హైదరాబాద్: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన [...]
Posts Tagged as ‘చిత్తూరు’
ఆగష్టు 31, 2009
రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్నేత ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా [...]
ఆగష్టు 25, 2009
సీఎం రచ్చబండ చిత్తూరు నుంచే ప్రారంభం
చిత్తూరు: ప్రజాసంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పది ముఖ్యమైన అంశాలు లక్ష్యంగా ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి సెప్టెంబర్ 2న తన రచ్చబండ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో చేపట్టనున్నారు. జిల్లా అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమం సజావుగా జరిగేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమం కావడం పల్లె జనంతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడి, సమస్యలు తెలుసుకుని అక్కడిక్కడే వాటి పరిష్కారానికై ఆదేశాలు జారీ చేయనున్నారని తేలడంతో ఆయా శాఖల అధికారుల్లో తీవ్ర ఉద్ఘంఠత ఏర్పడింది. ప్రజలు ఏ శాఖపై విమర్శలు [...]
ఆగష్టు 23, 2009
వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్
గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు.
కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. [...]
ఆగష్టు 23, 2009
కాణిపాకం లంబోదరుడికి ప్రభుత్వం పట్టువస్ర్తాలు
చిత్తూరు: కాణిపాకంలోని లంబోదరడికి ప్రభుత్వం తరుపున పట్టు వస్ర్తాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇక్కడ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.