తిరుపతి: డివిజనల్ స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహించడం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి వెసులు బాటు కలుగుతుందని చిత్తూరు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ శారదదేవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ ప్రతి రెండొ సోమవారం తిరుపతిలోను, నాల్గవ సోమవారం మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన సమస్యలుగా ఇంటి పట్టాలు, భూమి స్వాధీనం, రేషన్ కార్డుల ఏరివేత, మునిపల్ పరిధిలోని సమస్యలు ముఖ్యమైనవన్నారు.
గత సోమవారం అందిన ఫిర్యాదు మీద స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న బెల్టు షాపును మూయించడం జరిగందన్నారు. తిరుపతి పట్టణం 8 వ వార్డులో నిర్వహిస్తున్న మునిసిపల్ పాఠశాలకు సొంత భవనం పై చర్యలు చేపట్టాలని మునిసిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసారన్నారు. రేషన్ కార్డుల ఏరివేత సందర్బంగా అన్యాయం జరిగిందని భావించినవారు పై అధికారులకు అప్పీలు చేసుకుని న్యాయం పొందవచ్చని సూచించారు.
ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నదని, అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. సోమవారం తప్పనిసరిగా అధికారులు తమ కార్యస్థానాలలో ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రసాద్, సహాయ బి.సి. సంక్షేమ అధికారి వెంకటయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి ఎన్.ఎ.రజాక్, ఎ.టి.డబ్ల.ఒ ఇ. లలితబాయి, పశుసంవర్థక అధికారి డాక్టర్. ఎన్. శైలజ, హౌనింగ్ డివిజనల్ ఇంజనీరు బాలకృష్ణారెడ్డి, తిరుపతి రూరల్ ఎం .పి.డి.ఒ రాజశేఖరరెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 8 అర్జీలు అందాయి.
Filed under: వార్తలు | Tagged: గ్రీవెన్స్ డే, చిత్తూరు, జిల్లా, డివిజనల్, తిరుపతి | Leave a comment »