వైఎస్‌ జ్ఞాపకాలను మరువలేము: మంత్రులు

వరంగల్‌: బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను మరువలేమని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ అన్నారు. కొత్త మంత్రివర్గంలో చేరిన తరువాత వారు మంగళవారం వరంగల్‌ వచ్చారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌కు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. పేదల కోసం తపించిన వైఎస్‌ మరణం [...]

18న బీఈడీ పరీక్ష

వరంగల్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి కారణంగా ఈనెల 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, వాయిదా వేసిన బీఈడీ మూడో పేపర్‌ పరీక్షను ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకు అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌లో పరీక్ష [...]

వరంగల్‌లో పాఠశాల గదుల్ని కూల్చివేసిన దుండగులు

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో గుర్తు తెలియని కొందరు దుండగులు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని గత అర్థరాత్రి కూల్చివేశారు. జిల్లాలోని గోవిందరాజు గుట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పావలా వడ్డీ కింద రూ.2 కోట్లు

వరంగల్‌: రైతులకు పావలా వడ్డీ కింద పంట రుణాలు అందించడానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు జిల్లాకు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 2008 ఖరీఫ్‌, రబీ, సీజన్లలో పొందిన పంట రుణాలను పూర్తిగా చెల్లించినవారికి ఈ పావలా వడ్డీ కింద రుణాలు అందించనున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో రుణాలు పొందిన రైతులు తమ బాకీలు చెల్లించడానికి 2009 ఆగస్టు 31వ తేదీని, రబీలో రుణాలు పొందిన రైతులు తమ బాకీలను 2009 సెప్టెంబర్‌ [...]

రూ.600 కోట్లు పంటరుణాలు: కలెక్టర్‌

వరంగల్‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు ఇవ్వాల్సిన పంటరుణాలు 600 కోట్ల రూపాయలను సెప్టెంబర్‌ మొదటివారంలోగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. పంటరుణాల పంపిణీపై కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేకంగా బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ను రూ.600 కోట్లు పంటరుణాలు అందించాలన్న లక్ష్యానికిగాను ఇప్పటివరకు 242 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని చెప్పారు. మొత్తం లక్ష్యంలో 41 శాతం అని, మిగిలిన 258 కోట్ల రూపాయలను ఈ [...]

31లోగా పూర్తిస్థాయి నీరు: కలెక్టర్‌

వరంగల్‌: దేవాదుల ఎత్తిపోతల ద్వారా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు ప్రతిరోజు 30 ఎంసిఎఫ్‌టి జలాలను పంపింగ్‌ చేయడం వల్ల ఈనెల 31వ తేదీన పూర్తిస్థాయి మట్టానికి నీరు చేరుకుంటుందని, అదేరోజు ధర్మసాగర్‌ ద్వారా వడ్డెపల్లి చెరువుకు నీటిని పంపింగ్‌ చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. నగరంలోని మంచినీటి సరఫరాపై కార్పొరేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, దేవాదుల ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. నగర మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ఇన్‌ఛార్జ్‌ కమీషనర్‌ వాకాటి కరుణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదుల [...]

రోగుల నుంచి వసూళ్లు ఆపాలి: కలెక్టర్‌

వరంగల్‌: ఎంజిఎం ఆస్పత్రిలో రోగుల నుండి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న సెక్యూరిటీగార్డును వెంటనే తొలగించడంతోపాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ హెచ్చరించారు. ఎంజిఎం ఆస్పత్రిలో రోగుల అటెండెంట్ల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన వార్తల పట్ల కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎంజిఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేందర్‌ను కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు.

సద్భావన జాతీయ సమైఖ్యతపై సదస్సు

వరంగల్‌: నవభారత నిర్మాణానికి నాందిపలికిన నాయకుడు భారతరత్న, మాజీ భారత ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ అని నెహ్రు యువకేందం, జిల్లా యువజన సమన్వయకర్త కె. వెంకటరమణ అన్నారు. బాలసముద్రంలోని యూత్‌హాస్టల్‌లో సద్భావన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రు యువకేంద్రం నిర్వహించిన సద్భావన, జాతీయ సమైఖ్యత అనే అంశంపై యువజన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇందిరాగాంధీ విద్రోహుల చేతుల్లో మరణించిన తరుణంలో తల్లి మరణం ఒకపక్క, దేశభవిష్యత్తు మరోపక్కన సూందిగ్ధ పరిస్థితుల్లో [...]

యూనిసెఫ్‌ ప్రతినిధి బృందం పర్యటన

వరంగల్‌: యూనిసెఫ్‌ ప్రాయోజిక కార్యక్రమాలైన సర్వశిక్షాభియాన్‌ సంపూర్ణ పారిశుద్ధ్యం, త్రాగునీటి పథకాలు, నియోనాటల్‌ చికిత్స తదితర పథకాలు వరంగల్‌ జిల్లాలో ఏ విధంగా అమలవుతున్నాయో పరిశీలించేందుకు యూనిసెఫ్‌ ప్రతినిధి బృందం గురువారం వరంగల్‌లో పర్యటించింది. యూనిసెఫ్‌ కన్సల్టెంట్స్‌ అయిన ఆక్స్‌ఫర్డ్‌ పాలసీ మేనేజ్‌మెంట్‌ గ్రూపుకు చెందిన అలెక్స్‌ మాధ్యుసన్‌, నీలిమాసింగ్‌, రతీత్రిపాఠీలు ఉదయం జిల్లా కలెక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌ను ఆయన కార్యాయలంలో కలిసి పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు. వరంగల్‌లో మాతా శిశుసంక్షేమ, వైద్య ఆరోగ్య పథకాల [...]

ఉపాధిలో అవినీతి ఊడలు…

బచ్చన్నపేట: జీవనోపాధి లేక మూడు పూటల అన్నం తినలేక అర్థాకలితో బాధపడుతూ పల్లెల్ని వదిలి పట్టణాలకు వలసపోయే వారిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాజీవ్‌ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశ పెట్టి సమర్థవంతంగా నిర్వహి స్తోంది. కాని అది కాస్త నేడు ఉపాధి చూపని హామీగా మారిందంటే అతిశయోక్తి కాదు.ఇందుకు నిదర్శనమే మండలం లోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల ప్రకారం గురువారం గ్రామాని కి వచ్చిన ఎపిఓ రమాదేవిని నిర్భందించిన [...]

Follow

Get every new post delivered to your Inbox.