ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు

మచిలీపట్నం: జిల్లాలో రైతాంగం ధాన్యం అమ్మకం గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, మద్దతుధర కంటే తక్కువకు ఎటువంట పరిస్థితుల్లోనూ అమ్మవద్దనీ కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్ గౌరవ్‌ ఉప్పల్‌ రైతులను కోరారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుపై మద్దతుధర ఇవ్వడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సమస్యను అధ్యయనం చేసి రైతులతోను మిల్లర్లతోను మాట్లాడుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్యతో కలసి చిలకలపూడి వేర్‌హౌసింగ్‌ కార్పోరేషన్‌ గోడౌన్‌ వద్ద [...]

కృష్ణ లంక గ్రామాల్లో కలెక్టర్ ప్రజాపధం

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక దీవి గ్రామాల ప్రజాపధంలో పాల్గోన్న – జిల్లా కలెక్టరు గుంటూరు జిల్లా రాజుపాలెం నుండి నాగాయలంక మండలం ఎదురుమెండి రిజర్వాయరుకు 7.50 కోట్ల వ్యయంతో స్పాంజ్‌ బ్రిడ్జి నిర్మించి దాని ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పియూష్‌ కుమార్‌ చెప్పారు. ప్రజాపధం కార్యక్రమంలో భాగంగా, నాగాయలంక మండలం, దీవి గ్రామాలైన నాచుగుంట, ఈల చెట్లదిబ్బ గ్రామాలలో జరిగిన ప్రజాపధం కార్యక్రమంలో జిల్లా కలెక్టరు పియూష్‌ కుమార్‌ పాల్గొని [...]

నాగాయలంకలో ఉపాధి హామీ పనులు

కృష్ణా: జాతీయ ఉపాధి హామీ పధకం కింద నాగాయలంక గ్రామంలో 22.39 లక్షలు విలువగల 40 పనులు గ్రామానికి మంజూరు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ పియూష్ కుమార్ చెప్పారు. ఈ పధకం క్రింద గ్రామానికి అవసరమైన ఎన్ని పనులు అయిన చేసుకోవచ్చునని దానికి లిమిట్‌ లేదని కలెక్టరు చెప్పారు. సమగ్ర భూమి అబివృద్ది పధకం ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామంలో పంట భూములను అబివృద్ది చేసుకోవచ్చునని కలెక్టరు చెప్పారు. గ్రామంలో 48 కొత్త విద్యుత్‌ [...]

పేదలకు అండగా ప్రభుత్వం: గీతారెడ్డి

విజయవాడ: పేదలకు గుండె, క్కాన్సర్‌ వంటి పెద్దజబ్బులకు కార్పోరేట్‌ వైద్యం అందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి వీలుగా దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జె. గీతారెడ్డి పేర్కొన్నారు. ప్రజాపథం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 47వ వార్డు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి మంత్రి జె.గీతారెడ్డి [...]

ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణా జిల్లా

విజయవాడ: కృష్ణా జిల్లాను ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్థి పరచడానికి అవసరమైన ప్రణాళికలు సిద్థం చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి చెప్పారు. స్థానిక 47వ వార్డులో సోమవారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ గీతారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణాజిల్లాను పర్యాటక కేంద్రం అభివృద్థి పరచడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. హైదరాబాదులో శిల్పారామం [...]

దారితప్పిన శ్రీలంక జాలర్లు త్వరలో స్వస్థలాలకు

విజయవాడ: 2నెలల క్రితం నాగాయలంక చేరుకున్న శ్రీలంక జాలర్లను త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని శ్రీలంక డిప్యూటి కమీషనర్‌ ఫెర్నాండో తెలిపారు. వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లి దారితప్పి కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి రెండు నెలల క్రితం చేరుకున్నారు. మొత్తం ఏడుగురు శ్రీలంక జాలర్లు ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. తొలుత వారిని శ్రీలంక తీవ్రవాదులుగా అనుమానించిన పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయగా వారు దారితప్పి ఇక్కడకు చేరినట్లు ధ్రువపడింది. దీంతో వీరి విషయమై శ్రీలంక [...]

ఆంధ్రాబ్యాంకు సమ్మెతో నిలిచిపోయిన కార్యకలాపాలు

విజయవాడ: ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో నగరంలోని 16శాఖల్లో బ్యాకింగ్‌ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. కిందిస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. అయితే ముందస్తు లేకుండా వారు సమ్మెకు దిగడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాణిజ్య రాజధాని అయిన విజయవాడలో ఆంధ్రాబ్యాంకు ద్వారా రోజుకు కనీసం రూ.30కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని అంచనా సమ్మె కారణంగా ఆంధ్రాబ్యాంకు శాఖలు మూతపడ్డంతో ఖాతాదారులు ఎటిఎంల వైపు పరుగుతీసారు. అనేక ఆంధ్రాబ్యాంకు ఎటిఎంలలో [...]

భారీ వర్షంతో మళ్లీ పాత(బస్తీ)సీనే

విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌ మళ్లీ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టితో ముంపునకు గురైంది. సరిగ్గా పది రోజుల క్రితమే ఇదే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు కురసిన ఎడతురిపిలేని వర్షాల కారణంగా వన్‌టౌన్‌ జలదిగ్భంధనంలో చిక్కుకోగా ప్రజలు అధికారులు పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్న నీటినంతా బయటకు పంపించేందుకు రోడ్లకు గండిపెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా అధికారులకు కనువిప్పు కాకపోవడంతో మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో ఎక్కడినీరు [...]

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ యువకుడి దీక్ష

విజయవాడ: వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక యువకుడు శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేపట్టాడు. కమ్యూనిస్టు యోధుడి మనవడైన జయదీప్‌ ఈ దీక్ష చేపట్టడం ప్రాథాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జయదీప్‌ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టించిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌ అసలు సిసలు కమ్యూనిస్టు అని నివాళులర్పించారు. ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు పేదల జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. అలాంటి నాయకుడు మరణించిన ప్రస్తుత పరిస్థితుల్లో అవే [...]

కృషా జిల్లాలో 49 కరువు మండలాలు

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో ఒక విజయవాడ అర్బన్‌ మినహ మిగిలిన 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు విలయ తాండవం చేస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అలాగే జిల్లా అభివృద్ధి [...]

Follow

Get every new post delivered to your Inbox.