మహిళా సంఘాలపై సర్కారు సవతి ప్రేమ!

హైదరాబాద్‌: దళారుల బారి నుంచి రైతులను కాపాడటంతోపాటు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చిపెట్టేందుకు ప్రవేశపెట్టిన ధాన్యం మార్కెటింగ్‌ పథకం మూలనపడింది. కొనుగోలుకు అవసరమైన సంచులను సకాలంలో సరఫరా చేయకపోవడమేగాక కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలూ చేపట్టకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు డబ్బులు ఇప్పించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. కొనుగోళ్లు జరిపినందుకుగానూ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషనూ సరిగ్గా అందడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం మొత్తంమీద ఇప్పటిదాకా రూ.188 [...]

రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన

మహబూబ్‌నగర్‌: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా మాచన్‌ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో [...]

కరువులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కరువు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రంగయ్య ఆరోపించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి తమకు పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ప్రత్యామ్నాయ [...]

వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌

గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్‌ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు. కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న [...]

ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: చిరు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంతమంది రైతులు చనిపోతే ప్రభుత్వం కదలిక వస్తుంది, ఎన్ని పంటలు ఎండిపోతే స్పందిస్తారు అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం వెంటనే రాష్ట్రాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించాలి. ఆకలితో జనం నకనకలాడుంతంటే ప్రభుత్వం ఆలోచిస్తూ కూర్చోవడం సరికాదు. సత్వర చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు. అదే వచ్చే నెలలోనే ఎన్నికలుంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించేదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి సత్వరమే రైతులను [...]

తగ్గుతున్న పంటల దిగుబడి… తప్పని ఆహార ధాన్యాల కోరత

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వివిధ పంటలను సాగుచేస్తారు. తూర్పు మండలాలలో అధిక శాతం రైతులు వరిసాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే జిల్లాను కరవు రక్కసి పట్టి పీడిస్తోంది. 1982-83 సంవత్సరంలో మూడు లక్షల 90 వేల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. మూడు లక్షల 20 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. 1981-82లో 16,163 టన్నులు జొన్నలు ఉత్పత్తి జరిగింది. 1992 సంవత్సరానికి జొన్నపంట దిగుబడి తొమ్మిది [...]

ఘనంగా పొలాల అమావాస్య : పల్లెల్లో సందడి

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో పొలాలను ఘనంగా జరుపుకున్నారు. మండలాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య సందర్భంగా పశువులను పూజించడం ఆనవాయితీ. సాయంత్రం ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి ఎద్దుల జతలను అలంకరించి స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపారు. అనంతరం పశువులను ఇళ్లలోకి తీసుకెళ్లి నైవేద్యాన్ని సమర్పించారు. నేరడిగొండలో.. అన్నదాతకు అసరాగా ఉంటూ వారి కష్టాలను గట్టెక్కిస్తున్న మూగజీవాలైన పొలాల [...]

రైతులను ఆదుకున్న ఉచిత విద్యుత్‌

విశాఖపట్నం: వరుణుడు కరుణించకపోయినా, నదులు ఎండిపోతున్నా ఉచిత విద్యుత్‌ మాత్రం ఆ రైతులను ఆదుకుంది. గొలుగొండ మండలంలో పలు గ్రామాల్లో ఉచిత విద్యుత్‌తో ఏర్పాటు చేసిన బోర్ల నీటితో వరినాట్లు పూర్తి చేస్తున్నారు. ఖరీఫ్‌లో వర్షాలు పడక జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరువాక కదలక అన్నదాత గుండె చెరువవుతోంది. ఇలాంటి తరుణంలో ఉచిత విద్యుత్‌ వారిని ఆదుకుంది. ఈ బోర్ల నుంచి వస్తున్న నీటితో పంటలు సాగు ప్రారంభించారు. గొలుగొండ మండలంలో సుమారు 620 [...]

Follow

Get every new post delivered to your Inbox.