ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు

మచిలీపట్నం: జిల్లాలో రైతాంగం ధాన్యం అమ్మకం గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, మద్దతుధర కంటే తక్కువకు ఎటువంట పరిస్థితుల్లోనూ అమ్మవద్దనీ కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్ గౌరవ్‌ ఉప్పల్‌ రైతులను కోరారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుపై మద్దతుధర ఇవ్వడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సమస్యను అధ్యయనం చేసి రైతులతోను మిల్లర్లతోను మాట్లాడుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్యతో కలసి చిలకలపూడి వేర్‌హౌసింగ్‌ కార్పోరేషన్‌ గోడౌన్‌ వద్ద [...]

తీరప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు

మచిలీపట్నం: కోస్తా తీర ప్రాంతంలో పటిష్ఠవంతంగా నిఘా ఏర్పాట్లు చేపట్టే చర్యలోభాగంగా కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో కొత్తగా రెండు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మెరైన్‌ డిఐఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ రామకృష్ణయ్యతో కలిసి ఆయన మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, భవన [...]

కృషా జిల్లాలో 49 కరువు మండలాలు

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో ఒక విజయవాడ అర్బన్‌ మినహ మిగిలిన 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు విలయ తాండవం చేస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అలాగే జిల్లా అభివృద్ధి [...]

11న వైఎస్‌ స్మృత్యర్థం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మృత్యర్థం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ పోటీలు ఈనెల 11న నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో వైఎస్‌ సేవలపై వ్యాసరచన, కవిత్వ పోటీలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు డ్రాయింగ్‌ కూడా నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందినవారి స్క్రీప్టులను జిల్లాస్థాయి పోటీలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపాలని కోరారు. [...]

‘పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం’పై జాతీయసదస్సు

మచిలీపట్నం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కృష్ణా విశ్వవిద్యాలయంల సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం అన్న అంశంపై ఈనెల 10, 11వ తేదీలలో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎం.కేశవదుర్గాప్రసాద్‌ తెలిపారు.ఈ సదస్సు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నివాళికి ఈ సదస్సును అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు సదస్సు [...]

మరో 16 వేల క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు అవసరం

మచిలీపట్నం: కృష్ణా డెల్టాలో సాగునీటి వినియోగం పెరిగినందున ఇప్పుడు అందిస్తున్న సాగునీరు సారిపోనందున అందనంగా నీటిని పెడుదల చేయాలని నీటి పారుదల శాఖ ఎస్‌.ఇ. డి.చంద్రరావు ప్రభుత్వాని కోరారు. ప్రస్తుతం విజయవాడ, ప్రకాశ బ్యారేజి వద్ద 7.6 అడుగుల నీటి మట్టం ఉందని అన్నారు. సాగర్‌ నుండి అదనపు నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజి వద్ద 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అన్నారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలో రైతుల నీటి వినియోగం అధికమైందని [...]

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు భవనానికి వై.ఎస్‌.ఆర్‌ పేరు

మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు భవనానికి వైఎస్‌ఆర్‌ సహకార భవన్‌గా నామకరణం చేయాలని కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆప్కాబ్‌ చైర్మన్‌ వసంతనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సహకార సంఘానికి దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా మచిలీపట్నంలో నిర్మించనున్న సహకార బ్యాంకు నూతన భవనానికి ఆయన పేరు పెట్టాలని సమావేశం నిర్ణయించిందని [...]

త్వరలో భారీ ఎత్తున వైఎస్‌ విగ్రహాలు

మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను వాడ వాడలా నెలకొల్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ అభిమానులు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. ఇందుకుగానూ విగ్రహాలను రూపొందించే శిల్పుల వద్దకు వెళ్ళి తమకు సాధ్యమైనంత త్వరలో వైఎస్‌ విగ్రహాలు తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఒకప్పుడు జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహాల కోసమే దేశంలోనూ, రాష్ట్రంలోనూ తరచుగా తారసిల్లేవి. ఎక్కువగా మహాత్మాగాంధీ విగ్రహాలు మాత్రం చాలా గ్రామాల్లో కనిపించేవి. [...]

కార్మికులకు బీమా సౌకర్యం

మచిలీపట్నం: జిల్లాలోని అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికుల పేర్ల నమోదు కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్నట్లు కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్‌ షేక్‌ యూనిస్‌ తెలిపారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి సభ్యులను చేర్పించే కార్యక్రమం అన్ని మండలాలలోనూ చురుకుగా జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది భవన నిర్మాణ [...]

సంతాప సభలను విస్మరిస్తున్న నాయకులు

మచిలీపట్నం: హెలికాప్టర్‌ దుర్ఘటనలో అకాల మరణం పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సంఘటనను ప్రజలు ఇంకా మరువకముందే రాజకీయ నాయకులు మాత్రం ఒ పక్క ఆయన మృతుకి సంతాపాలు ప్రకటిస్తూనే మరోపక్క తన కుమారుడు కడప ఎంపి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. కాకలు తీరిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల నుండి చోటా నాయకుల వరకు ప్రతిఒక్కరూ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ సంతాప దినాలను సైతం విస్మరించి ఆందోళన పేరిట రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు [...]

Follow

Get every new post delivered to your Inbox.