సీబీఐని రాజకీయప్రయోజనాలకు వాడుకోం ప్రధాని

న్యూఢిల్లీ: కేంద్రీయ దర్యాప్తుసంస్థ (సీబీఐ) రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబోమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టంచేశారు. లోక్‌సభలో కోత తీర్మానం సందర్భంగా ఎస్పీ, బీఎస్పీల మద్దతుకుతాము ప్రయత్నించలేదని ఆయన తెలిపారు. తనకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవన్నారు. స్పెక్ట్రం కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణ పూర్తయిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. దేశం ఎదుర్కొంటున్న అంతర్గతసమస్యల్లో నక్సలిజమే అతిపెద్ద సమస్యన్నారు.

సోనియాతో సమావేశమైన రోశయ్య

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రమంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాల తీరు, రాజ్యసభ ఎన్నికలు, పార్టీలో కొందరి ధిక్కారస్వరం.. తదితర అంశాలపై ఆయన సోనియాగాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధానమంత్రితో రోశయ్య సమావేశమనున్నారు.

రూ.60 వేల కోట్లతో సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్‌

న్యూఢిల్లీ: పబ్లిక్‌ రంగ స్టీలు సంస్థ సెయిల్‌ ఇండియా జార్ఖండ్‌ రాష్ట్రంలో రూ.60,000 కోట్ల పెట్టుబడులతో కొత్త స్టీలు ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీంతో సెయిల్‌ సంస్థ వార్షిక స్టీలు ఉత్పత్తి సామర్థ్యం 2020 సంవత్సరానికి 60 మిలియన్‌ టన్నులకు చేర నుంది. త్వరలో నిర్మాణం కానున్న సమీకృత స్టీలు ఉత్పత్తి ప్రాజెక్టు రెండు దశలో పనులను చేపట్టనున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ జిల్లాలోని సింధ్రీ ప్రాంతానికి చెందిన ఫెర్టిలైజర్‌ మిల్లుకు చెందిన స్థలంలో [...]

థాయ్‌లాండ్‌లో టాటా ప్యాసెంజర్‌ కారు

న్యూఢిల్లీ: ఆటోమోబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ సంస్థ థాయ్‌ల్యాండ్‌లో ప్యాసెంజర్‌ కారు విడుదలకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఉత్తరదక్షిణ ఆసియా ప్రాంతంలో ఎకో కార్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టే క్రమంలో టాటా మోటార్స్‌ ఈ ప్రకటన చేసింది. సరైన పెట్టుబడులతో థాయ్‌ల్యాండ్‌ ప్రాంతంలో ఉత్పత్తిని ప్రారంభించనున్నామని, కొత్త ప్యాసెంజర్‌ కారు విడుదల ద్వారా సంస్థ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నామని టాటా మోటా ర్స్‌ అధికారి తెలిపారు. టాటా మోటార్స్‌ కొత్త ప్యాసెంజరు కారు విడుదల ఎప్పుడన్నది వెల్లడించకపోయినా, [...]

నార్కో విశ్లేషణ తప్పు: సుప్రీం

న్యూఢిల్లీ: అనుమానితుల విషయంలో నార్కో విశ్లేషణ, మెదడు శ్రేణి రేఖాచిత్రాలు, నిజాలను వెలికి కక్కించేందుకు తీసే పోలీగ్రాఫ్‌లు తప్పనిసరిగా వినియోగించటం అక్రమమని సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఇది దర్యాప్తు సంస్థలకు ఎదురు దెబ్బ కాగలదు. ఒక వేళ నిందితుడు స్వచ్ఛందంగా సహకరించింతే అలాటి పరీక్షలు చేయవచ్చని ఆ సమాచారాన్ని తదుపరి దర్యాప్తు కోసం వినియోగించుకోవచ్చని తెలిపింది. కాగా అలాటి టెక్నిక్‌లను ఏ వ్యక్తిపై అయినా బలవంతంగా రుద్దరాదని అలా చేస్తే వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరించటంతో సమానమవుతుందని ప్రధాన [...]

తిరుపతికి మెట్రో రైలు మంజూరు చేయండి

న్యూఢిల్లీ: కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుపతి నగరంలో మెట్రోరైలు సౌకర్యం కల్పించాలని స్థానిక ఎంపీ చింతామోహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. తిరుపతిలో జనాభా నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయస్థాయి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి నగర సమీపంలో కృష్ణపట్నం నౌకాశ్రయం, శ్రీహరి కోట అంతరిక్ష పరిశోధన కేంద్రం, ప్రతిపాదిత మన్నవరం బీహెచ్‌ఈఎల్‌-ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, తిరుపతిలో అంతర్జాతీయస్థాయి రైల్వేస్టేషన్‌, [...]

యూపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కాన్షీరాం విగ్రహాలు, స్మారకచిహ్నల ఏర్పాటులో యూపీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన కాన్షీరాం, అంబేద్కర్‌ విగ్రహాలు, స్మారకచిహ్నాల పనులను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీచేసింది. లక్నోలో జరుగుతున్న పార్కుల నిర్మాణం, విగ్రహాల ఏర్పాటు పనులను ఆరుగంటల్లో ఆపాలని, పనివాళ్లను అక్కడినుంచి తరలించాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

న్యూఢిల్లీ: చైనాలోని షాంఘై నగరానికి వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 మంది మెడికల్‌ విద్యార్థులు ఢిల్లీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. విమానాశ్రయంలో డిస్‌ప్లే బోర్డు లోపం వల్ల తాము ఎక్కాల్సిన విమానాన్ని అందుకోలేకపోయామని విద్యార్థులు అన్నారు. దీంతో విమానాశ్రయంలోంలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. అంతేకాకుండా సోమవారం లోపు చైనాకు వెళ్లకుంటే తమ వీసా గడువు కూడా ముగుస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిఎం రేసులో పురంధేశ్వరి

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రేసులో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇక్కడ మీడియా ప్రతినిధుల వద్ద తోసిపుచ్చలేదు. మీరు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారా అని అడిగితే పార్టీ అధిష్టాన వర్గం ఈ విషయాన్ని పరిశీలిస్తుందని ఆమె చెప్పారు. అధిష్టాన వర్గానికి ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే సత్తా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మీరు ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నారా అని [...]

విజయలక్ష్మికి సోనియా ఫోన్‌

న్యూఢిల్లీ: బుధవారం ఉదయం నుంచి ఆచూకీ తెలియకుండాపోయిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్షేమ సమాచారం కోసం ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఫోన్‌ చేసి మాట్లాడారు. వైఎస్‌ సతీమణి విజయలక్ష్మితోను, కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోను సోనియా మాట్లాడి ధైర్యం చెప్పారు.

Follow

Get every new post delivered to your Inbox.