నిప్పు లేనిదే పొగ రాదు: వైఎస్‌

హైదరాబాద్‌: నిప్పు లేనిదే పొగ రాదని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆయన అన్నారు. మంగళవారం ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ కాంగ్రెస్‌ పార్టీలోకి ఎవరిని బడితే వారిని తీసుకోబోమని ఆయన అన్నారు. పార్టీలో చేర్చుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామని ఆయన చెప్పారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి [...]

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల

వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని [...]

టిడిపి ఇక ఫినిష్‌ : వైఎస్

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ నేతల్లో చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని, ఇక టిడిపి ఫినిష్‌ కావడం తధ్యమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశం నాయకులను ప్రలోభపెడుతుందని వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి ఖండించారు. తామెవరిని ఆకర్శించడం లేదని, వారే తలుపులు తొసుకుని వస్తున్నారన్నారు. ఇక టిడిపి పని అయిపోయినట్లేనన్నారు. రోజా కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయాన్ని గతంలో తాను స్పష్టం చేస్తానని, తాను [...]

అక్రమ ప్రాజెక్టులపై టీడీపీ ధర్నా

హైదరాబాద్‌: గోదావరి, కృష్ణానదులపై పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టులకు నిరసనగా తెలుగుదేశం, వామపక్షాలు సోమవారం ధర్నా చేశాయి. తెలుగుదేశం, వామపక్షాలు శాసనసభ్యులు శాసన సభ ఎదురుగా గల గన్‌పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి. పొరుగు రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. పొరుగు రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులపై, దేవాదాయ శాఖ అవినీతిపై సభలో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు [...]

Follow

Get every new post delivered to your Inbox.