హైకోర్టు కోర్టులకు తాళాలు వేసిన న్యాయవాదులు


విజయవాడ: హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ, గుంటూరు న్యాయవాదులు మంగళవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు. కోర్టులకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. పోలీసులు న్యాయవాదులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నామని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయవాదులు విమర్శిస్తున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత మాట్లాడుతామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడాన్ని న్యాయవాదులు వ్యతిరేకించారు. తాము హైకోర్టు బెంచ్ మాత్రమే అడుగుతున్నామని వారన్నారు. ఇందుకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని వారన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు.

Leave a comment