Posts Tagged as ‘నిజామాబాద్‌’

సెప్టెంబరు 27, 2009

ఉపకార వేతనాల గడువు పొడిగింపు

నిజామాబాద్‌: విద్యార్థులు పండిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బుచ్చయ్య తెలిపారు. బిసి, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును అక్టోబర్‌ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను తిరస్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులతో పాటు అందుకు అవసరమైన [...]

సెప్టెంబరు 27, 2009

నిజామాబాద్‌లో వర్షం

నిజామాబాద్‌: గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన జిల్లా ప్రజానికానికఇజీ రాత్రి నుంచి కురిసిన వర్షం ఉపశమనం ఇచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కురిసిన వర్షంతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఖరీఫ్‌ పంటకు చివరి దశలో అవసరమయ్యే నీటి కోసం తపన పడ్డ రైతాంగానికి ఈ వర్షాలు కొద్దిపాటి మేలు చేసే అవకాశం ఉంది. అయితే అదే దశలో ప్రమాదం కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా [...]

సెప్టెంబరు 9, 2009

13న ట్రైనింగ్‌ కానిస్టేబుళ్ళకు వ్రాతపరీక్ష

నిజామాబాద్‌: పోలీసుశాఖలో స్టైఫండరీ ట్రెనింగ్‌ కానిస్టేబుళ్ళ శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీన వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని నిర్మలహృదయ్‌ బాలిక హైస్కూల్లో ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటలవరకు వ్రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయంకంటే ముందే పరీక్షా కేంద్రంలో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యూలేటర్‌లు, రిస్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తే పరీక్షకు [...]

సెప్టెంబరు 9, 2009

జిల్లాలో ఇద్దరి దారుణహత్య

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బీచ్‌కుంద మండలంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఒకరు చనిపోగా అందుకు కారణం నువ్వే అంటూ మరొకరినీ దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. బీచ్‌కుంద మండలం సీతారాంపల్లి గ్రామంలో పంటచేనుకు వెళ్ళిన బి.శ్యామ్‌ అనే (30) సంవత్సరాల యువకున్ని గుర్తు తెలియని వ్యక్తుల మంగళవారం రాత్రి గొడ్డలితో దారుణంగా నరికిచంపారు. అయితే తన సోదరున్ని చంపారని మృతుని అన్నదమ్ములు ఆవేశానికి లోనై కమ్మరి విఠల్‌(50) అనే వ్యక్తిని [...]

సెప్టెంబరు 1, 2009

గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి

నిజామాబాద్‌: గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి దొర్లింది. సోమవారం జిల్లాలోని బీర్కూర్‌ మండలంలో నిమజ్జనానికి వచ్చిన యువకుడు నీటిలో పడిమృతి చెందిన సంఘటన మరవకముందే మంగళవారం తెల్లవారు జామున జిల్లాలో మరో ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. నిజామాబాద్‌ నగరానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూపన్‌పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని గణేష్‌ మందిరం నిర్వాహకులు గణేష్‌ నిమజ్జనం కోసం ట్రాక్టర్లలో ముబారక్‌నగర్‌ గ్రామ చెరువుకు [...]