కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్న ఆర్డీవో: టిడిపి

కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ అధికారి, జగిత్యాల ఆర్డీవో అమయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్ల కొమ్ముకాస్తున్నాడని టిడిపి మహిళా కౌన్సిలర్‌ వడ్డెపల్లి లక్ష్మి ఆరోపించింది. శుక్రవారంనాడు మెట్‌పల్లి మున్సిపల్‌ ప్రాంతంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, టిఆర్‌ఎస్‌ విప్‌ ఒరిజినల్‌ కాగితం ఆర్డీవోకు అందజేయడం జరిగిందని, కాంగ్రెస్‌ వాళ్ల కొమ్ముకాచేందుకే జిరాక్స్‌ కాగితం అందినట్లు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాట వినాల్సిందే తప్ప, ఇలా తప్పుడు ఆరోపణలతో భుజస్కాందాలపై వేసుకొని ఇలాంటి అబద్ధాలు ఆడకూడదని [...]

హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నికలు వాయిదా

కరీంనగర్‌: మెట్‌పల్లి మున్సిపల్‌ ఎన్నికలు హైకోర్టు స్టే ఉత్తర్వులు మధ్యంతరంగా వెలువడడంతో ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జగిత్యాల ఆర్డీవో, ఎన్నికల అధికారి అమయ్‌కుమార్‌ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారంనాడు 3వ మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక జరగనున్న ప్రక్రియలోనే ఈ ఎన్నికలను నిలిపివేయాలన్న హైకోర్టు నుండి వచ్చిన పిటిషన్‌ ఆధారంగా ఈ ఎన్నికలను నిలిపివేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 24 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో కాంగ్రెస్‌కు సంబంధించి సుభాషిణి అనే కౌన్సిలర్‌ [...]

ఘనంగా సింగరేణి బొగ్గుగనుల్లో వారోత్సవాలు

కరీంనగర్‌: శుక్రవారం నుండి జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో రక్షణ వారోత్సవాలు ఘనంగా చేపట్టారు. సింగరేణి ప్రాంతంలోని 32 బొగ్గు గనుల్లో, 14 ఉపరిత గనుల్లో వారం రోజులపాటు ఈ రక్షణ వారోత్సవాలు జరుపుకుంటారు. అంతేగాకుండా గతంలో సింగరేణి ప్రాంతంలోని ప్రతి మైనింగ్‌లో బొగ్గు పెళ్లలు పైనుండి కిందపడకుండా కర్రదిమ్మెలతో సపోర్టులు చేపట్టి భద్రత నిర్వహించేవారు. ప్రస్తుత పరిస్థితులలో అండర్‌గ్రౌండ్‌లోని పైకప్పు కూలి బొగ్గు పెళ్లలు పడకుండా ఆధునీక పద్ధతిలో రూపుబోల్టింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ భద్రతను [...]

దివంగత నేత సేవలు మరవం: ఎంపీ

కరీంనగర్‌: దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలను మరువబోమని పెద్దపల్లి ఎంపి వివేకానంద అన్నారు. శుక్రవారంనాడు పెగడపల్లి మండలంలోని బతికెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దివంగత నేత రాష్ట్రంలోని రైతులకు, మహిళలకు అత్యధికంగా అభివృద్ధి చేసే దశలోనే రాజశేఖర్‌రెడ్డి పయణించడాని వారు గుర్తు చేశారు. రైతులకు [...]

జడ్పీటీసీ ఎన్నికలు 16కు వాయిదా

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికలు వై.ఎస్‌. మరణానంతరం ఎన్నికలను 8రోజులపాటు పొడిగించారు. జిల్లాలో తిమ్మాపూర్‌, ఎల్లారెడ్డిపేట మండలాల జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఈ నెల 8 జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలను 16న జరిగేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 16న ఎన్నికలు, ఒట్ల లెక్కింపు 17న జరుగుతాయని వారు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. హఠాన్మరణంతో 4రోజులపాటు ప్రచారాన్ని నిలిపివేసారు. ఎలాగైనా టిడిపి [...]

