సమన్వయంతో రైతు చైతన్య యాత్రలు

గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్‌లో కలెక్టర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు [...]

గుంటూరులో విజయవంతంగా ప్రజాపథం

గుంటూరు: గత నెల 19న జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపధం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని గుంటూరు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు చెప్పారు. బుధవారం గుంటూరు నగరంలోని 47వ డివిజన్‌లో శివనాగరాజు కాలనీలో జరిగిన ప్రజాపధం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్‌, తదితర సమస్యలను సాధ్యమైనంతవరకు అక్కడికక్కడే పరిష్కరించడమే ప్రజాపధం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. గుంటూరు నగర జనాభా గత 2 సంవత్సరాల క్రితం 4 లక్షలుండగా ప్రస్తుతం [...]

మైనింగ్‌శాఖ ఆదాయ లక్ష్యం 100 కోట్లు

గుంటూరు: జిల్లాలో మైనింగ్‌శాఖ ద్వారా 2009-10 సంవత్సరానికి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు వెల్లడించారు. కలెక్టరేట్‌లోని డి.ఆర్‌.సి. సమావేశ మందిరంలో మైనింగ్‌ అధికారులు, స్టోన్‌ క్రషర్‌ యజమానులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు 2010 సంవత్సరం మార్చి కల్లా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే విషయంలో స్టోన్‌క్రషర్‌ యజమానులు అధికారులతో సహకరించాలన్నారు. క్వారీ యజమానులు ప్రభుత్వానికి ఆదాయం [...]

దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేది జర్నలిస్టు

గుంటూరు: దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడంలో జర్నలిస్టు పాత్ర కీలకమని షార్జా యూనివర్శిటీ కమ్యూనికేషన్‌ విభాగం ఆచార్యులు గనీమ్‌ సమురాయ్‌ అభిప్రాయపడ్డారు. వర్శిటీ ఇంగ్లీష్‌ విభాగం ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గోనేందుకు విచ్చేసిన ఆయన వర్శిటీ జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం విధ్యార్థులతో ఏర్పాటు చేసిన ‘జర్నిలిస్టు పాత్ర’ అవగాహన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వర్శిటీ జర్నలిజం విభాగం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.చెన్నారెడ్డి అధ్యక్షత వహించగా, ఆస్ట్రేలియా [...]

పులిచింతల నిర్వాసితుల మౌలిక వసతులు త్వరగా కల్పించండి: జెసి

గుంటూరు: పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులకు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జెసి డాక్టర్‌ గౌరవ ఉప్పల్‌ అన్నారు. తన ఛాంబర్‌లో నేడు ఆయన పులిచింతల అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు పక్కా గృహాలను వారు ఇష్టపడిన నమూనలో నిర్మించాలని, విద్యుత్‌ సౌకర్యం తదితర ఏర్పాట్లను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమ్మాజిగూడెం, బోధనం, కేతవరం గ్రామస్థులకు పునరావస ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా వీలైనంత [...]

నియమాలను పాటించని కళాశాలలపై కఠిన చర్యలు

గుంటూరు: నిబంధనలు ఉల్లంఘించే జూనియర్‌ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆర్‌ఐఓ ఎస్‌.కోటేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రవేటు జూనియర్‌ కళాశాలల తనిఖీ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 227 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు. గత ఏడాది 45 వేల మంది ఇంటర్‌ విద్యనభ్యసించగా ఈ ఏడాది 50వేల మంది ఉండవచ్చని అన్నారు. గత నెల 22వ తేదితో ఇంటర్‌ ప్రవేశాలకు గడవుపూర్తయిందని అన్నారు. జిల్లావ్యాప్తంగా 21 ప్రైవేటు కళాశాలలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని తెలిపారు. ఈ [...]

ముగ్గురు మినహా జిల్లాలో మావోయిస్టులు లేరు

గుంటూరు: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, ముగ్గురు నాయకులు మాత్రమే మిగిలారని ఎస్పీ శంఖ బత్ర బాగ్చీ తెలిపారు. దుగ్గిరాల పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, వెల్దుర్తి, నిజాంసాగర్‌ మండలాలో ముగ్గురు మావోయిస్టులు మాత్రమే మిగిలారని, వారు అడపా, తడపా ప్రాంతాల్లో సంచరిస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వంటి వారు దేశంలోనే లేరని అన్నారు. అంతటి ఆదరణ ఉన్న నాయకుడు కనుకనే ఆయన మృతితో [...]

వై.ఎస్‌. ఒక మహానీయుడు: ముప్పలనేని

గుంటూరు: ఆంధ్ర రాష్ట్రంలో ఇంటింటా వై.ఎస్‌. చిత్రపటాలు పెట్టుకోవాల్సిన మహానీయుడు ఆయన అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు ముప్పలనేని శేషగిరిరావు అన్నారు. ఆధునిక కాలంలో కూడా గ్రామీణాభివృద్ది, ఆర్థిక వ్యవస్థకు పునర్‌ జీవనం పోశారన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రైతుల సంక్షేమ వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఆయన ఆకాల మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మృతి కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్ర ప్రజానీకానికి కూడా తీర్చలేని లోటు అని ఆయన ఆవేదన [...]

రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక

మాచర్ల: ఎమ్మెల్సీగా గెలుపొందిన కొద్దిరోజులకే వచ్చిన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక పి.రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన రాజీనామాతో ఖాళీ అయిన జడ్పీటీసీ సీటును కాంగ్రెస్‌ పార్టీ చేజారకుండా అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పూర్తిస్థాయి పట్టున్నా ప్రత్యర్థులకు అంతతక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్న కోణంలో ఉన్నారు. తెదేపా తరఫున ఎంపి యోదుగల ప్రత్యేక దృష్టిపెట్టి ఆర్థిక వనరులు సమకూర్చడం, అభ్యర్థి కోటిరెడ్డికి మండలంలో సత్సంబంధాలు ఉండడం తెలుగుదేశానికి కలిసివచ్చిన అదృష్టం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ [...]

జిల్లాలో రూ.189 కోట్లతో అభివృద్ధి పనులు

గుంటూరు: జిల్లాలో 189.44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ప్రజారోగ్య శాఖ ఎన్‌.ఇ పి.రామారావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వినుకొండలో 12.37 కోట్ల రూపాయలు, నరసరావుపేటలో 17 కోట్ల రూపాయలు, సత్తెనపల్లిలో 205 కోట్ల రూపాయలు, బాపట్లలో 15.31 కోట్ల రూపాయలు, పొన్నూరులో 18 కోట్ల రూపాయలు, తెనాలిలో 19.51 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన చెప్పారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పైపు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. [...]

Follow

Get every new post delivered to your Inbox.