వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యుల నివాళి

కడప: ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన భార్య ఎమ్మెల్యే విజయమ్మ, కూతురు షర్మిల, కోడలు భారతి, మనువడు, మనుమరాళ్లు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ, షర్మిల ఘాట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ వివరాలను ఇంజనీర్లు వారికి వివరించారు. టిటిడి బోర్డు మాజీ చైర్మన్‌ కరుణాకర రెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు చేరుకొని, ఘాట్‌ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి గల్లా అరుణ కడప పర్యటన

కడప: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 5న జిల్లాలో జరిగే ప్రజాపథం కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో ఆమె పాల్గొంటారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ శశిభూషన్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి 5న ఉదయం 8.30 గంటలకు ఒంటిమిట్ట మండలం, గొల్లపల్లె గ్రామ సభలో పాల్గొంటారు. అదే రోజ ఉదయం 11.30 గంటలకు కొండాపురం మండలం తాళ్ల [...]

బడుగు వర్గాలను ఆదుకున్న వైఎస్‌

కడప: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేద, బీద, బడుగు, బలహీనవర్గాల ప్రజలతోపాటు గిరిజనులు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ అన్ని విధాలుగా ఆదుకున్నారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి అన్నారు. 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత డాక్టర్‌ వైఎస్‌ వృద్ధాప్య, వికలాంగ, పింఛన్‌లను పెంచరాన్నారు. అదేవిధంగా పక్కా గృహాల నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 46 మండలాలను కరువు ప్రాంతాలుగా [...]

ఆ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

కడప: కడప జిల్లాలోని ప్రభుత్వం ప్రకటించని ఐదు మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని పీఆర్పీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని మొత్తం 51 మండలాలలో ప్రభుత్వం 46 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. ఈ ప్రకటన జిల్లా ప్రజలకు ఆనందం కలిగించేదే అయినప్పటికీ మిగిలిన మండలాలను ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వర్షాభావ పంటలపైనే ఆధారపడ్డ లక్కిరెడ్డిపల్లి, పిన్నమండం, కంభేపల్లి మండలాలతోపాటు రైల్వేకోడూరు, గోగులవారిపల్లి మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ [...]

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

కడప: జిల్లాలో కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా నిర్వహించిన వ్రాత పరీక్షలలో అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని కడప డిఎస్పీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 13వ తేదీన రాత పరీక్షలు నిర్వహించనున్నామని ఆయన అన్నారు. కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వ్రాత పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కెఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ పరీక్షలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 8 గంటల లోపే పరీక్షా కేంద్రంలోకి రావాలని చెప్పారు. [...]

పదవి ఇవ్వకపోతే రాజీనామాలు ఆమోదించండి

కడప: కడప ఎంపి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించని పక్షంలో తాము చేస్తున్న రాజీనామాలను ఆమోదించాలని ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఇన్‌ఛార్జ్‌ ఛైర్‌పర్సన్‌ ముక్తియార్‌ తోపాటు రాజుపాలెం ప్రొద్దుటూరు ఎంపిపిలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు మొత్తం 79 మంది ప్రజాప్రతినిధులు తమ రాజీనామా పత్రాలను అధ్యక్షునికి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆధ్వర్యంలో ఈ [...]

ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి

కడప: కెసి కాల్వ సాగునీటి విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.వెంకటసుబ్బరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కాల్వ నీటి విడుదలపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం కెసి కాల్వ అధికారులు ఎవరికి వారుగా ప్రకటనలు చేస్తుండడంతో రైతాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన నేడిక్కడ విడుదల చేసిన ప్రకటనలో చెప్పారు. ఆయకట్టు రైతాంగం అయోమయంలో ఉందని తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కాల్వ నీటి విడుదలపై [...]

స్వైన్‌ఫ్లూ మందుల సరఫరా: రిమ్స్‌

కడప: ప్రజలను బేంబేలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ వ్యాధి నిరోధకానికి సంబంధించిన మందులను ప్రభుత్వం సరఫరా చేసినట్లు రిమ్స్‌ రెసిడెన్సీ మెడికల్‌ అధికారి సురేశ్వర్‌రెడ్డి చెప్పారు. స్వైన్‌ఫ్లూ నిరోధానికిగానూ యాంటీవైరల్‌ మందులు ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. ఫ్లూవిఎస్‌ మాత్రలు ఆసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంచామని అన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు గానీ, అనుమానం వచ్చినవారుగానీ ఈ మందులను వాడవచ్చునన్నారు. అలాగే చిన్నపిల్లలకు సంబంధించి స్వైన్‌ఫ్లూ వ్యాధి నిరోధానికి సిరప్‌ కుడా అందుబాటులో ఉందన్నారు. వ్యాధి లక్షణాలను విచారించేందుకు వైరల్‌ ట్రాన్స్‌పోర్టు [...]

బాలచంద్రారెడ్డి ఆమరణ దీక్ష విరమణ

కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలని కోరుతూ కాంగ్రెస్‌పార్టీ నాయకుడు కోవ్వూరు బాలచంద్రారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను కలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి విరమింపచేసారు. ప్రొద్దుటూరు సర్కిల్‌లోని పుట్టపర్తి సర్కిల్‌లో ఆయన దీక్ష చేపట్టిన విషయం విదితమే. దీక్ష మంగళవారంనాటితో 3వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎమ్మెల్యే స్వయంగా మంగళవారం రాత్రి శిబిరానికి వెళ్ళి అధిష్టానవర్గం సానుకూలంగా ఉందన్న విషయాన్ని ఆయనకు వివరించి దీక్షను విరమింపచేసారు. ఇదిలా ఉండగా అదే [...]

దివంగత నేతకు సంతాపం తెలిపిన టిడిపి రాచమల్లు

కడప: ఒకప్పుడు తన రాజకీయ గురువైన దివంగత నేత వై.ఎస్‌కు టిడిపి నాయకుడు మాజీ ప్రొద్దుటూరు మున్సిపల్‌ చైర్మన్‌ రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మంగళవారం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసారు. రాయచోటి సమీపంలోని రామేశ్వరం దేవాలయంలో దాదాపు 20వేల మందికి ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒకప్పుడు డాక్టర్‌ వై.ఎస్‌ ప్రొత్సాహం వల్లే తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని తెలిపారు. అయితే స్థానిక ఎమ్మెల్యేతో వచ్చిన విబేధాల కారణంగా తాను పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. అయితే తనకు [...]

Follow

Get every new post delivered to your Inbox.