న్యూఢిల్లీ: కేంద్రీయ దర్యాప్తుసంస్థ (సీబీఐ) రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబోమని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పష్టంచేశారు. లోక్సభలో కోత తీర్మానం సందర్భంగా ఎస్పీ, బీఎస్పీల మద్దతుకుతాము ప్రయత్నించలేదని ఆయన తెలిపారు. తనకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణ పూర్తయిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. దేశం ఎదుర్కొంటున్న అంతర్గతసమస్యల్లో నక్సలిజమే అతిపెద్ద సమస్యన్నారు.
Filed under: వార్తలు | Tagged: కేంద్రీయ దర్యాప్తు సంస్థ, న్యూఢిల్లీ, ప్రధానమంత్రి, మన్మోహన్సింగ్, రాజకీయ ప్రయోజనాలు, లోక్సభ, సీబీఐ | Leave a Comment »




