27 నుంచి తెలంగాణ విద్రోహ నిరసనలు


ఆదిలాబాద్: రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 27నుంచి నవంబర్ 1 వరకు జిల్లాలో నిరసన, విద్రోహ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక టీఎన్‌జీవో భవనంలో చైర్మన్ మామిడి నారాయణ అధ్యక్షతన జిల్లా జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్రోహదిన సందర్భంగా వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశం పలు తీర్మానాలను సైతం ఆమోదించింది. జేఏసీలోనూతన సంఘాలు చేరికపై స్టీరింగ్ కమిటీదే తుది నిర్ణయమని, కొత్త సభ్యులందరు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతారని సమావేశం తీర్మానించింది. జేఏసీ ఆర్థిక వ్యవహారాలను కోర్ కమిటీ నిర్వహిస్తుందని సమావేశం తీర్మానించింది. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలను పర్యవేక్షించేందుకు జేఏసీ జిల్లా కమిటీ కోర్ కమిటీ సభ్యులను నియమించింది.

Leave a comment