వరంగల్: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న దృష్ట్యా వాటి ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని డీజీపీ అరవిందరావు చెప్పారు. వరంగల్, కరీంగర్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోఫైనాన్స్ సంస్థల వల్ల ఎవరైనా వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో మైక్రో ఆగడాలపై ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశామని, చట్టాన్ని అతిక్రమించే మైక్రో సంస్థలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
Filed under: వార్తలు | Leave a Comment »




