20 మంది సిఐలకు స్థానచలనం


ఏలూరు: ఏలూరు రేంజ్‌ పరిధిలో 20 మంది పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. గురువారంనాడు ఈ మేరకు ఇన్‌ఛార్జీ డిఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సిఐలు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందినవారు. ఏపి టాస్క్‌లో పనిచేస్తున్న వీరారెడ్డిని కాకినాడ స్పెషల్‌ బ్రాంచీ సిఐగా నియమించారు. రాజవమ్మంగిలో పనిచేస్తున్న వెంగరాజును రాజమండ్రిలోని ప్రకాశ్‌నగర్‌కు బదిలీ చేశారు. వేకెన్సీలో ఉన్న రామచంద్రరావును రాజవొమ్మంగికి బదిలీ చేశారు. అలాగే కిశోర్‌ను కృష్ణా జిల్లా మైలవరానికి, అప్పారావును తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడుకు బదిలీ చేశారు. మండపేటలోని ఉమామహేశ్వరరావును కైకలూరుకు బదిలీ చేశారు. గుడివాడ రూరల్‌లో పనిచేస్తున్న పి.ఎస్‌.ఎన్‌.రావును కృష్ణా జిల్లా స్పెషల్‌ బ్రాంచీకి బదిలీ చేశారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విజయశేఖర్‌ను పెద్దాపురానికి, శ్రీనివాసరావును విజయవాడకు బదిలీ చేశారు. రాజమండ్రి ట్రాఫిక్‌ సిఐ సత్యానందాన్ని మందపేటకు, పెద్దాపురం సిఐ దుర్గారావును రామచంద్రాపురానికి, రాజోలులోని సోమశేఖరాన్ని అమలాపురానికి, పత్తిపాడులోని శ్రీనివాసరావును కాకినాడలోని ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. కాకినాడ ట్రాఫిక్‌ సిఐ మూర్తిని మారేడుపల్లికి, రాజమండ్రి ప్రకాశ్‌నగర్‌ సిఐ మోహనరావును రంపచోడవరానికి బదిలీ చేశారు. కాకినాడ స్పెషల్‌ బ్రాంచీ సిఐ అంబికాప్రసాద్‌ను రాజోలుకు, మారేడుమిల్లి సిఐ కిశోర్‌బాబును నందిగామకు, రామచంద్రపురం సిఐ పూర్ణచంద్రరావుకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మూడేళ్లు దాటినా ఈ సిఐలందరికీ బదిలీల వేటు తప్పలేదు.

Leave a comment