ముఖ్యమంత్రి మృతిని తట్టుకోలేక కరీంనగర్లో ఇప్పటివరకు 28మంది మృతి

కరీంనగర్‌: ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన వార్త వినగానే ఇప్పటివరకు 28మంది గుండెపోటుతో మరణించారు. హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి మృతిచెందిన నాటి నుండి టివీలలో ఆయన మృతివార్తలు వింటూ, చూస్తూ మూడురోజులపాటు జిల్లాలోని మృతిచెందారు. దివంగత నేత తనయుడైన ప్రస్తుత ఎంపీ జగన్‌ రాష్ట్ర ప్రజలకు నిబ్బరంగా ఉండాలని పిలుపునిచ్చినప్పటికీ అభిమానాన్ని తట్టుకోలేక రోజురోజుకు ఈ మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు కూడా ప్రజలకు నచ్చజెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు సుమారు 28మంది గుండెపోటుతో [...]

ప్రజలను పట్టి పీడిస్తున్న విషజ్వరాలు

కరీంనగర్‌: జిల్లాలో డెంగీ, విషజ్వరాలు ప్రజలను పట్టి పీడిస్తుంటే డాక్టర్లు మాత్రం నామమాత్రంగా వారికి వైద్యసేవలందిస్తున్నారు. గ్రామాలలో అనేకమందికి విషజ్వరాలు మొదలయ్యాయి. జిల్లా వైద్యాధికారిని డాక్టర్‌ సుభద్ర పట్టణ, మండలస్థాయిలో వైద్యాధికారులు టీంలుగా ఏర్పడి ప్రజలకు వైద్యం అందించాలని వైద్య అధికారి డాక్టర్లకు ఆదేశించినప్పటికీ మండలస్థాయి డాక్టర్లు, గ్రామస్థాయిలో ఎఎన్‌ఎంలు నామమాత్రంగా పర్యటించి వైద్యం అంతంత మాత్రాన అందిస్తున్నారు. దాంతో గ్రామాల్లో డెంగీ, విషజ్వరాలు అధికంగా పెరుగుతున్నాయి. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలోని ప్రజలను ఈ వ్యాధుల నుండి [...]

అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

కరీంనగర్‌: అప్పులు తీర్చలేని స్థితిలో జి.బాబు అనేే రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు తీర్లవంచె గ్రామస్థులు వివరించారు. సోమవారంనాడు సిరిసిల్ల మండలంలోని తీర్లవంచె గ్రామ రైతు బాబు ఊరికి చివరనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గత కొంతకాలంగా అప్పులుచేసి ఆ అప్పులను తీర్చలేక గల్ఫ్‌ దేశాలకు వెళ్లినా, అప్పులు తీరకపోవడంతో తిరిగి స్వదేశీ గ్రామానికి చేరుకున్నాడు. విద్యుత్‌ సరఫరా లేని సమయంలో ఆ వైర్లపై తప్ప తాగి పడుకుని విద్యుత్‌ సరఫరా [...]

పాఠశాలకు ఉపాధ్యాయులు రానందున విద్యార్థుల ఆందోళన

కరీంనగర్‌: నెల రోజుల నుండి ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకపోవడం వల్ల విద్య వెనుకబడే ప్రమాదం ఉందని కోనరావుపేట మండల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సోమవారంనాడు కోనరావుపేట మండల పరిధిలోని పాఠశాలకు గత నెలరోజుల నుండి ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లినవారి స్థానాల్లో కొత్త ఉపాధ్యాయులను భర్తీ చేయకపోవడంపై విద్యార్థులు ఆ గ్రామంలోని వాటర్‌పైకి ఎక్కి ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్లే తాము ఆత్మహత్యలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు హెచ్చరించారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు వాటర్‌ ట్యాంక్‌ [...]

కరీంనగర్‌లో ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’

కరీంనగర్‌: వికలాంగులకు ఉపయోగించే పరికరాలు, ఉపకారణాల విషయమై ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులను సమావేశపరిచి ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామం నుండి వికలాంగుడు ఒకరు ఫోన్‌చేసి తనకు కాలిపర్స్‌ ఇప్పించాలని కోరగా, ఇందుకు స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో వికలాంగుల ఉపకారణాలు అవసరమైనవారికి అందించేందుకు వీలుగా ట్రైసైకిళ్లు, [...]

Follow

Get every new post delivered to your Inbox.