గిరిజన ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

విశాఖపట్నం: ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్‌ వ్యాధులు ప్రభలకుండా అరికట్టడానికి, ఉత్తమ వైద్యసేవలందేలా చూడడానికి గిరిజన ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికను రుాపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఛాంబరులో ఫిర్యాదుల స్వీవకరణ అనంతరం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపథంలో త్రాగునీటి కొరకు వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వానికి విన్నవించినట్లు వెల్లడించారు. ఆయా విజ్ఞప్తులను గ్రామీణ నీటిసరఫరా , ఏ.సి.డి.పి. మరియు 12 వ ఆర్దిక సంఘం నిధులనుండి చేపట్టడానికి చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. ఏజెన్సీ [...]

ప్రజాపథం అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి

విశాఖపట్నం: ప్రజాపథం కార్యక్రమంలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలక్టరు జె.శ్యామలరావు అధికార్లను ఆదేశించారు. కలక్టరు సమావేశ మందిరంలో విశాఖపట్నం డివిజన్‌ ప్రజా ప్రతినిధులు, ప్రత్యేకాధికారులు, జిల్లా అధికార్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రజాపథంలో వచ్చిన ధరఖాస్తులు, ఫిర్యాదులపై చేపట్టిన చర్యలపై సమీక్షించారు. మండలాలు, నియోజక వర్గాల వారీగా స్వీకరించిన అర్జీలు, పూర్తి చేసిన పనులు, ఏస్థాయిలో వున్నది అన్న విషయాలను ఆయా నియోజక వర్గాల శాసన సభ్యుల సమక్షంలో [...]

కర్నూలు రహదారి విస్తరణ ప్రణాళిక

కర్నూలు: నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నుండి మెడికల్‌ కళాశాల వరకు రహదారి విస్తరణ ప్రణాళిక పనులను జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌ పరిశీలించారు. ఆసుపత్రి మెయిన్‌ గేటు వద్ద 35 అడుగులు, మెడికల్‌ కాలేజి వద్ద కొత్తగా నిర్మించిన బ్లాక్‌ వద్ద 15 అడుగుల మేర ప్రహరీ గోడ లోపలికి నిర్మించాల్సివుందని మునిసిపల్‌ కమీషనర్‌ నాగరాజరావు కలెక్టర్‌తో నివేదించారు. 20 అడుగులు, 15 అడుగుల ప్రహరీ గోడ లోపలికి వెళితే ఎంత స్థలము వస్తుందన్న వివరాలను [...]

అక్రమ కట్టడాలపై వారంలో నివేదిక

గుంటూరు: జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో ప్రభుత్వ స్ధలాలలో నిర్మించిన అక్రమ కట్టడాల జాబితాను వారం రోజులలోపు తయారు చేయాలని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి జి.సత్యకుమార్‌ తెలియచేశారు. కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అక్రమ కట్టడాల గురించి సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పుపై చేయవలసిన తదుపరి చర్యల గురించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మునిసిపల్‌ కమీషనర్లతోపాటు, పోలీస్‌, రెవెన్యూ ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ బి, పంచాయితీ రాజ్‌ శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి [...]

డిశంబరు మాసాంతానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక

అనంతపురం, కడప: రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను అధ్యాయం చేయడానికి ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన పర్యటనలను రాయలసీమలో ప్రారంభించింది. తొలుత సోమవారం అనంతపురం జిల్లాలో మొదలుపెట్టిన ఈ అధ్యాయన యాత్ర మంగళవారం కడప జిల్లాలో కొనసాగింది. కమిటీ సభ్యుడు అబూసాలెహ సమీర్‌, సీనియరు కన్స్‌లెంట్‌ జోషి బెంగళూరు నుంచి అనంతపురం చేరుకున్నారు. రాష్ట్ర సరిహద్దు సమీపానవున్న కొడికొండ చెక్‌ పోస్టు వద్ద గల పర్యాటక అభివృద్ది సంస్థ అతిథి గృహానికి చేరుకుని స్వల్ప విశ్రాంతి అనంతరం [...]

