యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు

హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో [...]

జగన్‌ కోసం ఆందోళన ఉధృతం

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్‌ రోజు రోజుకు ఉధృతమవుతోంది. జిల్లాలో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గానూ సర్వేపల్లి శాసన సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి తప్పించి మిగతా ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. సర్వేపల్లి ఆదాల ప్రభాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి చనిపోయిన మొదటి రోజు నుంచే జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సంతాప [...]

శ్రీరిడి సాయి మహోసమాధి ఆరాధనోత్సవాల ప్రారంభం

నెల్లూరు: శ్రీరిడీ సాయిబాబా చనిపోయి 91 సంవత్సరాలు పురస్కరించుకుని ఆయన ఆరాధనోత్సవాలను నెల్లూరులో ఆదివారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకు బిక్షాటన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం స్థానిక స్థానిక సాయిబాబా మందిరం నుంచి ప్రారంభం అయింది. సాయిబాబాకు అష్టోతర శతనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆదివారం రోజంతా కొనసాగుతాయి. సోమవారం నాడు సాయిబాబాకు బంగారు పాపడంతో చేసిన కిరీటాన్ని అలంకరిస్తారు. ఆరోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం నాడు నగర సంకీర్తనంతో పాటు [...]

వచ్చే నెల మూడున ఎస్‌.పి.బాలుకు మరుకూరు కోదండరామిరెడ్డి అవార్డు

నెల్లూరు: ప్రముఖ సాహితీవేత కళాప్రపూర్ణ మరుకూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డును ఈ ఏడాది ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వడానికి కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటి నిర్ణయించింది. ఈ మేరకు స్మారక అవార్డు కమిటి కార్యదర్శి శైలజ ఒక ప్రకటన చేస్తూ అక్టోబర్‌ 3 సాయంత్రం 6 గంటలకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యానికి నెల్లూరులోని టౌన్‌ హాలులో ఈ అవార్డును ప్రదానం చేస్తారని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన నేపథ్య గాయకుడిగా ఖ్యాతి గడించిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు [...]

జగన్‌ కోసం పెరుగుతున్న ఒత్తిడి

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ జిల్లా కాంగ్రెస్‌లో క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ జిల్లాలో ఊపందుకోగా ఆనం సోదరులు జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో పాటు జగన్‌కోసం పదవి త్యాగానికి సిద్ధమంటూ తొలిసారిగా జిల్లాలో గళం ఎత్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి జగన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయకపోతే [...]

కాంగ్రెస్‌ దిశగా పీఆర్పీ నేతల అడుగులు

నెల్లూరు: అనుకున్నదంతా అయింది. శాసన సభ ఎన్నికల్లో తన ఉనికిని కోల్పోయిన ప్రజారాజ్యంపార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. శాసన సభ ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాలతోపాటు ఒక ఎంపి స్థానానికి కూడా పోటీ చేసిన పీఆర్పీ కేవలం ఒక్క నెల్లూరు తప్ప మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అది కూడా ఆనం సోదరులు తన సొంత పార్టీ అభ్యర్థి అయిన నెల్లూరు నగరంలో అనీల్‌కుమార్‌కు వ్యతిరేకంగా పోటీ చేయడం [...]

25న రెవిన్యూ ఉద్యోగుల ధర్నా

నెల్లూరు: రెవిన్యూ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ, ఈనెల 25న భోజన విరామ సమయంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి టి.రవీంద్రబాబు తెలిపారు. రెవిన్యూ శాఖలోని డిప్యూటీ తహశీల్దార్ల పోస్టులను ర్యాంక్‌ ప్రమోటీలుగా, డైరెక్ట్‌ డిప్యూటీలను సీనియర్లుగా ప్రభుత్వం పరిగణించడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిప్యూటీ తహశీల్దార్‌ కేడర్‌ ఖాళీలలో ప్రతి పది మందిలో ఏడుగురికి సీనియర్‌ కేడర్‌ పదోన్నతి [...]

రూ.3 లక్షల ధాన్యం సీజ్‌

నెల్లూరు: కావలి నుంచి అక్రమంగా తరలిస్తున్న 3 లక్షల రూపాయలు విలువచేసే 552 బస్తాల ధాన్యాన్ని కావలి అధికారులు బుధవారం రాత్రి సీజ్‌ చేశారు. పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రావు, మల్లికార్జున, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావుల బృందం ఈ దాడులు నిర్వహించింది. దగదర్తి మండలం సున్నంబట్టి వద్ద బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో పౌరసరఫరాల అధికారులు ఈ దాడులు నిర్వహించారు. రెండు లారీల్లో ఉన్న ఈ బియ్యాన్ని జిలకరమసూరి బియ్యంగా గుర్తించారు. వీటిని ఒకటి కావలిలోని [...]

ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు: ఇప్పటివరకు అటవీ ప్రాంతాల గుండా అక్రమ రవాణ జరుగుతున్న ఎర్రచందనం ఇప్పుడు ఏకంగా నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు నగరం నుంచి స్మగ్లింగ్‌ జరుగుతుండడం అటవీశాఖ అసమర్థతకు అద్దం పట్టింది. నెల్లూరు నగరంలోని పలు లాడ్జీల్లో మకాం వేసి ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లు, స్మగ్లింగ్‌ కోసం ఏకంగా నెల్లూరు నగరాన్నే ప్రధాన కేంద్రంగా చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జనసమర్ధం కలిగిన నెల్లూరు నగరంలో ఏసిఎం హైస్కూల్‌ కంపౌడ్‌లో సుమారు లక్షా 50 వేల రూపాయలు [...]

జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి మృతి ప్రభావం

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు జిల్లా అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ 2న ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాటినుంచి ఈరోజు వరకు అభివృద్ధి పనులపై ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం కొన్ని సమీక్షలను నిర్వహించినప్పటికీ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఏదో చేయాలన్న భావనతో నిర్వహించారే తప్ప సంబంధిత పథకాల అమలు ఎలా అనే అంశం జిల్లా [...]

Follow

Get every new post delivered to your Inbox.