కళాకారుల్ని పోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుంది: గీతారెడ్డి


హైదరాబాద్‌: కళాకారుల్ని ప్రోత్సహించడంలో రాష్ట్రప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి గీతారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 3న శతరూపాల ముగింపు వేడుకల్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తామని ఆమె చెప్పారు. కళాకారుల్ని ప్రోత్సహించడంలో భాగంగా సాంస్కృతిక శాఖ తరఫున వంద కళల్ని వివిధ ప్రాంతాల్లో 33 రోజులపాటు విజయవంతంగా ప్రదర్శించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు.

Leave a comment