సీజనల్ వ్యాధులపై అనుక్షణం అప్రమత్తం

ఆదిలాబాదు: సీజనల్‌ వ్యాధులు వ్యపించకుండా పారిశుద్ద కార్యక్రమాలపై అధికారులు శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్‌ పి. వెంకటేశ్వర్లు అధికారులకు ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యలయంలో జిల్లా కలెక్టర్‌ పారిశుద్ద కార్యక్రమాలపై మున్సిపల్‌ కమీషనర్‌లు, పంచాయతీరాజ్‌ అధికారులతో ప్రీ రివ్యు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షకాలంలో అపరిశుద్ది పరిస్థితులలో దోమలు పెరిగే అవకాశం చాలా ఉన్నందున మున్సిపాలిటీ, గ్రామపంచాయితీ అధికారులు వెంటనే పారిశుద్ద కార్యక్రమాలు చేపట్టి సీజనల్‌ వ్యాదులు వ్యాపించకుండా కట్టుదిట్టుగా చర్యలు చేపట్టాలని [...]

ఉప ఎన్నిక జరిగే కేంద్రాల్లో కలెక్టర్ పర్యటన

ఆదిలాబాద్: సిర్పూర్‌, చెన్నూర్‌, మంచిర్యాలలలో జులై మాసంలో నిర్వహించనున్న ఉప ఎన్నికలలో ఏలాంటి అవాంఛనియ సంఘంటనలు జరగకుండా ఇప్పటినుండే గట్టి బందోబస్త్‌ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ పి. వెంకటేశ్వర్లు తెలిపారు. ఉప ఎన్నికల కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు గాను బాలకల రెసిడెన్షియల్‌ పాఠశాల, బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల, సంజయ్‌ గాంధీ పాల్‌టెక్నిక్‌ కళాశాలలో గదులను పరీశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిర్పూర్‌, చెన్నూర్‌, మంచిర్యాలల నియోజక వర్గాలలో జులై నెలలో నిర్వహించనున్న ఉప ఎన్నికలు [...]

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి

ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ప్రజాఫిర్యాదుల కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి వచ్చిన వారు విన్నవించారు. తొలగించిన రేషన్‌ కార్డులను పునరుద్ధరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సకాలంలో అందించాలని, ఇందిరమ్మ గృహాల బిల్లులను త్వరగా చెల్లించాలని సిపిఎం (యం) పార్టీ, [...]

వింబుల్డన్‌ క్వార్టర్స్‌లో ఫెదరర్‌

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) అనాయాస విజయంతో క్యార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన మెల్జర్‌తో తలపడిన నెంబర్‌ – 1 ఫెదరర్‌ 6-3, 6-2, 6-3తో వరుస సెట్లలో గెలుపొంది ముందంజ వేశాడు. మరో ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ స్టార్‌ సొంగా (పదో సీడ్‌) 6-1, 6-4, 3-6, 6-1తో తన దేశానికే చెందిన 32వ సీడ్‌ బెన్నెట్యూకు షాక్‌ ఇచ్చి క్వార్టర్స్‌ బెర్త్‌ ఖాయం [...]

గుర్తింపు పొందిన కళా సంస్థల వివరాలు

ఆదిలాబాద్: జిల్లాలో గుర్తింపు పొందిన కళా సంస్థలకు సంబంధించిన వివరాలను ఆదిలాబాదు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయమునకు సమర్పించాలని జిల్లా కలెక్టరు పి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాదు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వంచే పలు పండుగలు, సందర్భాలలో కవి సమ్సేళనాలు, నాటక పోటీలు, ఉగాది వేడుకలు, వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహింప బడుచున్నవని, జిల్లాలోని కళాకారులకు, కళా సంస్థలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు జిల్లాలోని కళాసంస్థలు, కళాకారులకు సంబందించిన వివరాలను సేకరించడం జరుగుచున్నదని, కళాకారులు, [...]

Follow

Get every new post delivered to your Inbox.