ఆదుకోని ఆరోగ్యశ్రీ

ఇల్లందు: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశే ఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి పేద వారి గుండె చప్పుళ్లను ఆగకుండా చేశారు. అయితే ఆయన మృత్యుఒడిలోకి వెళ్లగానే వైద్యులు ఆరోగ్యశ్రీపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు కిడ్నీలు చెడిపోయి మృత్యు వుతో పోరాడుతున్న ఓ వ్యక్తిని ఆదుకునేనాథుడు లే ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తోంది. ఇల్లందు పట్టణానికి చెందిన సముద్రాల వెంకటేశ్వర్లు(60)కు [...]

సంక్షేమం పట్టని వసతి గృహాలు

ఖమ్మం: జిల్లాలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాలను మెరుగుపర్చే చర్యలు ఈ విద్యాసంవత్సరానికి కూడా పూర్తయ్యే అవకాశాలు కనబడడం లేదు. ఆయా శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం వెరసి విద్యార్థులకు ఇబ్బంది తప్పేల లేదు. గత విద్యాసంవత్సరం ప్రారంభం సమయంలో చేపట్టిన పనులు విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఎటువంటి పనులు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంఘీక సంక్షేమశాఖ పరిధిలోని 90 వసతి గృహాల మరమ్మతుల కోసం 60 మరుగుదొడ్ల [...]

అక్కడ నీళ్లన్నీ వృధా, ఇక్కడ నీళ్లందక వ్యధ

ఖమ్మం: ఖమ్మం పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్‌ పంపులకు ఆన్‌, ఆఫ్‌ నళ్లాలు లేకపోవడంతో మంచినీరు వృధా అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, మరికొన్ని ప్రాంతాలలో నీరు వృధాగా పోతోంది. దీనిని నివారించేందుకు మున్సిపల్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పంపులకు ట్యాబ్‌లు బిగిస్తే నీటి వృధాను అరికట్టవచ్చు. తద్వారా నీటి ఎద్దడిని కొంతవరకైనా తగ్గించవచ్చు. కానీ ఈ ట్యాపును ఏర్పాటుచేయడానికి మన మున్సిపల్‌ యంత్రాంగానికి ఏర్పడుతున్న [...]

విద్యుత్‌ పరికరాలు లేక పలు చోట్ల అవస్థలు

ఖమ్మం: ఖమ్మం మున్సిపల్‌ అధికారులకు ముందు చూపు కొరవడింది. ఫలితంగా ఖమ్మం పట్టణంలోని పలు చోట్ల చిమ్మచీకటి అలుముకుంది. ట్యూబ్‌లైట్లు, ఎస్వీ ల్యాంపులు లేకపోవడంతో వీధుల్లోను, హైవేపైన అంధకారం ఏర్పడుతుంది. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనడంతోపాటు ప్రధాన వీధుల్లో ప్రమాదాలకు అస్కారం ఏర్పడింది. కోట్లాది రూపాయల పన్నులు వసూలుచేసే ఖమ్మం మున్సిపాలిటీ పనితీరు మామూలు గ్రామపంచాయితీల కన్నా హీనంగా తయారైందని పాలకవర్గ కౌన్సిలర్లే విమర్శిస్తున్నారు. పట్టణంలోని పలు వార్డులలో దాదాపు వంద వరకు [...]

వానొచ్చే వరదొచ్చే… రాకపోకలకు తావొచ్చే

ఖమ్మం: ఎప్పుడు వాన వచ్చిందో, ఎక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లతాయో, ఎక్కడ రహదారులు పొంగిపొర్లతాయో, రవాణా సౌకర్యాలు ఎక్కడ నిలిచిపోతాయో వర్షాకాలంలో గుండాల మండల ప్రజలు ఎంతో కాలంగా అనుభవిస్తున్న బాధ ఇది. గుండాల మండల కేంద్రం నుంచి భాహ్య ప్రపంచానికి ఉన్న రహదారులన్నీ గుంటల మయం, బురదల మయం కావడంతోపాటు మార్గ మధ్యంలో ఉన్న కల్వట్లు శిథిలావస్థకు చేరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గుండాల మండల ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చినా నిత్యావసర [...]

