రైతు దిగుబడి పెంచడమే యాత్రల లక్ష్యం

విజయనగరం: దిగుబడి, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రైతు ఆదాయాన్ని పెంచేందుకు రైతు చైతన్య యాత్రలు చేపట్టామని విజయనగరం జిల్లా కలక్టర్ జి.రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలక్టరు క్యాంప్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర జీపును కలక్టర్ ప్రారంభించారు. మే 17 నుంచి జూన్‌ 2వ తేది వరకు జిల్లాలో రోజుకి రెండు, మూడు పంచాయితీల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతు చైతన్య యాత్రలు [...]

వైఎస్‌ మృతికి పలువురి సంతాపం

విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని చింతిస్తూ పలు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పట్టణంలో ఘనంగా సంతాప సభలునిర్వహించాయి. అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు, వైఎస్‌, జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాలు జరిగాయి. 12వ వార్డులో వైఎస్‌ సంతాప సభ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సంతాపసభ మంగళవారం ఉదయం స్థానిక 12వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం సుమారు [...]

9న ప్రెస్‌క్లబ్‌లో వై.ఎస్‌. సంతాప సభ

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి సంతాప సభ ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (ఎపియుడబ్ల్యుజె) జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి పి.ఎస్‌.ఎస్‌.వి.ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ పాత్రికేయులు, ప్రెస్‌ అకాడమీ సభ్యులు డి.అచ్చుతరావు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సంతాప సభకు ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ప్రతినిధులు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

10 నుంచి బస్సుపాసుల రెన్యువల్స్‌

విజయనగరం: వివిధ మండలాల పరిధిలో గల విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతినెలా 8898 రాయితీ పాసులు, 5041 ఉచిత పాసులు ఇవ్వడం జరుగుతుందని విజయనగరం డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎన్‌.వి.ఎస్‌.వేణుగోపాల్‌, డిపో మేనేజర్‌ టి.వి.ఎస్‌ సుధాకర్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 9లోగా ఉచిత పాసులు పొందాలన్నారు. ప్రభుత్వ సెలవులతో సంబంధం లేకుండా ఈనెల 10 నుంచి 17వ తేదీవరకు విజయనగరంలో రెండు కౌంటర్లలో బస్సు పాలు రెన్యువల్స్‌ [...]

ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర

విజయనగరం: బాలల హక్కుల యాత్రకు సంబంధించి ఈనెల 10న బాలాజీ మార్కెట్‌ ఎదురుగా నెహ్రూ యువకేంద్రం దగ్గర ఉన్నసేవాంజలి కార్యాలయంలో నిరుద్యోగ యువతకు శిక్షణ, జిల్లా వ్యాప్తంగా ఈనెల 21న బాలల హక్కుల అవగాహన యాత్ర జరుగుతుందని సేవాంజలి డైరెక్టర్‌ జి.ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 9440867326 నెంబర్‌ను సంప్రదించవచ్చునన్నారు.

జడ్పీ ఉప ఎన్నికల పోలింగ్‌ 16న

విజయనగరం: జిల్లాలో జరగనున్న జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలు, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గం ఎన్నికలు ముందుగా ప్రకటించిన విధంగా సెప్టెంబర్‌ 8వ తేదీన కాకుండా సెప్టెంబర్‌ 16వ తేదీన జరుగుతాయని విజయనగరం జిల్లా ఎన్నికల అధారిటి అధికారి మహ్మద్‌ ఇక్భాల్‌ హుస్సేన్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించే విధంగా జిల్లాలోని డెంకాక, దత్తిరాజేరు, జియ్యమ్మవలస జడ్పీటీసీ స్థానాలకు, ఎల్‌.కోట మండలం కాసాపేట ఎంపిటిసి స్థానానికి సెప్టెంబర్‌ 8వ తేదీన పోలింగ్‌, [...]

8న మెగాబ్లడ్‌ బ్యాంక్‌

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థం ఈనెల 8న జిల్లా కేంద్రాస్పత్రిలో బ్లడ్‌ క్యాంపు నిర్వహించనున్నట్లు వివిధ స్వచ్ఛంధ సంస్థల నాయకులు అబ్దుల్‌ రవూఫ్‌, పివి పద్మనాభం, ఎంవిఎన్‌ వెంకటరావు, ఆర్‌ఆర్‌కె రావు, ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏటా 80లక్షల యూనిట్ల రక్తం అవసరానికి కేవలం 30 లక్షల యూనిట్లు రక్తం మాత్రమే లభిస్తుందని, ప్రతిఒక్కరూ రక్తదానం నిరంతర పక్రియగా చేపట్టాలని పిలుపునిచ్చారు.

గ్రాండ్‌ట్రేడ్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌సేల్‌ ప్రారంభం

విజయనగరం: సేల్స్‌ ఫీల్డ్‌ఫోర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆదివారం ఉదయం స్థానిక లయిన్స్‌ క్లబ్‌లో గ్రాండ్‌ట్రేడ్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌సేల్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధ్యక్షులు జె.నారాయణరావు, ప్రధాన కార్యదర్శి పి.పంకాలరావు, ట్రెజరర్‌ కె.మురళీ మాట్లాడుతూ సోమ, మంగళవారాలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని, దీని ద్వారా వచ్చే లాభాన్ని పలువురు పేదల చేయూతకు ఉపయోగిస్తామన్నారు. ఎమ్మార్పీ రేట్ల కుంటే తక్కువ ధరకు విక్రయించడం జరుగుతుందన్నారు.

వైఎస్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి – డిసిసి అధ్యక్షుడు కోలగట్ల పిలుపు

విజయనగరం: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిసిసి ఇన్‌ఛార్జి అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులుకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం డిసిసి కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెంత చేరి ఓదార్చే ఒక చెయ్యి చలనం లేకుండా ఆగిపోవడం రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర సృష్టించిన ఒక నడక చెప్పకుండానే అర్థాంతరంగా మూగబోయిందని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన [...]

ప్రభుత్వ చేయూతకు పెయింటర్ల అభ్యర్థన

విజయనగరం: పెయింటింగ్‌ పనికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుతూ జిల్లాకు చెందిన పలువురు పెయింటర్లు సోమవారం ఉదయం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన కోట వద్ద ప్రారంభమై మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకపరమేశ్వరీ ఆలయం, వెంకటలక్ష్మీ మీదుగా కలెక్టరేట్‌కు చేరింది. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు ఎస్‌కె రసీద్‌ మాట్లాడుతూ, పెయింటింగ్‌ వృతిపై ఆధారపడి వేలా మంది జీవిస్తున్నారని, పెయింట్లు వేయడమే జీవనాధారంగా బతుకున్నప్పటికీ రోజు గడవని పరిస్థితిలో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లక్సీలు రావడం [...]

Follow

Get every new post delivered to your Inbox.