ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వద్దు

హైదరాబాద్: కుల, వికలాంగులకిచ్చే ధృవీకరణ పత్రాల జారీలో అలసత్వం ప్రదర్శించవద్దని, వెంటనే జారీ చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. గత వారం పెండింగ్‌ లో నున్న సమస్యల వివరాలు ముఖ్య ప్రణాళికాధిరిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సమస్యల వివరాలు ఎన్ని పరిష్కారమయినాయి? ఎన్ని పెండింగ్‌ [...]

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: వాతావరణ శాఖ అధికారులు తెల్పినట్లుగానే ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతం ఇవి దక్షిణ అరేబియా సముద్రతీర ప్రాంతాలు, కేరళ, దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో పూర్తిగా విస్తరించాయని విశాఖపట్టణంలోని వాతావరణ పరిశోధన విభాగం తెలిపింది. కర్ణాటక, గోవా ప్రాంతాల్లో రుతుపవనాలు 48 గంటల్లో విస్తరిస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మన రాష్ట్రంలో కూడా రాగల రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇవి తొలుత ఆరోగ్యవరం [...]

నివేదిక ఆధారంగా జగన్‌పై చర్యలు: జయంతి

న్యూఢిల్లీ: జగన్‌ ఓదార్పుయాత్రపై ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంఛార్జీ వీరప్ప మొయిలీ ఇచ్చే నివేధిక ఆధారంగా అధిష్టానం చర్యలు ఉంటాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్‌ తెలిపారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ఏ ఒక్కరో బలహీనపర్చలేరని ఆమె తెలిపారు. ఇప్పటికే జగన్‌ ఓదార్పుయాత్రపై అధిష్టానం సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా జయంతి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా మొయిలీ ఇచ్చే నివేదిక కోసమే అధిష్టానం వేచి ఉన్నట్లు తెలుస్తుంది.

మున్సిపాల్టీ అభివృద్దికి కృషి: మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: శక్తి, సామర్ధ్యాలున్నంతవరకు పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం ఉదయం పురపాలక సంఘం కార్యాలయం వెనుక ఉన్న పట్టణ ప్రజా ఆరోగ్యకేంద్రం రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన ఆదునీకరణపనులకు అయన శంకుస్ధాపన చేశారు. రూ.30లక్షల వ్యయంతో ఆదునీకరించిన పురపాలక సంఘం సమావేశమందిరాన్ని ప్రారంభించారు. పురపాలక సంఘం అధ్యక్షరాలు యం .వి.పద్మావతి అధ్యక్షతన నూతన సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ [...]

చిలకలగూడలో దోపిడి దొంగల భీభత్సం

హైదరాబాద్‌: చిలకలగూడలో దుండగులు విభత్సం సృష్టించారు.ముత్తూట్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.2 లక్షలు తీసుకొని వస్తుండగా కళ్లలో కారం చల్లి డబ్బు అపహరించారు. చిలకలగూడ, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, గాంధీ ఆసుపత్రి ప్రాంతం, ముషీరాబాద్‌లో ఇటీవల కాలంలో చైన్‌ స్నాచర్లు, పిక్‌ పాకెటర్లు విచ్చల విడిగా దోపీడీలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం తమయ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బాధితులు ఫిర్యాదులు చేసిన పోలీసులు సరిగా స్పందించక పోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ప్రతి రెండు రోజులకు మూడు మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో నక్సలైట్ల హింస ఎంత తీవ్రంగా ఉందో చెప్పే గణాంకాలివి! ఐదేళ్లుగా వారు ప్రతి రెండు రోజులకు ముగ్గురు వ్యక్తులను చంపేస్తున్నారు. 2005 నుంచి నక్సలైట్ల హింస కారణంగా దాదాపు 2,670 మంది మృతిచెందగా, వీరిలో 1,680 మంది పౌరులు, 990 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. ఐదేళ్లలో వివిధ ఘటనల్లో 1,440 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ‘సౌత్‌ ఏషియా టెర్రరిజం పోర్టల్‌’ ఈ గణాంకాలను వెల్లడించింది. భద్రతా అంశాలపై అధ్యయనంచేసే ‘ది ఇన్‌స్టిట్యూట్‌ [...]

అగ్నిగుండంలా మండుతున్న కొత్తగూడెం

కొత్తగూడెం: భగభగ మండే అగ్నికీలల్లో జీవించినట్లు ఉంది పరిస్థితి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే జనజీవనం కకావికలమవుతోంది. ఆదివారం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఉష్ణోగ్రత 49.5 డిగ్రీలు నమోదైంది. పరిశ్రమల్లో ఇది మరో రెండు డిగ్రీలకు పైగానే ఉంటుందనేది నిపుణుల అంచనా. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జిల్లాలో 65 మందికి పైగా వడదెబ్బతో మృతిచెందారు. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. లైలా తుపానుతో కొంత ఊరట లభించినప్పటికీ రోహిణి కార్తెలో [...]

కోస్తా ఆంధ్రపై ఉపరితల ద్రోణి

విశాఖపట్నం: ఉక్కపోత, ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కోస్తా జిల్లాల ప్రజలకు మరో చల్లని కబురు వచ్చింది. ఈ జిల్లాలపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఈ ఉపరితల ద్రోణి తూర్పు కోస్తా జిల్లాలపై ఆవరించి ఉంది. ఒరిస్సాలోని కోస్తా తీరంలో ప్రారంభమైన ఈ ద్రోణి రాష్ట్రంలోని కోస్తా జిల్లాల మీదుగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో [...]

ప్రేమ ఫలించలేదని యువజంట ఆత్మార్పణం

రాజమండ్రి: తమ ప్రేమ సఫలం కాకపోవడంతో ఓ యువజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. ద్వారాపూడి గ్రామంలోని బంగారమ్మ కాలనీకి చెందిన గనిశెట్టి కల్యాణి (19), తీగరెడ్డి గోపి (21) కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. మరోపక్క కల్యాణి తల్లిదండ్రులు ఆమెకు కోరుకొండ మండలం ములగాడకు చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం [...]

రవిశంకర్‌పై దాడి జరగలేదు: డీజీపీ

బెంగళూరు: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌పై దాడి జరగలేదని కర్ణాటక డీజపీ అజయ్‌కుమార్‌ సింగ్‌ స్పష్టం చేశారు. వాస్తవానికి రవిశంకర్‌ వెళ్లిన ఐదు నిముషాలకు ఆగంతకుడు కాల్పులు జరిపినట్టు ఆయన వెల్లడించారు. కాల్పులు దాదాపు 700 అడుగుల దూరంనుంచి జరిగాయని ఆయన చెప్పారు. కేసు నమోదులో జరిగిన గందరగోళం కారణంగానే రవిశంకర్‌నే టార్గెట్‌గా చేసుకొన్నారన్న వార్తలు వెలువడ్డాయని డీజీపీ వివరణనిచ్చారు.

Follow

Get every new post delivered to your Inbox.