ఉప్పాడలో మత్స్యకారుల మధ్య ఘర్షణ

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో చేపల వేట విషయమై మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పోలీసుల సహా 14మంది గాయపడ్డారు. ఘర్షణను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా కెమెరా ధ్వంసం అయ్యింది. డీఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏకగ్రీవం

కాకినాడ: రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది.ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేసినప్రయత్నాలు శనివారం రాత్రికి ఫలించాయి. టిడిపి 3 డైరెక్టర్‌ పదవులతో సంతృప్తి చెందింది. వచ్చే ఏడాది కార్యవర్గంలో ముఖ్యపదవులను కట్టబెడతామని కాంగ్రెస్‌ నాయకులు హామీ ఇవ్వడంతో డైరెక్టర్‌ పదవులకు అంగీకరించినట్లు టిడిపి నాయకులు జి.కృష్ణా తెలిపారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు పీసీసీ కార్యదర్శి ఎస్‌.శివరామసుబ్రహ్మణ్యం నాలుగు రోజులుగా ఇరువర్గాలతో చర్చలు జరిపగా ఫలించాయి. [...]

వెంకటేశ్వర ఆయుర్వేధంకు పేటెంట్‌ అవార్డు

కాకినాడ: సాంప్రదాయక ఆయుర్వేధ వైద్యంలో ప్రసిద్ధికెక్కిన తూర్పుగోదావరి జిల్లా చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేధ నిలయంకు ఎట్టకేలకు పేటెంట్‌ అవార్డును దక్కించుకుంది. హైదరాబాద్‌లోని హోటల్‌ మారియట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖా మంత్రి ఆనంద శర్మ నుంచి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.వెంకటశ్రీరామ్మూర్తి అవార్డు అందుకున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, కెన్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయుర్వేధ రంగాలలో ఈ పేటెంట్‌ సంపాదించిన సంస్థ వెంకటేశ్వర ఆయుర్వేధ [...]

వరకట్న వేధింపులకు యువతి బలి

కాకినాడ: కాకినాడ కొండయ్యపాలెం రైల్వేగేటు సమీపంలో నివాసముంటున్న అడబాల నాగేశ్వరరావు అలియాస్‌ నాగుకు నాగమూరు మండలం నవాబు పేటకు చెందిన దారం సౌజన్యను ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17న అతనికి ఇచ్చి పెళ్ళి చేశారు. వివాహం అయినప్పటి నుంచి సౌజన్యను నాగు వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అయితే శనివారం ఉదయం సౌజన్య తన అక్కకు ఫోన్‌ చేసి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని నన్ను చంపేస్తాడని భయంగా ఉందని తెలిపింది. అయితే ఆదివారం ఉదయం [...]

ఆటో కన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం

కాకినాడ: రాజమండ్రి నగరం నడిబొడ్డున తాడికోట సెంటర్‌లో శనివారం రాత్రి ఆటోకన్సల్‌టెన్సీ షోరూంలో అగ్నిప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ లక్ష్మీసాయి మోటార్స్‌లో పని చేస్తున్న సూపర్‌వైజర్‌ రాత్రి 8 గంటలకు కరెంటు పోవడంతో షాపు మూసివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే షాపులో నుంచి మంటలు రావడం చూసి వెంటనే తాళాలు పగులగొట్టి చూడగా మోటారు సైకిళ్లు తగలబడుతున్నాయి. స్థానికులు సాహసించి ఆరు మోటారు సైకిళ్లను బయటికి తీయగలిగారు. మోటారు సైకిళ్లలో పెట్రోలు [...]

