పరువు తీస్తున్న కొట్లాటలు

హైదరాబాద్: కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే తయారయింది. అత్తెసరు మార్కులతోనే అధికారం దక్కడానికి చాలా నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకుల ధిక్కారమే కారణమని విశ్లేషించిన అధినాయకత్వం జిల్లాల వారీ సమీక్షలు ప్రారంభించింది. పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేసిన వారి భరతం పట్టడానికి ఇదే మంచి మార్గమని పీసీసీ అధ్యక్షుడు డిఎస్, ముఖ్యమంత్రి వైఎస్ జలిమిగా నిర్ణయించారు. వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పడం మాటేమోగాని ఈ సమీక్షా సమావేశాల్లో కాంగ్రెస్ వర్గాలు బాహాబాహీకి తలపడి పార్టీ అధినేత డిఎస్ కు తలనొప్పులు తెప్పించడమే కాకుండా తలవంపులు కలిగిస్తున్నారు. ఈ పరిణామాలు సీనియర్ నాయకుల్లో కలవరాన్ని కలిగిస్తున్నాయి. ఇంటిని చక్కదిద్దుకుందామనుకుంటే, ఇంటి పరువే రచ్చకెక్కుతోందని గగ్గోలు పెడుతున్నారు.

జిల్లా కేంద్రాలలో డిఎస్ సమీక్షలు, గొడవలపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తాజాగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోజరిగిన సమీక్షాసమావేశంలో పార్టీ శ్రేణులు గొడవకు దిగిన తీరు పార్టీ నేతలకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. డిఎస్ వ్యూహాత్మక వైఖరే ఈ గొడవలకు దారితీస్తున్నదా అన్న అనుమానాలను వైఎస్ వర్గనేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జూన్ 13 నుంచి జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు. ఒక్కోరోజు జిల్లా కేంద్రాల్లోగడిపి, పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులను పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల ద్వారా తెలుసుకోవడం, లోపాలు ఉంటే సరిదిద్ది స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చడం ద్వారా పార్టీకి గుర్తింపు తీసుకురావడం, నాయకుల మధ్య ఉన్న విబేధాలను రూపుమాపడం డిఎస్ లక్ష్యం.

ఇప్పటి వరకు ఆయన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షా సమావేశాలు పూర్తి చేసుకున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, కృష్ణా, మహబూబ్ నగర్ జిల్లా సమీక్షా సమావేశాల్లో డిఎస్ ఎదుటే పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు తిట్టుకోవడం, పరస్పర ఆరోపణలతో ధూషించుకోవడం, చివరకు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్ళింది. తాజాగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా సమావేశంలో కొడంగల్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య గొడవకు దారి తీశాయి. దీంతో సమావేశంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాయకులను సముదాయించే ప్రయత్నంలో చివరకు డిఎస్ ఒక దశలో కోపోద్రిక్తుడు కావాల్సి వచ్చింది.

వైఎస్, డిఎస్ వర్గాల నేతలు అనుసరిస్తున్న వైఖరే ఈ గొడవలకు కారణమవుతున్నట్లు కొంత మంది నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో జిల్లా స్థాయిలో నెలకొన్న వర్గాల, గ్రూపుల ఆధిపత్యపోరే ఈ గొడవలకు దారి తీస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. డిఎస్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కొంత మంది కావాలని ఇలా చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. కాగా డిఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరు వల్లే నాయకుల మధ్య గొడవలు పుట్టుకొస్తున్నట్లు వైఎస్ వర్గానికి చెందిన కొంతమంది నేతలు అనుమాన పడుతున్నారు. కాగా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నప్పుడు ప్రస్తుతానికి జిల్లా కేంద్రాల్లో సమీక్షా సమావేశాలు డిఎస్ నిర్వహించకుండ ఉంటేనే మంచిదని పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల అవినీతిపై విచారణ

గద్వాల: గద్వాల మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ పథకం అమలులో జరిగిన అవినీతి అక్రమాలపై ఎట్టకేలకు థర్డ్‌పార్టీ ఎంకై్వరీ ప్రారంభమైంది. ఈ మేరకు గురువారం ఉదయ్‌కుమార్‌, నవీన్‌ కుమార్‌, రాజేష్‌కుమార్‌ల నేతృత్వంలో 6వ వార్డు పరిధిలో ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరించారు. అడుగడుగునా విచారణ అధికారులకు లబ్ధిదారులు తమకు జరిగిన అన్యాయం గురించి పూసగుచ్చినట్లు వివరించారు.

