మా ఊరికి రావద్దు..!

కడప: బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు మండలాల్లో కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి నిర్వహించిన రోడ్‌షోను ప్రజలు అడుగడుగునా అడ్డుకున్నారు. కొన్నిచోట్ల జగన్‌కు అనుకూల నినాదాలు చేసి డీఎల్ దిష్టిబొమ్మను దహనం చేయగా, మరి కొన్ని చోట్ల డీఎల్ బృందాన్ని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణారావు బలాన్ని నమ్ముకొని రోడ్‌షో నిర్వహించిన డీఎల్‌కు బద్వేలు నియోజకవర్గంలో భంగపాటు తప్పలేదు. తొలుత కాశినాయన మండలం గొంటువారిపల్లె గ్రామంలో ప్రజలు డీఎల్ [...]

ప్రభావిత గ్రామాలపై సింగరేణి చిన్నచూపు

కమాన్‌పూర్: సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలను చిన్నచూపు చూస్తోందని రాజకీయ జేఏసీ మండల కన్వీనర్, కమాన్‌పూర్ జెడ్పీటీసీ సభ్యుడు గంట వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సెంటినరీకాలనీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభావిత గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాల్లో అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలు ఇస్తున్న అధికారులు తరువాత వాటిని విస్మరిస్తున్నారని విమర్శించారు. షేప్ నిధులతో ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్జీ-3 డివిజన్ [...]

వరంగల్ కళాకారులకు అవమానం!

కడప: కళా ప్రదర్శనలు ఇవ్వాలని పిలిపించి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని వరంగల్ కళాకారుల బృందం నాయకుడు ఏలిస్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఇందిరాభవన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదేశాల మేరకు వరంగల్ డీసీసీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి తమను కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా కళా ప్రదర్శనలు ఇచ్చేందుకు పంపారన్నారు. తాము మూడు రోజుల కిందట కడపకు వచ్చి నగరంలోని [...]

ఇక మీటరు బాదుడు!

కరీంనగర్: దివగంత వుుఖ్యవుంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమం గా వుంగళం పాడుతోంది. ఇప్పటికే పలు పథకాలపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వం తాజాగా వ్యవసాయు రంగానికి ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు సిద్ధవువుతోంది. దీంతో రైతులకు ఏడేళ్ల క్రితం నాటి కష్టాలు పునరావృతవుయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యవసానంగా రైతుల నెత్తిపై ‘విద్యుత్ బిల్లుల’ పిడుగుపడనుంది. వ్యవసాయు కనెక్షన్లకు మీటర్లు బిగించి రీడింగ్ ప్రకారం రైతుల నుంచి బిల్లులు వసూలు చేయునున్నారు. ఇటీవల ప్లానింగ్ కమిషన్‌తో జరిగిన [...]

ఇప్పటి దేవుళ్లు… ఒకప్పుడు మానవులే!

హైదరాబాద్: సత్యసాయి బాబా భౌతికకాయం వీడారన్న వార్తల్లో వాస్తవం లేదని.. అవన్నీ కట్టుకథలని భగవాన్ శ్రీసత్యసాయి భక్తుల సంఘం స్పష్టం చేసింది. ‘ఇప్పుడు మనం భగవంతుడిగా భావిస్తున్న వారు ఒకప్పుడు మానవులే. వారు భౌతికకాయం వీడిన వారే. అలాంటి వారు కూడా జీవించినప్పుడు సమకాలికులతో విమర్శలు ఎదుర్కొన్నారు. సత్యసాయి బాబా కూడా అంతే’ అని సంఘం పేర్కొంది. సంఘం సభ్యులు జస్టిస్ ఈశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్.ప్రభాకర్‌రావు, మాజీ ఐపీఎస్ అధికారి వి.అప్పారావు, మాజీ ఉన్నతాధికారి పి.ఆర్.రావు, [...]

నాటి బంకరే ఈ సొరంగం!

