దారితప్పిన శ్రీలంక జాలర్లు త్వరలో స్వస్థలాలకు

విజయవాడ: 2నెలల క్రితం నాగాయలంక చేరుకున్న శ్రీలంక జాలర్లను త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని శ్రీలంక డిప్యూటి కమీషనర్‌ ఫెర్నాండో తెలిపారు. వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లి దారితప్పి కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి రెండు నెలల క్రితం చేరుకున్నారు. మొత్తం ఏడుగురు శ్రీలంక జాలర్లు ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. తొలుత వారిని శ్రీలంక తీవ్రవాదులుగా అనుమానించిన పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయగా వారు దారితప్పి ఇక్కడకు చేరినట్లు ధ్రువపడింది. దీంతో వీరి విషయమై శ్రీలంక [...]

ఆంధ్రాబ్యాంకు సమ్మెతో నిలిచిపోయిన కార్యకలాపాలు

విజయవాడ: ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో నగరంలోని 16శాఖల్లో బ్యాకింగ్‌ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. కిందిస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. అయితే ముందస్తు లేకుండా వారు సమ్మెకు దిగడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాణిజ్య రాజధాని అయిన విజయవాడలో ఆంధ్రాబ్యాంకు ద్వారా రోజుకు కనీసం రూ.30కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని అంచనా సమ్మె కారణంగా ఆంధ్రాబ్యాంకు శాఖలు మూతపడ్డంతో ఖాతాదారులు ఎటిఎంల వైపు పరుగుతీసారు. అనేక ఆంధ్రాబ్యాంకు ఎటిఎంలలో [...]

భారీ వర్షంతో మళ్లీ పాత(బస్తీ)సీనే

విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌ మళ్లీ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టితో ముంపునకు గురైంది. సరిగ్గా పది రోజుల క్రితమే ఇదే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు కురసిన ఎడతురిపిలేని వర్షాల కారణంగా వన్‌టౌన్‌ జలదిగ్భంధనంలో చిక్కుకోగా ప్రజలు అధికారులు పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్న నీటినంతా బయటకు పంపించేందుకు రోడ్లకు గండిపెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా అధికారులకు కనువిప్పు కాకపోవడంతో మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో ఎక్కడినీరు [...]

త్వరలో దేవాలయాల్లో ఆస్తుల వివరాలతో వెబ్‌సైట్‌

విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాల్లో ఉన్న నగలు ఇతర ఆస్తుల వివరాలన్నీ సేకరిస్తున్నామని వాటన్నింటినీ పొందుపరుస్తూ వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని దేవాదాయశాఖ కమీషనర్‌ సి.సుందర్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో 1,2 చోట్ల తప్పితే మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ నగలు, రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. ఎక్కడైనా నగల గల్లంతు జరిగితే సంబంధితులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. అగిరిపల్లి శోభనాచలపతీశ్వర ఆలయంలో రికార్డుల్లో ఉన్న నగల కంటే తక్కువ పరిమాణంలో [...]

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ యువకుడి దీక్ష

విజయవాడ: వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక యువకుడు శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేపట్టాడు. కమ్యూనిస్టు యోధుడి మనవడైన జయదీప్‌ ఈ దీక్ష చేపట్టడం ప్రాథాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జయదీప్‌ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టించిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌ అసలు సిసలు కమ్యూనిస్టు అని నివాళులర్పించారు. ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు పేదల జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. అలాంటి నాయకుడు మరణించిన ప్రస్తుత పరిస్థితుల్లో అవే [...]

పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం

విజయవాడ: ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం ఘణనీయంగా తగ్గిపోవడంతో కృష్ణాపశ్చిమ డెల్టాకు తగినంత సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పశ్చిమ డెల్టాపరిధిలోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అరకొరగా అందుతుండడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రకాశం బ్యారేజీ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని రైతాంగం విమర్శిస్తోంది. బ్యారేజీ నిండా నీరు వచ్చినప్పుడు నిల్వచేసుకోకపోగా సముద్రంలోకి వదిలివేసి ఇప్పుడు నీరులేదని చేతులేత్తేయడం అధికారులు బాధ్యతారాహిత్యమని డెల్టా రైతాంగసమాఖ్య అధ్యక్షుడు [...]

వీడిపోయిన డిప్యూటి రిజిస్ట్రార్‌ మృతికేసు

విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సీటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ చౌదరి మృతికేసు మిస్టరీ వీడిపోయింది. ఆయన కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. శనివారంనాడు యూనివర్సిటీలోని తన ఛాంబర్‌లో అచేతనంగా పడిఉన్న చౌదరిని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వారు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేయడం తెలిసిందే. మృతుడి తలపై గాయం కూడా ఉండడంతో ఆయన్ను ఎవరో హత్యచేసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో చౌదరి పురుగుల మందు తాగినట్లు వెల్లడైంది. [...]

దోపీడీ దొంగను పట్టుకున్న స్థానికులు

విజయవాడ: కానూరులో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక దోపీడీ దొంగను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆదివారం తెల్లవారు జామున కానూరు తోటలలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక యువకుడిని స్థానికులు పట్టుకుని ప్రశ్నించగా అతడు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానపడి చెట్టుకు కట్టేశారు. తదుపరి అతడి సంచిని వెతకగా బంగారు ఆభరణాలు దొరకడంతో దొంగగా నిర్ధారించుకుని తీవ్రంగా కొట్టి పెనమలూరు పోలీసులకు అప్పగించారు. శనివారం తెల్లవారుజామున ఈ యువకుడే ఒంటరిగా ఉన్న ఒక మహిళ గృహంలో [...]

ఆయేషా కేసు నేటికి వాయిదా

విజయవాడ: బి-ఫార్మసి విద్యార్థి ఆయేషామీర హత్యకేసు విచారణలో భాగంగా పాదముద్రల నిపుణులు, డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం కోర్టులో హాజరయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్రలు ఈ కేసులోని నిందితుడైన సత్యంబాబు పాదముద్రలతో సరిపోయాయని నిపుణులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే బిఎన్‌ఎ పరీక్షల్లో కూడా సత్యబాబు సంబంధించిన అంశాలే ఉన్నట్లు తెలిందని అధికారులు కోర్టులో వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించామని అన్ని సరిగానే ఉన్నాయని వారు నిందితుడి తరపు న్యాయ వాధి కె. రామ్మోహన్‌రావు [...]

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

విజయవాడ: విజయవాడ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌పై, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వర్గీయులు కుర్చి విసరగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. సమావేశం వేదికపైకి ఇబ్రహీంపట్నం ఎంపిపి మధవరావును పిలవకపోవడం ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఎమ్మెల్యే రమేష్‌ వర్గీయుడు అగ్రహోదగ్రులై లగడపాటి మీద కుర్చీలు విసిరారు. కాగా, ఎంపి వర్గీయులు కూడా [...]

Follow

Get every new post delivered to your Inbox.