కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల థీంఖని చౌరస్తా సమీపంలో ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్థరాత్రి దాటాక పాత ఇనుప సామాను దుకాణంలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో… అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఐదు దుకాణాలు పూర్తిగా తగలబడిపోయాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా.
Filed under: వార్తలు |
Leave a comment