సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

గుంటూరు: జిల్లాలో జరుగుతున్న ప్రజాపథం కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలను విన్నవించుకుని పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు అన్నారు. శుక్రవారం పొన్నూరు నియోజకవర్గం పెదకాకాని మండలం వెంకటక్రిష్ణాపురం గ్రామంలో జరిగిన ప్రజాపథం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలలో ప్రతి పేదవానికి న్యాయం జరుగుతుందన్నారు. నిరుపేద కూలీలకు పనులు కల్పించడం ద్వారా వారి ఆర్ధిక స్థితిగతులను మెరుగు పరచే పథకం జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకమని [...]

దేశ భవిష్యత్తుకు జనాభా గణనే మూలం

కడప: దేశ భవిష్యత్తుకు యోగ్యమైన ప్రణాళిక రూపకల్పనకు ఉపయోగపడే జనగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని నగర మేయర్‌ పి.రవీంద్రనాదరెడ్ఖి పిలుపునిచ్చారు. శుక్రవారం మేయర్‌ స్వగృహంలో జనాభాగణన వివరాలను నమొదు చేశారు. సూపర్‌ వైజర్‌ శివారెడ్డి, . ఎన్యూమరేటర్ స్వర్ణలతకు మేయర్‌ తన కుటుంబ వివరాలను తెలపగా వారు సంబంధిత పత్రాల్లో నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతి పదేళ్ల కోసారి జనాభాగణన ప్రక్రియ జరుగుతుందన్నారు. 2001 తర్వాత 2010లో మళ్లీ జనాభాగణన జరుగుతోందన్నారు. [...]

బడుగుల సంక్షేమానికి చర్యలు: గల్లా

చిత్తూరు: మహిళలు రైతులు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామాత్యులు శ్రీమతి గల్లా అరుణకుమారి పేర్కోన్నారు. శుక్రవారం ఉదయం గుడిపాల మండలంలో చిత్తపార, సి.బండపల్లి, పాపసముద్రం పంచాయితిలలో ఐదోవిడత ప్రజాపథంలో బాగంగా జరిగిన గ్రామసభలలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గోని ప్రసంగించారు. ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన జరిగిన ప్రజాపథం సభలో మంత్రి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి అమలుచేస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికి సంక్షేమ [...]

సొరేన్‌ను కొనసాగించేందుకు భాజపా సంసిద్ధత

రాంచీ: జార్ఖండ్‌ రాజకీయాలు సస్పెన్స్‌ సినిమాను మించాయి. పూటకో మలుపు తిరుగుతూ ప్రజలు ఔరా అనుకునేలా చేస్తున్నాయి. మొన్నటివరకు భాజపా మద్దతు తీసుకున్న ముఖ్యమంత్రి శిబూసొరేన్‌ పార్లమెంటులో కోత తీర్మానాల అనంతరం రూటు మార్చారు. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం నడిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో భాజపా సొరేన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించింది. అనంతరం సొరేన్‌ కుమారుడు హేమంత్‌ పొరేన్‌ భాజపాకు మద్దతు ప్రకటించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. తీరా ఈరోజు మళ్లీ సీను మారింది. భాజపా పార్లమెంటరీ [...]

డేరాసచ్చాసౌదా కార్యాలయంలో తొక్కిసలాట

ఐదుగురు మహిళల మృతి చండీగఢ్‌: హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరాసచ్చాసౌదా ప్రధాన కార్యాలయంలో తొక్కిసలాట జరగడంతో ఐదుగురు మహిళలు మృతిచెందారు. డేరా ఆవర్భావ దినోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో ప్రసాదం పంపిణీ సందర్భంగా భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

‘జార్ఖండ్’పై భాజపా భేటీ

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ రాజకీయాలపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు కాసేపట్లో సమావేశంకానుంది. భాజపా నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ కుమారుడు హేమంత్‌సోరెన్‌ లేఖ రాయడంతో శిబూసోరెన్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ అంశమై భాజపా పునరాలోచనలో పడింది. జార్ఖండ్‌ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పార్టీ అధినేత నితిన్‌గడ్కరీ అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో తల్లీ,కొడుకుల హత్య

అమ్రాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని వంకేశ్వరంలో తల్లీ కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. మృతురాలు వంకేశ్వరం వసతిగృహంలో పనిచేస్తున్నారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 65 శాతం ఉత్తీర్ణత ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. పరీక్షలు రాసినవారు 9,17,794 మంది కాగా 4,50,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్‌ బోర్డు ఎదుట ఎస్‌.ఎఫ్‌.ఐ ఆందోళన ఇంటర్‌ బోర్డులో సెకండియర్‌ ఫలితాల హడావుడి ఓ వైపు కొనసాగుతుంటే మరోవైపు బయట ఎస్‌.ఎఫ్‌.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజును బోర్డు ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న 20 రూపాయలనుంచి 100 రూపాయలకు [...]

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చిచంపాయి. తెల్లవారుఝామున గస్తీ నిర్వహిస్తున్న భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమయింది. ఈ సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు.

వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఈ ఏడాది రైతులకు 38వేల కోట్ల రూపాయల పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చే పంట రుణాలపై 12లేదా 13 తేదీల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సచివాలయంలో ఈరోజు వ్యవసాయశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 2006లో రాష్ట్రప్రభుత్వం పంపిన ముసాయిదాకు అనుగుణంగా 2004 విత్తనచట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టటంపై హర్షం వ్యక్తం చేశారు. విత్తనాల్లో నాణ్యత లోపిస్తే పరిహారంపైన, విత్తనాల ధర నిర్ణయించే అంశంపైనా [...]

Follow

Get every new post delivered to your Inbox.