కొనసాగుతున్న కరుణాకరరెడ్డి దీక్ష


తిరుపతి: టీటీడీలో అక్రమాల విషయంలో తనపై విచారణ జరపాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్‌ కరుణాకరరెడ్డి చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. జగన్‌ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలంతా ఆయనను పరామర్శిస్తున్నారు. ఈరోజు వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి కరుణాకరరెడ్డిని పరామర్శించారు. ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌ అంబటి రాంబాబు కూడా కరుణాకరరెడ్డిని పరామర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోరిన వ్యక్తి గతంలో ఎవరూ లేరని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు.

Leave a comment