జూన్‌ 1న రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ రుతుపవనాలు జూన్‌ 1వ తేదీన మన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలు పడతాయి.

చెలికాని మృతి పట్ల రోశయ్య సంతాపం

విశాఖపట్నం: ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీకాకుళం జిల్లా రాజం మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చెలికాని హరనాథ్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికై నేటి ఉదయం ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ ఆకస్మికంగా ఆనారోగ్యానికి గురై ఆయన మరణించడం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీలేదు : సీఎం

విశాఖపట్నం: రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలలో ఒక్క చుక్క నీటిని కూడా నష్టపొకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, వ్యూహాత్మకంగా పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఢిల్లీలో సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు, అలాగే 12వ తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సిడబ్యుసి వద్ద అధికారుల సమావేశం, వంశధార ట్రిబ్యునల్‌ తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి [...]

విజృంభిస్తున్న జ్వరాలు

విశాఖపట్నం: జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. జ్వరపీడితులతో ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కెజిహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 800 ఒపిలు వస్తుంటాయి. వారం రోజుల నుంచి రోజుకు వెయ్యి ఒపిలు వస్తున్నాయి. ఇందులో 400 ఒపిలు వరకు జ్వరానికి సంబంధించినవే. అపారిశుద్ధ్యం, వాతావరణంలో మార్పుల వల్ల జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మైదాన ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా వంటి వ్యాధులతో రోగులు బాధపడుతుంటే, [...]

వైఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటే జగన్‌ను సిఎం చేయాలి: మంత్రి బాలరాజు

విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని జిల్లా మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు అధిష్టానాన్ని కోరారు. మండల కేంద్రమైన చీడికాడలో నూతనంగా నిర్మించనున్న వైఎస్‌ విగ్రహానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం వైఎస్‌ చిత్రపటానికి మంత్రి బాలరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. డిసిసి కార్యదర్శి బొడ్డు మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన సంతాపసభలో మంత్రి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మతాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల మనస్సుల్లో [...]

పాడిపశువుల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు

విశాఖపట్నం: కరువును దృష్టిలో పెట్టుకొని విశాఖ డెయిరీ పరిధిలో ఉన్న రైతులందరికీ పాడి పశువులు కొనుగోలుకు వడ్డీలేని రుణాలు అందజేయనున్నట్టు డెయిరీ ఛైర్మన్‌ ఆడారి తులసీరావు తెలిపారు. చీడికాడ పాల సొసైటీ సమావేశ మందిరంలో పాడి రైతులకు 412 కుర్చీలు, 162 స్టీల్‌ కంచాలు ఆయన చేతల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని పాడి రైతులందరికీ ఈ రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని నిమిత్తం ఇప్పటికే రూ.31 కోట్లు [...]

గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ‘కాఫీ’ తోడ్పాటు

విశాఖపట్నం: గిరిజనుల ఆర్థికాభివృద్దికి కాఫీ పంట తోడ్పాటునందిస్తుందని అరకు నియోజక వర్గం శాసన సభ్యుడు సివేరి సోమ అన్నారు. కాఫీ పంట సాగుదారులకు పాడేరు డివిజన్‌ ఎడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాఫీ పంటకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఉందన్నారు. కాఫీ పంట మీద దృష్టి సారిస్తే అధిక లాభం పొందవచ్చన్నారు. అనంతరం మండలంలోని [...]

అధిష్టానం నిర్ణయంకు కట్టుబడి ఉంటాం: ఎం.పి.సబ్బంహరి

విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జనగ్‌ను నియమించే విషయమై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానందే కీలక నిర్ణయమని అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు సబ్బంహరి అన్నారు. పాయకరావుపేట కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుంది కనుక ఎవరూ వ్యతిరేకించక పోవచ్చునన్నారు. వై.ఎస్‌.జగన్‌ను సి.ఎం.గా చూడాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎం.పి.లే కాకుండా, పార్టీలకతీతంగా కోరుకుంటున్నారన్నారు. [...]

మండుతున్న వెండి ధర

విశాఖపట్నం: వెండి ధర మరింత పెరిగింది. 24 గంటల వ్యవధిలోనే ఆరు వందల రూపాయల వరకు పెరిగిపోవడంతో ఇటు కొనుగోలుదారులు, అటు విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో వెండి ధర విశాఖ నగరంలో 26,900 రూపాయలు పలికింది. ఉన్నట్టుండి మళ్లీ వెంటనే ఇది ధర 27,500 రూపాయలకే చేరింది. గతంలో కిలో 18వేల నుంచి 21,000 రూపాయల మధ్య పలికిన వెండి ధర ఒక్కసారిగా తారస్థాయికి చేరుకోవడంతో నగరంలో కొనుగోళ్లు బాగా పడిపోయాయి. నగరంలోని ప్రధాన షోరూమ్‌లలో [...]

త్వరలో కేజీహెచ్‌కు కొత్త వైద్య పరికరాలు

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రధాయిని కింగ్‌జార్జి ఆసుపత్రికి కొత్త వైద్య పరికరాలు రానున్నాయి. ఈ మేరకు కావాల్సిన వైద్య పరికరాల వివరాలను పంపాలని రాష్ట్ర వైద్య విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని భోదనాసుపత్రులతో పాటు బోధనేతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరికరాల కొనుగోలు కోసం ప్రతిఏటా కొంత మొత్తాన్ని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఆసుపత్రికి కావాల్సిన తక్షణ అవసరాలపై ప్రతిపాదనలు పంపాలని ఆ శాఖ కోరింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆసుపత్రిలోని అన్ని విభాగాల అధిపతులతో [...]

Follow

Get every new post delivered to your Inbox.