మరో 40 మంది వృద్ధకళాకారులకు పింఛన్‌లు మంజూరు: డిపిఆర్‌ఓ

కాకినాడ: జిల్లాలో వృద్ధకళాకారుల పింఛన్‌లు తీసుకుంటూ మరణించిన 40 మంది వృద్ధాకళాకారులస్థానంలో క్రొత్తగా 40 మంది అర్హులైన వృద్ధకళాకారులకు పింఛన్‌లు మంజూరు చేయడమైనదని జిల్లా పౌరసంబంధాధికారి వి.రామాంజనేయులు తెలియజేశారు. క్రొత్తగా మంజూరు చేసిన 40 మంది వృద్ధాకళాకారులకు ఒకనెలకు అనగా ఆగస్టు 2009 నెలకు ఒక్కొరికి రూ.500 వంతున పింఛన్‌లు మంజూరు చేయడమైనదని అన్నారు. ఈ పించన్‌ల మొత్తాన్ని చెక్కుల రూపంలో వారం రోజుల్లోగా సంబంధిత తహశీల్దార్లకు పంపడం జరుగుతుందని డిపిఆర్‌ఓ తెలిపారు. ఇంకా మరికొన్ని చనిపోయిన [...]

జిల్లాలో గత 24 గంటలలో కురిసిన వర్షపాతం నమోదు

కాకినాడ: గత 24 గంటలలో జిల్లాలో 8.8మిమీ సరాసరితో మొత్తం 530.4మి.మీ. వర్షపాతం నమోదయింది. అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం రంపచోడవరం మండలంలో నమోదుకాగా, అత్యల్పంగా 0.4మి.మీ వర్షపాతం రాజానగరం, కపిలేశ్వరపురం, సామర్లకోట మండలాలలో నమోదయింది. మండలాల వారీ వర్షపాతం వివరాలు మి.మీలలో మారేడుమిల్లి 47.8, రంగంపేట 2.4, అంబాజీపేట 6.2, వై.రామవరం 8.2, రాజానగరం 0.4, ఐనవిల్లి 14.4 అడ్డతీగల 33.8, మండపేట 8.2 ముమ్మిడివరం 36.8, రాజవొమ్మంగి 33.8, మండపేట 8.2, ముమ్మిడివరం 36.8, [...]

వడ్డీ రాయితీని అడ్డుకుంటున్న గ్రామ సమాఖ్యలు

కాకినాడ: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేని’ చందంగా తయారైంది మహిళా సంఘాల పరిస్థితి. ప్రభుత్వం వీరికి ఇస్తున్న పావలా వడ్డీ రాయితీకి గ్రామ సమాఖ్యలు గండికొడుతున్నాయి. సమాఖ్యల దయాదాక్షిణ్యాల మేరకే ఫలితం అందుతున్నది. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతున్నది. రాయితీ నిధులు లక్ష రూపాయలు తప్పుదారిపడుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ రాయితీని అవినీతి పెద్దలు తన్నుకుపోతున్నారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకు రుణాలు నూటికి రూపాయి చొప్పున, మరికొన్ని బ్యాంకులు రూపాయి పావలా చొప్పున [...]

ప్రైవేటు ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి

కాకినాడ: జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చేందుకు జవాబుదారి తనం పెంచేందుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని అలోపతి ప్రైవేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులరైజేషన్‌ వ్యాట్‌ జిల్లా స్థాయి సలహా కమిటీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ గోపాలకృష్ణ ద్వివేది, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యుల ఆమోదంతో ఏజెండాలో పొందుపర్చిన పలు అంశాలపై తీర్మాణాలు చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోం యాజమాన్యాలకు ముందుగా 90 రోజులకు తాత్కాలిక [...]

మందుగుండు కేంద్రంలో పేలుడు

కాకినాడ: కాకినాడ రూరల్‌, పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో మందుగుండు తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో కేంద్రంలోని వర్కర్లతో పాటు యజమాని కూడా గాయాలకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వర గ్రామ సమీపంలోని పొలాల్లో మందుగుండు తయారీ కేంద్రంలో తారాజువ్వల్లో మందు కూర్చుతున్న సమయంలో ఆకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనలో వి.కె.రాయ్‌ పురానికి చెందిన జి.నాగేశ్వరరావు (42) పి.సూర్యారావు (50)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిరువురిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి [...]

Follow

Get every new post delivered to your Inbox.