. తరువాత పురావస్తుశాఖ నిపుణులు అక్కడకు వచ్చి పరిశీలించారన్నారు. అది తూర్పువైపు చూస్తోందని శ్మశానవాటికను సూచిస్తోందని చెప్పారు. వ్యతిరేక దిశలో ఆలయం ఉండేఅవకాశాలు లేవన్నారు. ఈ భూమిని ఇటీవల భూకబ్జాదారుల నుంచి విముక్తి చేసినట్లు ఎమ్మార్వో చంద్రకళ చెప్పారు. గణేశవిగ్రహతయారీదారులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారని వారిని తాము ఖాళీ చేయించామని ఆమె చెప్పారు. ఆలయం ఇక్కడ ఉండేదన్న మాట అవాస్తవమన్నారు. పంచనామా నిర్వహించి విగ్రహవివరాలను రికార్డులలోనికి ఎక్కించారు.
Filed under: వార్తలు |
Leave a comment