ఖైరతాబాద్: సైఫాబాద్ హోం సైన్స్ కళాశాల ఆవరణలో బయటపడిన నూటా యాభై సంవత్సరాల క్రితం నాటి సొరంగాన్ని పురావస్తు శాఖ అధికారులు గురువారం సందర్శించారు. నిజాం నవాబు మీర్ నవాబ్ మహబూబ్ అలీ కాలంలో బంకర్‌గా ఉపయోగించిన ఆనవాళ్లు లభించాయి. కళాశాల ఆవరణ నుంచి సచివాలయం ‘డీ’బ్లాక్ వరకు సొరంగమార్గం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో ఈ మార్గాన్ని నిజాంలు వినియోగించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నిజాంలు ఈ మార్గాన్నే రహస్య ప్రాంతంగా ఎంచుకుని కరెన్సీని ముద్రించి, దాచుకుని [...]

ఊరు వదిలిన దళితులు!

కమలాపురం: నాయకులు తమ వద్దకు వస్తున్నారంటే ఊరూ వాడా సంబరపడాలి. విందు భోజనం పెడుతున్నారంటే ఎగిరి గంతేయాలి. ఇందుకు విరుద్ధంగాఇళ్లకు తాళాలు వేసి ఊరుబయట వంటచేసుకుని ఉన్నారంటే ఊహించలేం. కానీ ఇది నిజం. పదేళ్ల క్రితం ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిన ఊరు అది. కాంగ్రెస్, టీడీపీ నాయకుల వర్గ రాజకీయాల మధ్య చిక్కి శల్యమైన గ్రామమది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల దాష్టీకం మాకొద్దంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. కడప పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు [...]

మద్యం మత్తులో షి‘కారు’

ఖైరతాబాద్: మద్యం మత్తులో వేగంగా కారు నడిపి ఓ వ్యక్తిని గాయపరిచిన నలుగురు విద్యార్థులను సైఫాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని పెనగింటి లా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రోహిత్(19) అతని స్నేహితులు రవీందర్(19) తరుణ్ (18) అకుష్ విశ్వాస్‌లు హోండాసిటీ కారులో మద్యం తాగుతూ షీకారుకు బయలుదేరారు. ఈ క్రమంలో వేగంగా కారును నడుపుతూ సాయంత్రం 5 గంటలకు లాల్‌బహదూర్ స్టేడియం వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. వాహనదారుడు గాయపడినా [...]

భూ గర్భశోకం!

హైదరాబాద్: నగరంలో భూగర్భ జలాలుఅడుగంటుతున్నాయి.నగర పరిధిలోని వివిధ మండలాల్లో గత నెలాఖరుకు నీటిమట్టాలు అనూహ్యంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పారిశ్రామికీకరణ, జనాభా పెరుగుదల,నిర్మాణ రంగం అభివృద్ధి,ఐటీ,ఫార్మా,రియల్టీ రంగాల విస్తరణతో జల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ సారి భూగర్భ జలమట్టాలు మరింత లోతుకు చేరాయి. మారేడ్‌పల్లి మండలంలో ఇంతకు ముందెప్పుడూ లేనట్టు భూగర్భ జలమట్టం 24.52 మీటర్ల లోతులో ఉంది. అమీర్‌పేటలో 19.71్ల, నాంపల్లిలో 12.13, ఖైరతాబాద్‌లో 13.65,ముషీరాబాద్‌లో 7.23 మీటర్ల [...]

పొగాకు ఎగుమతులపై కసరత్తు

గుంటూరు: ఓ వైపు పొగాకు ఉత్పత్తి తగ్గించాలని, సాధ్యమైతే పూర్తిగా ఎత్తేయాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్రం పొగాకు ఉత్పత్తిని ఎలా పెంచాలా..? అని కసరత్తు చేస్తోంది. గుంటూరులోని కేంద్ర పొగాకు బోర్డు అధికారులకు ఎగుమతులు పెంచాలంటూ ఆదేశాలిచ్చింది. రానున్న మూడేళ్లల్లో విదేశాలకు వెళ్లే అన్ని ఎగుమతుల్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా..పొగాకు ఉత్పత్తి పెంచాలని సూచించింది. దేశం నుంచి ఏటా బిలియన్ డాలర్ల విలువైన పొగాకు ఎగుమతి అవుతోంది. మూడేళ్లలో దీన్ని 20% పెంచాలంటూ [...]

Follow

Get every new post delivered to your Inbox.