గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం

తిరుపతి: డివిజనల్‌ స్థాయిలో గ్రీవెన్స్‌ డే నిర్వహించడం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి వెసులు బాటు కలుగుతుందని చిత్తూరు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ శారదదేవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ ప్రతి రెండొ సోమవారం తిరుపతిలోను, నాల్గవ సోమవారం మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన సమస్యలుగా ఇంటి [...]

మంత్రి గల్లా అరుణ కడప పర్యటన

కడప: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న జిల్లాలో జరిగే ప్రజాపథం కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ఆమె పాల్గొంటారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ శశిభూషన్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న ఉదయం 8.30 గంటలకు ఒంటిమిట్ట మండలం, గొల్లపల్లె గ్రామ సభలో పాల్గొంటారు. అదే రోజ ఉదయం 11.30 గంటలకు కొండాపురం మండలం తాళ్ల [...]

బాబును ఏమీ అనను: రోజా

హైదరాబాద్‌: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన [...]

రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా [...]

సీఎం రచ్చబండ చిత్తూరు నుంచే ప్రారంభం

చిత్తూరు: ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పది ముఖ్యమైన అంశాలు లక్ష్యంగా ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సెప్టెంబర్‌ 2న తన రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో చేపట్టనున్నారు. జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమం సజావుగా జరిగేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమం కావడం పల్లె జనంతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడి, సమస్యలు తెలుసుకుని అక్కడిక్కడే వాటి పరిష్కారానికై ఆదేశాలు జారీ చేయనున్నారని తేలడంతో ఆయా శాఖల అధికారుల్లో తీవ్ర ఉద్ఘంఠత ఏర్పడింది. ప్రజలు ఏ శాఖపై విమర్శలు [...]

వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌

గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్‌ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు. కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న [...]

కాణిపాకం లంబోదరుడికి ప్రభుత్వం పట్టువస్ర్తాలు

చిత్తూరు: కాణిపాకంలోని లంబోదరడికి ప్రభుత్వం తరుపున పట్టు వస్ర్తాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇక్కడ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

గుప్త నిధుల కోసం దేవరకొండ ఆలయంలో తవ్వకాలు

పీలేరు (చిత్తూరు జిల్లా): గుప్తనిధుల కోసం పీలేరు మండలం మేళ్ళచెరువు పంచాయతీ దేవరకొండపై వెలసి ఉన్న మల్లన్నస్వామి పూరాతన ఆలయంలోను, కొండపై ఉన్న ధ్వజస్థంభం అడుగుభాగన తవ్వకాలు జరిగాయి. కొండపై ఉన్న ధ్వజస్థంభం ఏర్పాటు సమయంలో అధిక మొత్తంలో గుప్తనిధులు దాచి ఉంచి ఉంటున్నారన్న ఆశతో ఈముఠా ఆ ద్వజస్థంభాన్ని కూల్చి వేసి ముక్కముక్కలు చేసింది. అదేవిధంగా కొండ దిగువన ఉన్న ఆలయంలోను, నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు స్థానికులు సమాచారం అందించారు. నిత్యం భక్తులతో కళకళలాడే [...]

తగ్గుతున్న పంటల దిగుబడి… తప్పని ఆహార ధాన్యాల కోరత

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వివిధ పంటలను సాగుచేస్తారు. తూర్పు మండలాలలో అధిక శాతం రైతులు వరిసాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే జిల్లాను కరవు రక్కసి పట్టి పీడిస్తోంది. 1982-83 సంవత్సరంలో మూడు లక్షల 90 వేల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. మూడు లక్షల 20 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. 1981-82లో 16,163 టన్నులు జొన్నలు ఉత్పత్తి జరిగింది. 1992 సంవత్సరానికి జొన్నపంట దిగుబడి తొమ్మిది [...]

నెడ్‌క్యాప్‌ ఇంధన వనరుల కార్యక్రమాలు

చిత్తూరు: నెడ్‌క్యాప్‌ సంస్థ చేపట్టిన తరగని ఇంధన వనరుల కార్యక్రమం వలన గ్రామీణ ఇంధనం, భూగర్భ ఇంధనం కొంతవరకు తగ్గి రాబోవు తరాలకు ఇంధనం లభింపచేయవచ్చునని, స్కూల్‌ పిల్లల చేత బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి ఇంధన వనరుల పొదుపు చేయడానికి సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలను సమకూరుస్తూ గ్రామీణ ప్రజలు సహజ వనరుల ద్వారా వంట చేసుకొనే శక్తిని ఉత్పత్తి చేసే కార్యక్రమాలను నేషనల్‌ బయోగ్యాస్‌ అండ్‌ మెన్యూర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తున్నది. దీనివలన పచ్చదనంతోపాటు [...]

Follow

Get every new post delivered to your Inbox.