కాకినాడ: రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, టిడిపి నాయకులు చేసినప్రయత్నాలు శనివారం రాత్రికి ఫలించాయి. టిడిపి 3 డైరెక్టర్ పదవులతో సంతృప్తి చెందింది. వచ్చే ఏడాది కార్యవర్గంలో ముఖ్యపదవులను కట్టబెడతామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడంతో డైరెక్టర్ పదవులకు అంగీకరించినట్లు టిడిపి నాయకులు జి.కృష్ణా తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఎస్.శివరామసుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపగా ఫలించాయి. [...]
Posts Tagged as ‘తూర్పు గోదావరి’
సెప్టెంబరు 27, 2009
వెంకటేశ్వర ఆయుర్వేధంకు పేటెంట్ అవార్డు
కాకినాడ: సాంప్రదాయక ఆయుర్వేధ వైద్యంలో ప్రసిద్ధికెక్కిన తూర్పుగోదావరి జిల్లా చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేధ నిలయంకు ఎట్టకేలకు పేటెంట్ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్లోని హోటల్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖా మంత్రి ఆనంద శర్మ నుంచి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ డి.వెంకటశ్రీరామ్మూర్తి అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కెన్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయుర్వేధ రంగాలలో ఈ పేటెంట్ సంపాదించిన సంస్థ వెంకటేశ్వర ఆయుర్వేధ [...]
సెప్టెంబరు 27, 2009
వరకట్న వేధింపులకు యువతి బలి
కాకినాడ: కాకినాడ కొండయ్యపాలెం రైల్వేగేటు సమీపంలో నివాసముంటున్న అడబాల నాగేశ్వరరావు అలియాస్ నాగుకు నాగమూరు మండలం నవాబు పేటకు చెందిన దారం సౌజన్యను ఈ సంవత్సరం ఏప్రిల్ 17న అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. వివాహం అయినప్పటి నుంచి సౌజన్యను నాగు వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే శనివారం ఉదయం సౌజన్య తన అక్కకు ఫోన్ చేసి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని నన్ను చంపేస్తాడని భయంగా ఉందని తెలిపింది. అయితే ఆదివారం ఉదయం [...]
సెప్టెంబరు 27, 2009
ఆటో కన్సల్టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం
కాకినాడ: రాజమండ్రి నగరం నడిబొడ్డున తాడికోట సెంటర్లో శనివారం రాత్రి ఆటోకన్సల్టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ లక్ష్మీసాయి మోటార్స్లో పని చేస్తున్న సూపర్వైజర్ రాత్రి 8 గంటలకు కరెంటు పోవడంతో షాపు మూసివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే షాపులో నుంచి మంటలు రావడం చూసి వెంటనే తాళాలు పగులగొట్టి చూడగా మోటారు సైకిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు సాహసించి ఆరు మోటారు సైకిళ్లను బయటికి తీయగలిగారు. మోటారు సైకిళ్లలో పెట్రోలు [...]
సెప్టెంబరు 24, 2009
అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు
రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.