ఇళ్ల నిర్మాణం జరుగకున్నా తమ పేరిట బిల్లులు డ్రా చేసుకున్నారని కొంద రు, తాము ఇళ్ల నిర్మాణం చేసుకున్నా బిల్లులు నేటికీ అందలేదని మరి కొందరు విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ వద్దనున్న సమా చారంతో అధికారులు విచారణ చేస్తుండడం పలు అనుమానాలకు తావి స్తోంది. కేవలం లబ్ధిదారుల వద్ద ఉన్న బ్యాంకు పాస్‌పుస్తకాల ఆధారంగా విచారణ చేస్తున్నారే తప్ప మహిళ సంఘాలు ఇళ్ల బిల్లులను డ్రా చేసుకున్న అంశంపై విచారణ చేపట్టకపోవడంతో వార్డులోని తెలుగుదేశం నాయ కులు పులిపాటి వెంకటేష్‌ తదితరులు ఆక్షేపించారు. విచారణను తూతూ మంత్రంగా ముగించాలనే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నారే తప్ప లబ్ధిదారు లకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏ కోశానా కన్పించడంలేదన్నారు. వార్డులో ఉన్న మహిళా సంఘం అధ్యక్షురాలు, వార్డు కౌన్సిలర్లు కలిసి ఇందిరమ్మ పథకంలో బోగస్‌ లబ్ధిదారులను సృష్టించి వందలాది ఇళ్ల బిల్లులను డ్రా చేసుకున్నారని విచారణ అధికారుల దృష్టికి తెచ్చారు.

ఓ వైపు విచారణ జరుగుతుండగా, విచారణ కొనసాగిస్తున్న అధికారులు తమ సెల్‌ఫోన్లతో హౌసింగ్‌ అధికారులు, వార్డు కౌన్సిలర్‌కు ఎప్పటికప్పు డు సమాచారాన్ని అందజేస్తున్నారని వార్డు ప్రజలు ఆరోపించారు. విచారణ కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని బిల్లులు డ్రా చేసుకున్న వారు దర్జాగా తిరుగుతుండగా ఏ పాపం ఎరుగని తాము భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణ బిల్లులను చెల్లించాల్సి వస్తుందేమోనని వాపోయారు. ఏదేమైనా పట్టణంలో థర్డ్‌పార్టీ ఎంకై్వరీ జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు భుజాలు తడుముకుంటుండగా అక్రమాలు చేసిన వారు దర్జాగా ఉండడం గమనార్హం. థర్డ్‌పార్టీ ఎంకై్వరీ వల్ల తమకు ఏమీ జరగదనే ధీమాతో హౌసింగ్‌ అధికారులు ఉండడం కొసమెరుపు.

నిర్మలమ్మను ఆదుకుంటాం

జడ్చర్ల‌: కిష్టారం గ్రామంలో అర్హత ఉండి వికలాంగుల పెన్షన్‌ అందని నిర్మలమ్మను అన్ని విధాల ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే మల్లు రవి తెలిపారు. విధినెదిరించన నిర్మలమ్మ అంటూ మీడియాలో వచ్చిన కథనాల పట్ల ఆయన స్పందించారు. గ్రామ సర్పంచు పాలెం సుదర్శన్‌గౌడ్‌ తోపాటు ఎంపీపీ నిత్యానందం, జిల్లా ప్రణా ళికా సంఘ సభ్యుడు బుక్కావెంకటేశ్‌లను నిర్మలమ్మ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. అక్కడే ఆయన హైదరాబాద్‌ నుంచి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు.

తమ ప్రభుత్వం లక్ష్యం అర్హులైన వారందరికీ పెన్షన్లు అందించడమేనన్నారు. అయితే ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఇలాంటి వారికి అందలేదని, వెంటనే తాము అధికారులతో చర్చించి పింఛన్‌ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామ న్నారు. అదే విధంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోవాలో నిర్ణయి స్తామన్నారు. బాధితురాలికి పింఛన్‌ అందించడంతో పాటు కూతురు నవనీతకు విద్యకోసం సాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచు, ఎంపీపీ లు బాధితురాలి వివరాలు తెలుసుకున్నారు.

