కడప: ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన భార్య ఎమ్మెల్యే విజయమ్మ, కూతురు షర్మిల, కోడలు భారతి, మనువడు, మనుమరాళ్లు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయమ్మ, షర్మిల ఘాట్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ వివరాలను ఇంజనీర్లు వారికి వివరించారు. టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర రెడ్డి, బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి వైఎస్ఆర్ ఘాట్కు చేరుకొని, ఘాట్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
Filed under: వార్తలు | Tagged: ఇడుపులపాయ, కడప, వైఎస్ఆర్ ఘాట్ | Leave a Comment »




