ఉపకార వేతనాల గడువు పొడిగింపు

నిజామాబాద్‌: విద్యార్థులు పండిస్తున్న ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు బుచ్చయ్య తెలిపారు. బిసి, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును అక్టోబర్‌ 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ప్రభుత్వ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను తిరస్కరిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులతో పాటు అందుకు అవసరమైన [...]

నిజామాబాద్‌లో వర్షం

నిజామాబాద్‌: గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో తల్లడిల్లిన జిల్లా ప్రజానికానికఇజీ రాత్రి నుంచి కురిసిన వర్షం ఉపశమనం ఇచ్చింది. శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు కురిసిన వర్షంతో జిల్లాలో వాతావరణం చల్లబడింది. ఖరీఫ్‌ పంటకు చివరి దశలో అవసరమయ్యే నీటి కోసం తపన పడ్డ రైతాంగానికి ఈ వర్షాలు కొద్దిపాటి మేలు చేసే అవకాశం ఉంది. అయితే అదే దశలో ప్రమాదం కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా [...]

13న ట్రైనింగ్‌ కానిస్టేబుళ్ళకు వ్రాతపరీక్ష

నిజామాబాద్‌: పోలీసుశాఖలో స్టైఫండరీ ట్రెనింగ్‌ కానిస్టేబుళ్ళ శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీన వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని నిర్మలహృదయ్‌ బాలిక హైస్కూల్లో ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటలవరకు వ్రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా సమయంకంటే ముందే పరీక్షా కేంద్రంలో ఉండాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, క్యాలిక్యూలేటర్‌లు, రిస్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తే పరీక్షకు [...]

జిల్లాలో ఇద్దరి దారుణహత్య

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బీచ్‌కుంద మండలంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఒకరు చనిపోగా అందుకు కారణం నువ్వే అంటూ మరొకరినీ దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. బీచ్‌కుంద మండలం సీతారాంపల్లి గ్రామంలో పంటచేనుకు వెళ్ళిన బి.శ్యామ్‌ అనే (30) సంవత్సరాల యువకున్ని గుర్తు తెలియని వ్యక్తుల మంగళవారం రాత్రి గొడ్డలితో దారుణంగా నరికిచంపారు. అయితే తన సోదరున్ని చంపారని మృతుని అన్నదమ్ములు ఆవేశానికి లోనై కమ్మరి విఠల్‌(50) అనే వ్యక్తిని [...]

గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి

నిజామాబాద్‌: గణేష్‌ నిమజ్జనంలో మరో అపశృతి దొర్లింది. సోమవారం జిల్లాలోని బీర్కూర్‌ మండలంలో నిమజ్జనానికి వచ్చిన యువకుడు నీటిలో పడిమృతి చెందిన సంఘటన మరవకముందే మంగళవారం తెల్లవారు జామున జిల్లాలో మరో ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. నిజామాబాద్‌ నగరానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న భూపన్‌పల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని గణేష్‌ మందిరం నిర్వాహకులు గణేష్‌ నిమజ్జనం కోసం ట్రాక్టర్లలో ముబారక్‌నగర్‌ గ్రామ చెరువుకు [...]

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి

నిజామాబాద్‌: మంగళవారం నిజామాబాద్‌ నగరంలో ఒక లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. అటవీ శాఖ ముదపుపల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ 4 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అతని నివాసంలో మంగళవారం ఉదయం రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి ఎల్‌ ప్రసాద్‌ అదే శాఖలో బీట్‌ అధికారిగా పనిచేస్తున్న మారుతి నుంచి 4 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎంవి పుస్తకంలోని సంతకం కోసం [...]

గాయ్‌పార్థీముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు

నిజామాబాద్‌: ఆంధ్ర మహారాష్ట్ర ప్రాంతాల్లో దోపీడీ దొంగతనాలకు పాల్పడుతున్న గాయ్‌పార్థీముఠాను నిజామాబాద్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేసారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాయలంలో ఎస్పీ జగన్మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గాయ్‌పార్థీముఠాకు చెందిన 13మంది గల సభ్యులు గత సంవత్సర కాలంగా ఆంధ్ర, మహారాష్ట్రలో దోపీడీ దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. నిజామాబాద్‌, మాక్లూరు, ఆర్మూరు, బాల్కోండ పోలీసుస్టేషన్‌ పరిధిలో 15చోట్ల దోపీడీలకు పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. 13 సభ్యుల్లో 9మందిని శుక్రవారం [...]

కలెక్టరేట్‌ ఎదుట ఏబివిపి ధర్నా

నిజామాబాద్‌: జిల్లాలోని బోధన్‌ పట్టణం నుండి నిజామాబాద్‌ పట్టణం వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నిజామాబాద్‌ ప్రధాన బస్టాండ్‌ వరకు నడిపించాలని ఏబివిపి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించింది. సుమారు వందమంది విద్యార్థులతో బోధన్‌ బస్టాండ్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ఊరేగింపు నిర్వహించి డిఆర్‌వో అశోక్‌కుమార్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. బోధన్‌ బస్టాండ్‌ వరకు మాత్రమే ఆర్డినరీ బస్సులను నిలపడం వల్ల విద్యార్థులకు, ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నారని, ఆర్థిక భారానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. [...]

కలెక్టరేట్‌ ఎదుట జెఎసి నిరసన

నిజామాబాద్‌: రాష్ట్ర జెఎసి (జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) పిలుపు మేరకు జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు గురువారం మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు చెందిన ఎనిమిది ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులుగా ఈ ప్రదర్శనకు విచ్చేసిన జెఎసి కార్యదర్శి శ్రీనివాసరావు, కృష్ణయాదవ్‌లు మాట్లాడుతూ, పెరుగుతున్న అధిక ధరలను వెంటనే అరికట్టి ఉద్యోగులకు, పింఛన్‌దారులకు [...]

అనుమతి లేకుండా కు.ని. ఆపరేషన్‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమతి లేకుండా కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేసిన వైద్యులపై చర్య తీసుకోవాలని శుక్రవారం ఆసుపత్రిలో బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. మైలారం గ్రామానికి చెందిన రుద్ర స్వప్న (22) గత ఆదివారంనాడు కాన్పుకోసం ఆసుపత్రిలో చేరింది. కాన్పు సమయంలో ఆమె తనకు కుణీ ఆపరేషన్‌ అవసరం లేదని కేవలం ఆపరేషన్‌ మాత్రమే చేయాలని వైద్యులకు సూచించింది. అయితే చికిత్స ప్రారంభించిన వైద్యులు ఆమెకు మరోసారి గర్భిణీ కాకుండా కుణీ ఆపరేషన్‌ చేసారు. ఈ [...]

Follow

Get every new post delivered to your Inbox.