2, 3వ తేదీలలో మనవహక్కుల మహాసభలు

ఆదిలాబాద్‌: అక్టోబర్‌ 2,3 తేదీలలో అనంతపురంలో మానవహక్కుల వేదిక 3వరాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బాలగోపాల్‌ తెలిపారు. ఆహారభద్రత, ఆర్థికమాంద్యం బడుగుదేశాల జీవనంపై ప్రభావం శ్రీలంక తమిళలుల భద్రత అనే అంశాలపై ఈ సభలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.సభకు రాష్ట్రంలోని 20జిల్లాల నుండి సంఘం కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొంటారని ఆయన వివరించారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో వివిధ వ్యాధులతో మృతిచెందుతున్నా సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు. ఓపెన్‌కాస్ట్‌ సింగరేణిలో భూములు కోల్పోయిన [...]

తెలంగాణా విషయంలో మాది స్పష్టమైన వైఖరి: సిపిఐ

ఆదిలాబాద్‌: తెలంగాణా విషయమై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేష్‌ స్పష్టం చేసారు. తెలంగాణా విషయంలో గత 30సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూ వస్తుందని ఆయన ఆరోపించారు. నాడు చెన్నారెడ్డిని మొదలుకొని నిన్న రాజశేఖర్‌రెడ్డి వరకు తెలంగాణా ప్రజలకు ద్రోహం చేసారని విమర్శించారు. తెలంగాణా టిఆర్‌ఎస్‌ వల్ల రాదని ఆయన స్పష్టం చేసారు. టిఆర్‌ఎస్‌లో అంతర్గత సంక్షోభం ఉందని, తెలంగాణా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నడుచుకుంటూ [...]

చైర్మన్‌ ఎంపికకై క్యాంపులతో టిడిపి, కాంగ్రెస్‌ బిజీబిజీ

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి విషయమై అభ్యర్థిని ఖరారు చేయడంలో కాంగ్రెస్‌ పార్టీలో ఈనెల 30న జరగనున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎంపిక కోసం తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారు. చైర్మన్‌ పదవికి దాదాపుగా కాంగ్రెస్‌ పార్టీదేనని స్పష్టమైనప్పటికీ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీలోని రెండు గ్రూపులలో వివాదం నెలకొంది. ఒక గ్రూపుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు నాయకత్వం వహిస్తూ 28సభ్యులతో క్యాంపు నిర్వహిస్తుండగా మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి 8మంది [...]

ఆశావహులకు వేతనాలు విడుదల

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఆశా వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్‌ వాలంటరీ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు రాములు తెలిపారు. ఈ విషయమై గత కొంత కాలంగా యూనియన్‌ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని దీని ఫలితంగానే గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారితోషకాలను విడుదలచేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ఆశావహులకు సంబంధించిన మొత్తం 25 లక్షల 8 వేల రూపాయలు విడుదల అయ్యాయని జిల్లాలోని సంబంధిత [...]

కార్మికులకు వేతన సవరణ అమలు చేయాలి

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో పని చేస్తున్న కార్మికులకు వేతన సవరణ ఒప్పందం చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని విఐపిలు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సిఐటియు మహాసభలో పలు అంశాలపై తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు నెల నెల వేతనాలు చెల్లించాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. అంగన్‌వాడీ, ఆశా తదితర [...]

కరువు నివారణ చర్యల్లో అధికారులు విఫలం

ఆదిలాబాద్‌: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల మూలంగా ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ నివారణ చర్యలు చేపట్టడంలో యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ కేంద్రమంత్రి ముదోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాల చారి ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల మూలంగా ఖరీఫ్‌లో రైతులు వేసిన పంటలు పూర్తిగా నష్టపోయాయని రైతులను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం కరువు నివారణచర్యలు చేపట్టడంలో విఫలమైందని అన్నారు. ఇప్పటి వరకు నష్టం అంచనా వివరాలను సేకరించకపోవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి, సోయ, వరి [...]

డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వ్యాధులకు భయపడుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌: జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు అతలాకుతలం అవుతుండగా కొత్తగా డెంగ్యూ, స్వైన్‌ఫ్లూలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మలేరియాతో గిరిజన ప్రాంతాల్లో వందలాది మంది మృతి చెందారు. దీంతో పాటు డయేరియా, అతిసార విజృంభించడంతో అనేక మంది మరణించగా ఎంతో మంది మంచాన పడి తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. ప్రధానంగా గిరిజన మండలాలు అయిన ఇంద్రవెళ్లి, ఉట్నూరు చిలుకూరు, నార్నూర్‌, జయనూర్‌లలోని మారుమూల ప్రాంతాల్లో వ్యాధులు సోకి అనేక మంది [...]

ప్రభుత్వ విద్యపై ఉద్యోగస్థుల అయిష్టత

ఆదిలాబాద్‌: సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఆహ్లాదకరమైన వాతావరణం చదువుకు యోగ్యంగా ఉండే పాఠ శాలలు కావలసిన సౌకర్యాలు అన్నీ ఉన్నప్పటికి ప్రభుత్వ ఉద్యోగులు సర్కారి చదువులపై అయిష్టత చూపుతున్నారు. కింది స్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి వర కు అనేక మంది తమ పిల్లలను ప్రెవేటు పాఠ శాలల్లో చిదివిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువు లభించదు అన్న విషయాన్ని బలం చేకురుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో భోదిస్తున్న ఉపాద్యాయులతో పాటు భోదనేతర సిబ్బంది పిల్లలు సైతం [...]

కష్టాలు తెచ్చిన కరువు

ఆదిలాబాద్‌: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతన్నకు కష్టాలు తెచ్చిపెట్టింది. వర్షాభావంతో పంటలు బాగా దె బ్బతిని దిగుబడి తగ్గిపోయే అవకాశాలున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా నెలకొని వున్న కరువు రైతు బతుకును చిద్రం చేస్తుందన్న అందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పత్తి, సోయా, జోన్న, మొక్కజోన్న, పప్పుదినుసు పంటలు కరువు దాటికి తలలు వంచాయి. దీంతో రైతులకు భారీ స్థాయిలోనే నష్టం వాటిల్లే ప్రమాదమేర్పడింది. రాబోయే రోజుల్లో నిత్యవసర వస్తువుల ధరలు మరింత పెరిగి సాదారణ [...]

ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు నిర్వాసితులపై మారిన సింగరేణి వైఖరి

బెల్లంపల్లి‌: ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టుల కోసం సింగరేణి కంపెనీ సేకరిస్తున్న భూసేకరణలో నిర్వాసితులు అవుతున్న ప్రజల పట్ల సింగరేణి వైఖరి మారిన ట్లు తెలుస్తుంది. ఓపెన్‌కాస్టును ప్రారంభించే సమయంలో సింగరేణి కంపెనీ అధికారులు భూసేకరణ కోసం కఠినంగా వ్యవహరించి నిర్వాసితుల పట్ల ద్వంద వైఖరి అవలంబిస్తున్నారు. బెల్లంపల్లిలో ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టుల విస్తరణ కార్రక్రమాల్లో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత ప్రజలకు సింగరేణి యాజమాన్యం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ భూములు కోల్పోతున్న నిర్వాసిత [...]

Follow

Get every new post delivered to your Inbox.