యూఎస్‌ ఓపెన్‌ విజేత నాదల్‌

న్యూయర్క్‌: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌- 2010ని రఫెల్‌ నాదల్‌ గెలిచాడు. ఫైనల్‌లో సెర్బియన్‌ క్రీడాకారుడు జకోవిచ్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 6-4, 5-7, 6-4, 6-2తో నెగ్గాడు. నాదల్‌ కెరీర్‌లో ఇది తొలి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ కావడం విశేషం. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఏడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటవూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ, కారు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో… కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. మృతులంతా చెన్నై వాసులుగా గుర్తించారు.

విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు

విశాఖపట్నం: విశాఖ జిల్లా అన్నవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కూంబింగ్‌ జరుపుతున్న పోలీసులపైకి ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. రాత్రి 2 గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది.

శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి పర్యటన

శ్రీకాకుళం: నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రరాపా అధినేత చిరంజీవి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ అధినేత రాకతో శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిస్తోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం రాత్రి ఇచ్ఛాపురం చేరుకున్న చిరంజీవి ఈ ఉదయం 10 గంటలకు ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన కన్నెధార కొండలు, కాకరాపల్లి విద్యుత్తు కేంద్రాలను సందర్శించనున్నారు

రంగారెడ్డి జిల్లాలో బంద్‌

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగిలో ఐకాస నాయకులపై లాఠీఛార్జీని నిరసిస్తూ తెరాస, అనుబంద సంఘాలు మంగళవారం రంగారెడ్డి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాలో మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా పిలుపునిచ్చింది. తెరాస బంద్‌ కారణంగా వికారాబాద్‌, తాండూరు, పరిగ డిపోల్లో సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు.

పశుక్రాంతి పథకం కింద సబ్సిడీని మంజూరు

రంగారెడ్డి: పశుక్రాంతి పథకం కింద మంజూరైన యూనిట్లకు సంబంధించి ఎస్సీ లబ్దిదారులకు వెంటనే సబ్సిడీని మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిషోర్‌ ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజాదర్బార్‌లో పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన ఎస్సీ లబ్దిదారులు కలిసి సబ్సిడీని మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌ కు విజ్ఞాన పత్రాన్ని అందజేశారు. అదే విధంగా తాండూరు మండలంలో పర్వతాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని చింతామణిపట్నం గ్రామ ప్రజలు తమ గ్రామంలో 200 కుటుంబాలకు గాను కేవలం 11 [...]

29న రాష్ట్ర మత్సకారుల సహకార సంఘ ఎన్నికలు

రంగారెడ్డి: రాష్ట్ర మత్సకారుల సహకార సంఘ పాలక వర్గానికి సెప్టెంబర్‌ 29న ఎన్నికల నిర్వహించనున్న దృష్ట్యా జిల్లాలోని 44 మత్సకారుల సొసైటీల సభ్యులు ఈ ప్రక్రియలో భాగస్వాములు అవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా మత్సశాఖ సహాయ సంచాలకులు రుహామా బెంజిమెన్‌ నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 27 డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరుగుతాయని, జిల్లాకు ఒకటి చొప్పున 23 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను తమ కార్యాలయంలో సెప్టెంబర్‌ [...]

16న జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వ సభ్య సమావేశం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పి.సునితామహేందర్‌ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 16న ఉదయం 11 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు . జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.జె.సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసిలు, ఎంపిపి లు, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

కష్టాల్లో కూరగాయల రైతులు

రంగారెడ్డి: కూరగాయల రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా ఆచరణలో ఆమలు జరగడంలేదు. కూరగాయల పెంపకంపై మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇచ్చినా సకాలంలో ఆర్థిక సాయం అందించడంలేదు. యాచారం మండలంలో వాటర్‌షెడ్ పథకం కింద నందివనపర్తి, మేడిపల్లి, తక్కళ్లపల్లి, తాడిపర్తి, నానక్‌నగర్ గ్రామాల్లో 60 మంది రైతులను ఎంపి క చేశారు. కాగా ఆర్థిక సాయం అందజేత పనులు మూలనపడ్డాయి. . ఈ గ్రా మాల్లో రైతులకు కూరగాయల పెంపకంపై శిక్షనిచ్చారు.డ్వామా రూ. [...]

పంటల నష్టంపై 15లోగా నివేధిక ఇవ్వాలి

మెదక్: జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో సంభవించిన పంట నష్టం, ఇతర నష్టాలకు సంబంధించిన నివేధికను ప్రభుత్వానికి పంపడానికి వీలుగా ఈ నెల 15 లోగా సమగ్ర నివేధికను అందజేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌. సురేష్‌కుమార్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన కార్యాలయము నుండి రెవిన్యూ డివిజనల్‌ అదికారులు, వివిధ శాఖల మండలస్థాయి అధికారులతో సెట్‌ కాన్ఫరెన్సులో మాట్లాడారు. జిల్లాలో కురిసిన వర్షాలతో జరిగిన పంట నష్టం అంచనా వివరాలు ఇప్పటికే తయారు చేయడం [...]

Follow

Get every new post delivered to your Inbox.