చిరుత గోళ్లకోసం వెళితే కలప దొరికింది

మణుగూరు: చిరుతను చంపిన నిందుడి సమాచారం మేరకు దాని గోళ్లను వెతక డానికి వెళ్లిన అటవీ అధికారులకు రూ.5 లక్షల విలు వచేసే కలప అక్రమ నిల్వలు దొరికాయి.. ఈ సంఘటన మణుగూరు పాత రైల్వే క్వార్టర్లుతో చోటు చేసుకుంది.. కలపను స్వాధీనం చేసుకొని వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు..

ఇటీవల చిరుతను చంపి నిందుతుడు యిచ్చిన స మాచారంతో చిరుతగోళ్ల కోసం అటవీ శాఖ పా ల్వంచ సబ్‌ డిఎఫ్‌వో బెనర్జీ ఆధ్వర్యంలో కూనవరం రైల్వేగేట్‌ సమీప పాత రైల్వే క్వార్టర్స్‌కు ఆనుకుని ఉ న్న రైల్వే కాంట్రాక్టర్‌ బంగారు రాజు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్‌లోకి తొంగి చూశారు. అందులో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కలప దిమ్మెలు కన్పించాయి. దీంతో అ నుమానం వచ్చిన అటవీశాఖ అధికారులు తలుపులు పగలకొట్టి చూడగా అన్ని క్వార్టర్స్‌లో కలిపి సూ మారు రూ. 5 క్షల విలువగల టేకు, మారుజాతి కలప దిమ్మెలు కనిపించాయి. వాటిని వారు స్వాధీనం చేసుకొని కలప వ్యాపారి ప్రకాశ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అశ్వాపురం ఫారెస్టు రేం జర్‌ వీరభద్రరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ అరుణ, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా అక్రమంగా కలప ను నిల్వ చేసిన వ్యాపారికి స్థానిక అటవీ అధికారుల అండతో పాటు ఇందులో రైల్వే అధికారులకు కూడా సంబంధాలు ఉన్నట్లు అట వీశాఖ అధికారులు అనూమానం వ్యక్తం చేశారు.

చిరుత గోళ్ల కోసం సోదాలు..

చిరుత గోళ్ల కోసం గురువారం దాన్ని చంపిన నింది తుడు యిచ్చిన సమాచారం మేరకు రైల్వే కాంట్రాక్టర్‌ బంగారాజు ఇంట్లో అటవీశాఖ అధికారి బెనర్జీ ఆధ్వ ర్యంలో సోదాలు చేపట్టారు. ఆ సమయంలో ఫ్రీజ్‌లో దాచిన అడవీ జంతువు మాంసం బయటపడింది. దీంతో కాంట్రాక్టర్‌ బంగారు రాజును అదుపులోకి తీసుకున్నారు.

గొత్తికోయలను ఆదుకుంటాం

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టం నుండి ఖమ్మం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయలను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ వి.ఉషారాణి పేర్కొన్నారు. నేషనల్‌ కమి షన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌రైట్స్‌ సభ్యులు, జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఛత్తీస్‌గఢ్‌ నుండి వలస వచ్చిన గొత్తికోయల పిల్లలను, మహిళలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో గొత్తికోయలు మన జిల్లాకు వలస వస్తున్నారని, వారిక తాత్కాలికంగా వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గొత్తికోయల సంక్షేమం కోసం జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి వారికి కనీస అవసరాలు కల్పించే విధంగా సహకరించాలని కో రారు.

2005 సంవత్సరానికి ముందు జిల్లాకు వచ్చి స్థిరపడిన గొత్తికోయల కోసం 189 అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1,547 మందికి రేషన్‌ కార్డులు కూడా ఇచ్చామని వివరించారు. కొత్తగా వలసవస్తున్న వారికి గతంలో వలస వచ్చిన వారి దగ్గరగా ఆవాసాలు ఏర్పాటు చేయడంలో స్వచ్ఛంధ సంస్థలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అదే విధంగా గొత్తికోయలు అడవిని నరకకుండా పోడు వ్యవసాయం చేయకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్‌ దిపాదిక్షత మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సంస్థలు జిల్లా యంత్రాంగంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న గొత్తికోయల వివరాలకు సంబందించిన సమగ్ర సర్వే చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.రామాదేవి, ఉపసంచాలకులు, సోషల్‌ వెల్ఫేర్‌ ఇతర అధికారులు వివిద స్వచ్చంధ సంస్థల సభ్యులు సిరి కాంతారావు, సేవా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.