రెవెన్యూ కార్యాలయాల పనితీరుపై ఇక సమీక్ష

రంగారెడ్డి: మండల రెవెన్యూ కార్యాలయాల పనితీరును ఇకపై డివిజన్ల వారిగా సమీక్షించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎమ్‌.దానకిషోర్‌ వెల్లడించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న తహసీల్దార్ల కార్యాలయాల పనితీరును ఆయా డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో రెవెన్యూ అధికారుల సమావేశాలు నిర్వహించి క్షుణ్ణంగా సమీక్షించడంతోపాటు ప్రభుత్వ భూములను ప్రత్యేకంగా తనిఖీ చేస్తామని అన్నారు. ఇందులో బాగంగా జూలై 8న చేవెళ్శ డివిజన్‌కు సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తామని, జూలై 9న డివిజన్‌లోని [...]

ఆదిలాబాద్ జిల్లాలో 40 ఆరోగ్య శ్రీ శిబిరాలు

ఆదిలాబాద్: జులై నెలలో జిల్లా వ్యాప్తంగా 40 రాజీవ్‌ ఆరోగ్య హెల్త్‌ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 1వతేదీన కెరమెరి మండలం ధనోరాలో, తలమడుగు మండలం సకినాపూర్‌లో, కాగజ్‌నగర్‌ మండలం శివపురంలో, నిర్మల్‌ మండలం విశ్వనాధ్‌పేట, మందమర్రి పట్టణం 15వ వార్డులో, 2వ తేదీన మామడ మండలం బూరుగుపల్లి, నెన్నెల మండలం దమ్మిరెడ్డిపేట, తాంసి మండలం గోత్కూరి, జైనూర్‌ మండలం లెండిగూడ, 3న వేమనపల్లి మండలం బయ్యారం, దహేగాం మండలం గొర్రెగుట్ట, [...]

సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థకు టోకరా

హైదరాబాద్‌: వ్యాపార సంస్థగా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ప్రముఖ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి కనెక్షన్లు సంపాదించి, మూడు రోజుల్లో 30 లక్షల రూపాయల మేర బిల్లుచేసి బిచాణా ఎత్తేసిన ఒక ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ కనెక్షన్ల ద్వారా వ్యక్తిగత వినియోగదారులకే కాకుండా చిన్న చిన్న కాల్‌ సెంటర్లకు కూడా అంతర్జాతీయ కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించి భారీగా డబ్బులు దండుకున్నారు. బిల్లు గరిష్ఠ పరిమితి దాటగానే తప్పుకున్నారు. కొన్నాళ్లకు మరో వ్యాపార [...]

కలక్టర్ క్యాంప్‌ కార్యాలయానికి హంగులు

విజయనగరం: జిల్లా కలక్టరు కేంప్‌ కార్యాలయంపై నిర్మించిన సమావేశ మందిరంను జిల్లా కలక్టరు జి.రామనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భరగా కలక్టరు మాట్లాడుతూ జిల్లా అధికారులందరికీ కలిపి సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు ఇబ్బంది కలిగేదని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశ మందిరాన్ని నిర్మించ తలపెట్టామని తెలిపారు. జిల్లా అధికారుల సమావేశాలకు సౌఖ్యంగా వుంటుందని, అయితే మందిరాన్ని సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహారావు మాట్లాడుతూ ఈ సమావేశ మందిరం [...]

వలన రైతు కూలీలకు ఉపాధి హామీ

విజయనగరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వలన రైతుకూలీలకు ఉపాధి లభిస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి వట్టి వంతకుమార్‌ అన్నారు. జిల్లా రాక సంబంధర్భంగా మంత్రి పూసపాటిరేగ మండలం గోవింధపురం గ్రామంలోని గీతా భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులు గర్వించదగిన రీతిలో సాగుతున్నాయని చెప్పారు. ఈ సంవత్సరం ఈ మూడు మాసాల [...]

ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్‌

రాంచీ: మావోయిస్టులు ఐదు రాష్ట్రాల్లో రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లలో మంగళవారం అర్థరాత్రి నుంచి బంద్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లెఫ్ట్‌ వింగ్‌ గెరిల్లాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను దారిమళ్లించింది. రాంచీ-ఢిల్లీ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌, రాంచీ-వారణాసి ఇంటర్‌సిటీ, సంబల్‌పూర్‌-వారణాసి ఇంటర్‌సిటీ రైళ్లను గోమో-గయా-మొగల్‌సరాయ్‌ రూట్లలో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే బంద్‌ [...]

తీరప్రాంత భద్రతలో నావికాదళం కీలకపాత్ర

విశాఖపట్నం: భారత దేశ భద్రతతో పాటు తీర ప్రాంత రక్షణ కోసం రూపొందించిన ఐ.ఎన్‌.ఎస్‌ కంకార్సో మరియు ఐ.ఎన్‌.ఎస్‌. కొండుల్‌ పాస్ట్‌ ఎటాక్‌ నౌకలు నౌకాదళానికి కలికితురాయిగా రాష్ట్రగవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరశింహన్‌ అభివర్ణించారు. సువిశాల తీరప్రాంతాన్ని స్మగ్లర్లు, తీవ్రవాదుల నుండి రక్షించడానికి దేశీయంగా నిర్మించిన అత్యాధునిక నౌకలుగా పేర్కొన్నారు. జీ.ఆర్‌.ఎస్‌.ఇ. కలకత్తావారు నిర్మించిన నౌకలను రూపొందించిన ఇంజనీర్లను, నేవల్‌ అధికార్లను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. తూర్పున సూర్యోదయమౌతుందని, తూర్పుతీర రక్షణ విషయంలో దిన దిన ప్రవర్తమానమౌతుందని అభిప్రాయపడ్డారు. [...]

దేవరాయల ఏర్పాట్లపై మంత్రి గీతారెడ్డి సమీక్ష

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధానియైన పెనుకొండనందు ఆగస్టు మాసం 6, 7, 8 తేదిల యందు నిర్వహిస్తున్నందున ఈ ముగింపు ఉత్సవాల కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్ట్మాకతంగా చిరకాలం గుర్తుండేలా నిర్వహించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ పర్యాటక, సాంస్కృతిక వ్యవహరాల శాఖ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి, జిల్లా ఇన్‌ చార్జి కలెక్టరు అనితారామచంద్రన్‌కు సూచించారు. రాష్ట్ర మంత్రులు డా జె .గీతారెడ్డి, యన్‌ .రఘవీరారెడ్డి, సాంస్కృతిక వ్యవహరాల [...]

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ క్రింద జూలైలో వైద్య శిబిరాలు

రంగారెడ్డి: రాజీవ్‌ ఆరోగ్యశ్రీ క్రింద జూలై మాసంలో జిల్లాలోని 24 మండలాల్లో 27 వైద్య శిభిరాలను నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ యం.దానకిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య శిభిరాలను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో, పట్టణ హెల్త్‌ సెంటర్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జూలై 2న దారూర్‌ మండలం నాగారంలో, జూలై 3న శామీర్‌పేట మండలం ఉద్దమర్రిలో, 5న శంకర్‌పల్లి మండలం అనంతప్పగూడలో, 6న శంషాబాద్‌ మండలం [...]

ఢిల్లీలో రూ.15కే భోజనం

న్యూఢిల్లీ: హల్వా, అన్నం, పూరీ, చపాతీ.. తదితర వంటకాలతో రోజూ రెండు పూటలా కలిపి రూ.30కే భోజనం దొరికితే… ఢిల్లీ సర్కారు ఇదే పనిచేసింది. పేదలకు అతి తక్కువ ధరకు పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని చేపట్టింది. ‘జనాహార్‌ యోజన’ పేరిట ప్రవేశపెట్టిన ఈ పథకం కింద పేదలకు పూటకు రూ.15కే పౌష్టికాహారం లభించనుంది. సీఎం షీలాదీక్షిత్‌ పథకాన్ని ప్రారంభించారు.

Follow

Get every new post delivered to your Inbox.