హోంమంత్రిని కలిసిన సాంబశివుడు

హైదరాబాద్‌: మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈనెల 25న తాను నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సాధన యాత్ర, బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని ఆయన మంత్రిని కోరారు. సభ అనంతరం మహబూబ్‌నగర్‌ వరకు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందని అయినా తాను అనుమతికోసం మానవహక్కుల సంఘాన్ని, కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

సమాచారవ్యవస్థను మారుమూలకు విస్తరిస్తాం: మంత్రి రాజా

హైదరాబాద్‌: సమాచార వ్యవస్థను మారుమూలప్రాంతాలకు విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ.రాజా అన్నారు. టెలికాం రంగంలో ప్రపంచంలోనే భారత్‌ హబ్‌ కావాలన్నారు. 600 మిలియన్ల టెలిఫోన్‌ వినియోగదారులతో భారత్‌లో ప్రతి మారుమూల ప్రాంతానికి టెలిఫోన్‌సౌకర్యం ఉందన్నారు. ప్రతినెల 20 మిలియన్ల కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్‌ యూనియన్‌ అయిదవ సదస్సును ఈరోజు హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ సదస్సు ఈ ఏడాది భారత్‌లో జరుగుతోంది. [...]

మహిళా సంఘాలపై సర్కారు సవతి ప్రేమ!

హైదరాబాద్‌: దళారుల బారి నుంచి రైతులను కాపాడటంతోపాటు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చిపెట్టేందుకు ప్రవేశపెట్టిన ధాన్యం మార్కెటింగ్‌ పథకం మూలనపడింది. కొనుగోలుకు అవసరమైన సంచులను సకాలంలో సరఫరా చేయకపోవడమేగాక కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలూ చేపట్టకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు డబ్బులు ఇప్పించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. కొనుగోళ్లు జరిపినందుకుగానూ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషనూ సరిగ్గా అందడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం మొత్తంమీద ఇప్పటిదాకా రూ.188 [...]

‘వేటూరి భార్యకు ఇంటిని సమకూర్చండి’

హైదరాబాద్‌: సరస్వతీదేవి ముద్దుబిడ్డ, ప్రముఖ గేయరచయిత వేటూరి సుందరరామమూరికి హైదరాబాద్‌లో ఇల్లు లేదని, ఆయన భార్యకు ఇంటిని సమకూర్చి న్యాయం చేయాలని ప్రముఖ నటుడు విజయచంద్ర కోరారు. ఇటీవల వేటూరి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 30 ఏళ్ల నుంచి సినీపరిశ్రమలో ఉన్న తనకి హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఇల్లు లేదని బాధ వ్యక్తం చేశారని చెప్పారు. ప్రభుత్వం గానీ, సినీపరిశ్రమ ప్రముఖులు గానీ ఆయన భార్యకు అండగా ఉంటామని తెలుపుతూ ఇంటిని [...]

28 నుంచి ఓటర్ల నమోదు

హైదరాబాద్‌: భారత ఎన్నికల కమిషన్‌ ఈ సంవత్సరం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు లోపాలు లేని ఓటరు గుర్తింపు కార్డులు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వి. సుబ్బారావు ఉద్ఘాటించారు. 18 ఏళ్లు దాటిన పౌరులందరినీ ప్రజాస్వామ్యంలో భాగస్తుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 28 నుంచి 12 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు. [...]

రోశయ్య, డీఎస్‌ ఢిల్లీ పర్యటన

హైదరాబాద్‌: రెండురోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం రాత్రి పదిగంటలకు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. సీఎంతో పాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కూడా వెళ్లనున్నారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సీఎం, డీఎస్‌లు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆదివారం ఇక్కడి పటాన్‌చెరులో ఓ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్న అనంతరం కలిసే ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమౌతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో [...]

మావోయిస్టులపై ఆకాశ దాడులు!

రంగంలోకి హెలికాప్టర్లు వైమానిక మద్దతు కోరుతున్న రాష్ట్రాలు ఎటూ తేల్చుకోని కేంద్రం లాభం కంటే నష్టమే ఎక్కువ: నిపుణులు హైదరాబాద్‌: మావోయిస్టుల చేతుల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న భద్రతా బలగాలకు ఇక ‘ఆకాశమార్గం’ తప్పేటట్లులేదు. నక్సల్స్‌పై పోరాటంలో గగనతల దాడులే శరణ్యమని రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అడుగడుగునా మందుపాతర్లు అమర్చడంతో ఛత్తీస్‌గఢ్‌, [...]

తాగునీటి సమస్యపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: తాగునీటీ సమస్యపై గ్రామీణ నీటీపారుదల అధికారులతో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష నిర్వహించారు. జిల్లాల పర్యటనలో తాగునీటీ సమస్యపై అనేక ఫిర్యాదులు అందాయని ముఖ్యమంత్రి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. నీటీ ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటీని సరఫరా చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సరియైన ప్రమాణాలను పాటించి నాణ్యమైన నీరును అందించడంలో రాజీ పడవద్దని సీఎం అన్నారు.

అనూష కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం – హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌: ప్రేమోన్మాది దాడిలో గాయపడి తల్లిదండ్రులను కోల్పోయిన అనూష కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అనాధలైన ఆమె చెల్లెళ్ల చదువు బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని ఆమె స్పష్టం చేసారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వారిని హస్టళ్ళలో చేర్పించి చదువుకయ్యే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. అనూషపై దాడి దురదృష్టికరమన్నారు. యాసిడ్‌దాడులకు పాల్పడిన వారి విషయంలో ప్రత్యేక చట్టం తెచ్చిన విధంగానే, ఉన్మాదులు పాల్పడే దాడులపై కూడా [...]

గ్రేటర్‌ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి ఆనం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పురపాలక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికలపై శుక్రవారం ముఖ్యమంత్రి కె.రోశయ్య సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్డు ఎప్పుడు ప్రకటించాలన్నది ఎన్నికల సంఘం చేతిలో ఉందన్నారు. నగరంలో త్రాగునీటికి ఎద్దడి లేదన్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాల మూలంగా నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.30కోట్లు విడుదల చేసిందని చెప్పారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.