Posts Tagged as ‘మావోయిస్టులు’

సెప్టెంబరు 1, 2009

తెలంగాణాలో మావోల బంద్‌

ఖమ్మం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు రెండు రోజుల పాటు బంద్‌ పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌ ఉద్యమంపై చేపడుతున్న అణచివేతకు నిరసనగా ఈ బంద్‌ పిలుపునిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాలోని దమ్ముగూడెం మండలంలో రెండు రోజుల బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడవకుండా నక్సల్స్‌ చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ నేపథ్యంలో నక్సల్స్‌ విధ్వంస చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో [...]

ఆగష్టు 31, 2009

ఏజెన్సీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్‌ బ్యానర్లు

ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు, హిందీ భాషల్లో బ్యానర్లు కట్టారు. అందులో అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడండి, అధిక ధరలకు కారణమైన పాలకులకు తగిన బుద్ధి చెప్పండి, గ్రామాలకు వచ్చే అధికారులను నిలదీయండి అని వ్రాసి ఉంది. అంతేకాకుండా జిల్లాలోని వేలాది ఎకరాల పంట భూములను పొలవరం పేరుతో లాక్కుంటూ, ఓపెన్‌ కాస్టుల పేరుతో గిరిజనులను నిరాశ్రయులను చేస్తూ, చారిత్రక నగరాలనుండి వారిని ప్రభుత్వ ఖాళీ చేయిస్తుందని వాపోయారు. [...]

ఆగష్టు 21, 2009

కల్వకుర్తిలో మావోయిస్టుల సంచారం?

కల్వకుర్తి (మహబూబ్‌నగర్‌ జిల్లా): కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ, మాడ్గుల మండలాల్లో మావోయిస్టు దళ సభ్యులు సంచరిస్తున్నట్లు పలు గ్రామాలనుండి సమాచారం… ఇటీవల మావో యిస్టు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిం చిన బొంత పార్వతమ్మ అలియాస్‌ స్వర్ణక్క నేతృత్వంలో పది మంది సభ్యులు గల దళం కల్వకుర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో తమ కార్యకలాపాలను విస్తృత పర్చు కునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. వెల్దండ మండలం అజిలాపూర్‌ గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో వారం క్రితం మావోయిస్టు [...]

ఆగష్టు 13, 2009

ఎఓబిలో మళ్ళీ అలజడి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌

శ్రీకాకుళం: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో మళ్ళీ అలజడి రేగింది.గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయనగరం జిల్లా కటికికేదారిపురం ఒరిస్సాకు చెందిన పల్నారా సమితి ముకుందాపురం అడవిలో జరిగిన్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా వీరిలో ఇద్దరు శ్రీకాకుళం డివిజన్‌ కమిటీలో కీలకబాధ్యతలు వహిస్తున్న మహిళలు ఉన్నారు. ఒరిస్సాలోని చంద్రాపూర్‌, గుడారి సమితుల పరిధిలో పోలీస్‌ ఇన్మఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇటీవల ముగ్గురు గిరిజనులను హతమార్చిన తరువాత ఆంధ్రా పోలీసులు అప్రమత్తం అయ్యారు. [...]