హైదరాబాద్: జగన్ పార్టీ మే 13న కాలగర్భంలో కలసిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన పార్టీ పూర్తి పేరైన యువజన శ్రామిక రైతు పార్టీ పేరు చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారని… వైఎస్కు, సోనియాకు పోటీ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కడప, బెంగళూరుకు మధ్య పోటీ అని ఆయన చెప్పారు. సాక్షి మీడియా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి కథనాలు రాస్తోందని ఆయన ఆక్షేపించారు.
Filed under: వార్తలు | Leave a Comment »




