కాకినాడ: రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, టిడిపి నాయకులు చేసినప్రయత్నాలు శనివారం రాత్రికి ఫలించాయి. టిడిపి 3 డైరెక్టర్ పదవులతో సంతృప్తి చెందింది. వచ్చే ఏడాది కార్యవర్గంలో ముఖ్యపదవులను కట్టబెడతామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడంతో డైరెక్టర్ పదవులకు అంగీకరించినట్లు టిడిపి నాయకులు జి.కృష్ణా తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఎస్.శివరామసుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపగా ఫలించాయి. [...]
Filed under: వార్తలు | Tagged: కాకినాడ, తూర్పు గోదావరి | Leave a Comment »




