జోరుగా కల్తీకల్లు వ్యాపారం

అనంతపురం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఈత వనాలు కనుమరుగు అవుతుండడం అందరికి తెలిసిందే. అయితే ఇంతవరకు పెరిగిన కొద్ది చెట్లల్లో వస్తున్న ప్రకృతి ల్లును వ్యాపారస్తులు మిశ్రమ రసాయనాలతో కల్లును తయారు చేసి ఇష్టారాజ్యంగా అమ్ముతూ లక్షలాది రుపా యలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగం అంతా ఎకై్సజ్‌ పోలీసుల కళ్ళముందే జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు, బొమ్మనహాళ్‌, రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హిరేహాళ్‌ మండలాల్లో వ్యాపారస్తులు కల్తీకల్లును తయారుచేసి అమ్ముతున్నారు. ఇటీవలె ప్రభుత్వం [...]

సాంఘిక భద్రతా పింఛన్ల పంపిణీపై సమీక్ష

అనంతపురం: సాంఘిక భద్రతా పింఛన్ల పంపిణీ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.జనార్థన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. పింఛన్ల పంపిణీతో పాటు బినామీల ఏరివేతపై కూడా దృష్టిపెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పింఛన్లను తనిఖీ చేసి విధాన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్ అనితారామచంద్రన్‌, నగరపాలక కమిషనర్‌ శివకోటి ప్రసాద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి.రంగయ్య తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నగరపాలక [...]

పొట్టకూటి కోసం పట్టణానికి వచ్చి…

అనంతపురం‌: అభివృద్ధికి చిహ్నాలుగా నిలవాల్సిన మన పట్టణాలు పేదరికానికి మురికివాడలలో ఆవాసాలుగా మారుతున్నాయి. గత ఎన్నికల సమయంలో పట్టణ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజలకు ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఎటువంటి అమలుకు నోచుకోకపోవడం చూస్తే కేవలం పట్టణ శివారు ప్రాంతాలపై రాజకీయ నాయకులు, అధికారులు శీతకన్నును ప్రదర్శిస్తున్నారనే చెప్పవచ్చు. పొట్టచేతపట్టుకుని వసలబాట పట్టిన పేదల ఉపాధికి మజిలీలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పూర్తీగా కొరవడ్డాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా [...]

చదువుకోవాలని వుంది… గిరిజన విద్యార్థి

హిందూపురం: ప్రస్తుత సమాజంలో విద్యకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. దీంతోపాటు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువులో రాణించాలన్న సంకల్పంతో వారికి మరింత మెరుగ్గా రిజర్వేషన్లు, ఫీజుల్లో రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తోంది. అయితే బడుగు బలహీన వర్గాలు చదువుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం వారిని అణగదొక్క డానికి చూస్తున్నారన్న ఆరోపణలు నిజమవుతున్నాయి. ఇందుకు సంబంధించి అనంతపురం జిల్లా మండల కేంద్రమైన కంబదూరు ప్రాంతానికి చెందిన కమలేష్‌ ఇటీవల [...]

అబ్కారీ నేరాల నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు

అనంతపురం‌: జిల్లాలో అక్రమ మద్యం నివారణ, నాటు సారా నియంత్రణతో పాటు రవాణా, అమ్మకాలపై అధికారులు దృష్టిని కేంద్రీకరించి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని అనంతపురం, పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లాల ఎకై్సజ్‌ సిఐలు, ఎస్‌ఐలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్సజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్‌ మనోరంజన్‌లు సంబంధిత జిల్లాల సూపరింటిండెంట్ల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తొలుత పెనుకొండ ఎకై్సజ్‌ జిల్లా పరిధిలో సమావేశం పూర్తి చేసిన అధికారులు, [...]

పేరుకే ఆదర్శం గ్రామం.. తాగునీటి సమస్యకు లేదు పరిష్కారం

డి.హిరేహళ్‌: మండల పరిధిలోని అనుమాపురం పంచాయతీని ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు. సామాన్య మానవునికి కావాల్సిన కనీస మౌలిక సౌకర్యాలను కల్పించడానికి దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసినది. ఇందిరమ్మ ఆదర్శ గ్రామమైన అనుమాపురంలో మంచినీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. కేవలం సత్యసాయి నీరు తప్పా పంచాయతీ నీరు సక్రమంగా రావడం లేదు. తాగునీరు కేవలం రెండు బిందెలు మాత్రమే వస్తున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని హరిజన కాలనీలో [...]

ఉపాధి అక్రమార్కులకు నోటీసులు

కూడేరు: మండలంలో 2006-08 వరకు జరిగిన ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన మేట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు, ఎపిఓకు, బ్రాంచ్‌ ఫోస్టు మాస్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపిడిఓ రెహనాబేగం తెలిపారు. జిల్లా కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, డ్వామా పిడి మురళీ ఆదేశాల మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. సామూహిక తనిఖీలో 22 లక్షల 16 వేల 465 రూపాయలు అక్రమార్కులు స్వాహీ చేసినట్లు తేలింది. బిపిఎంలు 14 లక్షల 61 వేల [...]

అనంత విద్యా కుసుమం జెఎన్‌టియు

అనంతపురం: కరవు సీమ విద్యాకుసుమం, అనంత ఆణిముత్యం జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జెఎన్‌టియు) రెండో వసంతలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌ జెఎన్‌టియు పరిధిలో ఉన్న స్థానిక జెఎన్‌టియు 2001 సంవత్సరంలో స్వయంప్రతిపత్తి సాధించి ఆగస్టు 21, 2008లో స్వతంత్ర విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. రాయలసీమ జిల్లాలతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని 130 ఇంజనీరింగ్‌ కళాశాలలు వర్శిటీ పరిధిలోకి వస్తాయి. దీంతో శుక్రవారం మొదటి వార్షికోత్సవం జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ మేరకు [...]

కరువు దెబ్బకు ‘అన్నదాతలు’ అతలాకుతలం!

అనంతపురం: కరువు అని పేరు వినపడితే రాష్ట్రంలో మొట్ట మొదటగా అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుంది. రాష్ట్రంలో అనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో వర్షాధారానికి రెండు పంటలు పండిస్తే అనంతపురం జిల్లాలో కేవలం ఒకే ఒక పంట పండుతుంది. అందులోనూ ఒకే రకమైన వేరుశనగ పంట దాదాపు 23 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారు. సకాలంలో వర్షం వ స్తే సరి లేకుంటే పంటకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి వుండదు. గత పదేళ్ళలో [...]

Follow

Get every new post delivered to your Inbox.