పర్యాటకంలో గిరి సాంప్రదాయం

ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక గుర్తింపు కలిగిన ఖమ్మం జిల్లా గిరిజన సంస్కృతిని పర్యాటక రంగం ద్వారా మరింత గుర్తింపు తెచ్చేందుకు ట్రైబల్‌ హార్ట్‌ పేరుతో ఏజెన్సీలోని గిరిజన సాంప్రదాయ ఆచార వ్యవహారాలను పర్యాటకులకు తెలియజేప్పెందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్‌ వాసురెడ్డి ఉషారాణి ప్రత్యేక చొరవతో భద్రాచలం కేంద్రంగా ట్రైబల్‌ హార్ట్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కోయ, కొండరెడ్డి, బంజార, నాయకపోడు తదితర తెగల గిరిజనులు అనాధిగా జీవిస్తున్నారు. భాష, సంస్కృతి, ఇతర ఆచార [...]

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి: ఏఐటియుసి

ఖమ్మం: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి నేత గుత్తుల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తుందన్నారు. తాము ఇచ్చిన డిమాండ్ల నోటీసులపై యాజమాన్యం పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాల్లో 25 శాతం వాటా ధనాన్ని కార్మికులకు చెల్లించాలని, 8వ వేజి బోర్డు ఏరియల్స్‌ మొత్తం [...]

అక్రమంగా తరలిస్తున్న కాచిరాయి సీజ్‌

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని నేలకొల్ల మండల పరిధిలోని అప్పల నర్సిహపురం, పొంగర, కట్కాచారం తదితర గ్రామాల రెవిన్యూ పరిధిలో అక్రమంగా వెలికితీస్తున్న కాచిరాయి అక్రమార్కులపై రెవిన్యూ, మైనింగ్‌ శాఖలు ఉక్కుపాదం మోపాయి. అక్రమంగా వెలికి తీస్తున్న కాచిరాయి గనులపై భారీగా దాడులు నిర్వహించి 300 మెట్రిక్‌ టన్నుల కాచిరాయి సీజ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా విలువైన కాచిరాయిని వెలికి తీయడం ఖమ్మం మైన్స్‌ ఎ.డి బాలదాసు తెలిపారు. సీజ్‌ చేసిన కాచిరాయిని తరలించడానికి [...]

బ్యాంకులో సొమ్ము స్వాహా- మెమో ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు

ఖమ్మం: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం పరిధిలోని నర్సాపురం, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస బ్యాంకులో 12 లక్షల రూపాయలను బ్యాంకు అధికారులు, ఖాతా సిబ్బంది స్వాహా చేసిన సంఘటనపై ఉన్నతాధికారులు మాత్రం ఇంతవరకు పూర్తిస్థాయిలో ఎటువంటి విచారణ చేయలేదు. అసలు ఈ స్వాహాకు బాధ్యులెవరనేది ఉన్నతాధికారులు ఇంతవరకు గుర్తించలేదు. ఇటీవల 24 మంది పాసు బుక్కుల పేర్ల మీద 12 లక్షల రూపాయలను బ్యాంకు అధికారులు, సిబ్బంది కలసి స్వాహా చేసినట్లు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. ఈ [...]

12న రాష్ట్ర బాల్‌ బ్యాడ్మింట్‌ టోర్నీ

ఖమ్మం: ఖమ్మంలో ఈనెల 12వ తేదీన అంతర్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించేందుకు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం రంగం సిద్ధం చేసింది. 12, 13 తేదీలలో రెండురోజులు నిర్వహించే ఈ టోర్నీలో జాతీయ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలంగాణా జిల్లాల బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం ప్రతినిధి సత్యదేవ్‌ తెలిపారు.

Follow

Get every new post delivered to your Inbox.