ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు: చిరంజీవి

రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధన కోసం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. పోలవరం సాధన కోసం ఆయన ఈ రోజు మధ్యాహ్నాం అంతర్వేది నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో మధురపూడి చేరుకున్న చిరంజీవికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తన బస్సుయాత్ర [...]

29న జిల్లాకు రానున్న రఘువీరారెడ్డి

రాజమండ్రి: వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఈనెల 29వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో 29 ఉదయం 10.30 గంటలకు అన్నవరం చేరుకొని సత్యనారాయణస్వామిని, అనంతరం 12.15 గంటలకు తలుపులమ్మ తల్లిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గండేపల్లిలో క్షేత్ర సందర్శన జరిపి రైతులతో ముచ్చటిస్తారు. 4.30 గంటలకు రాజమండ్రి చేరుకొని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీజనల్‌ వ్యాధులపై సమీక్షిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 [...]

అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు

రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్‌పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.

గోదావరినదిలో యువకుడి అనుమానాస్పద మృతి

రాజమండ్రి: ఈనెల 13వ తేదీన అదృశ్యమైన యువకుడు గోదావరి నదిలో శవమై తేలింది. స్థానిక దానవాయిపేటకు చెందిన కోటారి సతీష్‌(22) మృతదేహం గౌతమి ఘాట్‌ సమీపంలోని ఇసుక తెన్నెలపై కనిపించింది. సతీష్‌ స్నేహితులతో కలిసి ఈనెల 13వ తేదీన కేతవరం పోతురాజు గుడికి వెళ్లిన సతీష్‌ తిరిగి రాలేదని తండ్రి అన్నవరం ఈనెల 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం గౌతమి ఘాట్‌ సమీపంలో మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకొని వెళ్లి పరిశీలించగా [...]

స్వైన్‌ఫ్లూతో మరో యువకుడి మృతి

రాజమండ్రి: కాకినాడ రూరల్‌ మండలం అరహ్యకట్టకు చెందిన ప్రత్తిపాటి రాజేష్‌(18) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అరహ్యకట్టలో స్వైన్‌ఫ్లూ వ్యాపించిందన్న ఉదంతం నేపథ్యంలో రాజేష్‌ మృతితో గ్రామంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాజేష్‌ తల్లి ప్రతిపాటి వరలక్ష్మి, అదే వీధిలో ఉంటున్న సత్యనారాయణ, బి.రాజేష్‌కుమార్‌ మృతి చెందిన విషయం విదితమే. రాజేష్‌ రక్త పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, గ్రామంలో స్వైన్‌ఫ్లూ లేదని [...]

మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు

రాజమండ్రి: నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై పోలీస్‌ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. లుఫరన్‌ కళాశాల విద్యార్థుల వ్యవహారం దగ్గర నుండి అనూషపై ఉన్మాది దాడి, విద్యార్థినీపై టీచర్‌ అఘయిత్యం వంటి ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మహిళల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. దీనికోసం యాంటి ఈవ్‌టీచింగ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించారు. మహిళలు తమకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంగా తనతో చెప్పుకోవచ్చునని డిఎస్పీ [...]

పండుగ సీజన్‌లో బ్లాక్ దందా

రాజమండ్రి: అసలే పండుగల సీజన్‌.. ఆపై మండుతున్న ధరలు… మరోవైపు అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని నిత్యావసర సరకులు పెద్దఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో.. దీనిని నియంత్రించేందుకు జిల్లా అధికార యంత్రాగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ గొడౌన్లలో అక్రమంగా నిల్వచేసిన సరకులపై అధికారుల దాడులు ముమ్మరమయ్యాయి. రాజమండ్రిలోని ఎస్‌విజి మార్కెట్‌లో కూడా పౌర సరఫరాల శాఖ [...]

పోలవరానికి జాతీయ హోదాపై చిగురిస్తున్న ఆశలు

రాజమండ్రి: పోలవరం(ఇందిరాసాగర్‌) ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించే విషయాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర అధికారుల బృందం శనివారం రానుంది. కేంద్ర జల సంఘం, పునరావాస కమిషన్‌, పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్న ఈ బృందం ప్రాజెక్ట్‌ ప్రదేశాన్ని, కాలువల నిర్మాణాన్ని, ప్రయోజనం పొందే కొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2005లో శంకుస్థాపన జరిగిన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా గుర్తించి కేంద్ర నిధులు [...]

ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న తూ.గో.జిల్లా ప్రజలు

రాజమండ్రి: రాష్ట్రంలో ఒకప్రక్క వానలు పడుతుండగా, తూర్పుగోదావరి జిల్లాలో గత వారంరోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండకాలం స్థాయిలో వేడిగాలులు వీస్తున్నాయి. రాజమండ్రి నగరంలో గురు, శుక్రవారాలు ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా ఉంది. వృద్ధులు, పిల్లలు ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత వాయుగుండం వల్ల తగ్గుతుందని ఆశించినా ఫలితం లేకుండాపోయింది. ఎండ తీవ్రత వల్ల ఏసీలు ఎక్కువ పని చేయడంతో విద్యుత్‌ వాడకం అధికంగా జరుగుతుంది. వర్షాల సూచన కనిపించక ఇక వాయుగుండాలపై [...]

తక్కువ ఛార్జీలతో బిఎస్‌ఎన్‌ఎల్‌ మెరుగైన సేవలు

రాజమండ్రి: తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే బిఎస్‌ఎన్‌ఎల్‌ అర్బన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ జిల్లా జనరల్‌ మేనేజర్‌ కె.రాఘవేంద్రరావు అన్నారు. శుక్రవారం స్థానిక కందుకూరి వీరేశలింగం డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగం అయిన బిఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ఛార్జీలతో ప్రజలకు సేవలు చేస్తున్న సంస్థ అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇంటర్నెట్‌లో 8 మెగావైట్‌ హైస్పీడు, వెబ్‌ కాన్ఫరెన్స్‌, వెబ్‌ ఛాట్‌కాస్టింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌, ఎడ్యుకేషన్‌ మరియు ఆన్‌లైన్‌, టీచింగ్‌, హైయర్‌ ఎడ్యుకేషన్‌, [...]

Follow

Get every new post delivered to your Inbox.