జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ పట్టణ ప్రజలకు బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ సర్వీసును అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలాంటి పెద్ద నగరాలకి పరిమితమైన త్రిజి సేవలు ఇకనుండి పట్టణ ప్రజలకు అందనున్నాయి. జిల్లాలో తొలిసారిగా త్రిజి మొబైల్‌ సర్వీసులను ఈనెల 29న ప్రారంభించేందుకు టిలికాం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోను ఆధునిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌ వీడియో దృశ్యాలను విక్ష్షీించేందుకు ఈ మొబైల్‌ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈనెల 29న సాయంత్రం 6గంటలకు స్థానిక రవితేజ [...]

సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుతూ శ్రీకృష్ణ కమిటీకి లేఖ

శ్రీకాకుళం: సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుతూ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు శ్రీకృష్ణ కమిషన్‌కు లేఖ వ్రాశారు. ఈ మేరకు వారు లేఖను ప్రదర్శించారు. ఒకే బాష మాట్లాడేవారిని విడదీయవద్దని, విడదీస్తే మరిన్నీ ప్రత్యేక చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ప్రారంభమవుతాయని శాంతిభద్రతలు దెబ్బతింటాయని రాష్ట్ర అభివృద్ధి మందగిస్తుందని రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని ప్రాంతీయ వాదంతో అభివృద్ధి జరగదని ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులకు ఆచార్యులు తులసీరావు, కామరాజు, చంద్రయ్య, చిరంజీవి, అడ్డయ్యలు మద్ధతు ప్రకటించారు. సమైక్యాంధ్ర కమిటీ సభ్యులు [...]

అరబిందో పరిశ్రమకు స్థలం కేటాయింపు

శ్రీకాకుళం: రణస్థలం మండలం పైడిభీమవరంలోని చిట్టివలస రెవెన్యూ పరిధిలో 25.72 ఎకరాల భూమిని అరబిందో పరిశ్రమకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు స్థలం కేటాయించాల్సిందిగా అరబిందో యజమాన్యం ప్రభుత్వానికి గతంలో దరఖాస్తు చేసుకుంది. దీంతో రెవెన్యూ అధికారులు పలు మార్లు స్థలాన్ని పరిశీలించి కలెక్టర్‌కు నివేదించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఎకర స్థలం మార్కెట్‌ విలువ 25 లక్షల రూపాయలుగా, సిసిఎల్‌ఎ పది లక్షల రూపాయలుగా నిర్థారించి ప్రభుత్వానికి నివేధించారు. అయితే చివరిగా ఎకరా [...]

తగ్గిన ప్రోహిబిషన్‌ నేరాలు

శ్రీకాకుళం: జిల్లాల్లో ప్రోహిబిషన్‌ నేరాలు తగ్గుముఖం పట్టాయని ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం అసిస్టెంట్‌ కమీషనర్‌ కె.బలరామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాల్లో 14 ఎక్సైజ్‌ సర్కిళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమీషనర్‌ పర్యవేక్షణలో జిల్లా ఉంటుందన్నారు. జిల్లాల్లో పాలకొండ, పొత్తూరు, పాతపట్నం, సోంపేట, పలాస, ఇచ్ఛాపురం సర్కిల్‌లలో నేరాలు అధికంగా ఉండేవని నిరంతర దాడులను నిర్వహించడం వల్ల అవి గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఏ [...]

మెరుగైన పథకాలతో ప్రయోజనం

శ్రీకాకుళం: ఆదివాసీలకు యేటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకబాటు తనం తప్పడం లేదని ఆంధ్రా విశ్వవిద్యాలయంబోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ఆచార్య విఎల్‌ నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దేందుకు తమ విద్యాలయం ఆంథ్రోపాలజీ విభాగం కృషి చేస్తుందన్నారు. జిల్లా గిరిజన కేంద్రమైన సీతంపేట పిఎంఆర్‌సి ప్రాంగణంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మెరుగైన పథకాలతోనే ప్రయోజనం ఉంటుందని [...]

వ్యక్తిత్వ వికాసం అవసరం

- జేఎన్‌టియు రిజిస్ట్రార్‌ రవీంద్ర శ్రీకాకుళం: ఇంజనీరింగ్‌ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని జేఎన్‌టీయు రిజిస్ట్రార్‌ వి.రవీంద్ర అన్నారు. గార మండలం అంపోలు దగ్గర గల శారద ఇంజనీరింగ్‌ కళాశాల (సిస్టం)లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ, సిస్టిం కళాశాలలో విశాలమైన భవనాలు అత్యంత అధునాతనమైన ప్రయోగశాలలు నిష్ణాతులైన అధ్యాపకులు ఉండడం సంతోషంగా ఉందన్నారు. ప్రారంభోపన్యాసం చేసిన కళాశాల అధ్యక్షులు మధు విలేకర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ కళల [...]

జేకేసీలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం: జవహర్‌ నాలెడ్జీ సెంటర్‌ (జేకేసీ) ఆధ్వర్యంలో ఏఫ్రిల్‌ 12 నుంచి నిర్వహించనున్న 90 రోజుల కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై నిర్వహించనున్న శిక్షణకు అర్హత గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని స్థానికప్రభుత్వ పురుషుల డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్‌ బి.పోలీసు ఒక ప్రకటనలో కోరారు. ఐటి, పారిశ్రామిక రంగంలో స్థిర పడడానికి అవసరమైన ఆంగ్ల భాషలో నైపుణ్యం న్యాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ వికాసంపై శిక్షణనిస్తామన్నారు. డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యా అర్హత కలిగి ఉండాలి. ఆసక్తి గల [...]

త్వరలో ఏపీజీవీవీ ఎటిఎంల ఏర్పాటు

శ్రీకాకుళం: జిల్లాలోని గ్రామీణ వికాస బ్యాంకుల ద్వారా త్వరలో ఎటిఎం సేవలు ప్రారంభిస్తాయని బ్యాంకుల కంట్రోలింగ్‌ అధికారి డిఎంకె శర్మ చెప్పారు పోలాకి మండలం ప్రియగ్రహారం బ్యాంకు శాఖను పరిశీనలకు వచ్చిన ఆయన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాల్లో 62 వికాస బ్యాంకులు ఉన్నాయని అన్ని చోట్ల ఆన్‌లైన్‌ సేవలు పొందుపర్చామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారులకు మరిన్ని సేవలను అందించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. వికాస బ్యాంకు 540 రోజులకు 7.5 శాతం వడ్డీ అందజేస్తుందన్నారు. [...]

కాలువల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి

శ్రీకాకుళం: వంశధార కాల్వల అభివృద్ధికి వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆ శాఖ ఎస్‌ఈ వి.భీమశంకర్‌ సూచించారు. నరసన్నపేట వంశధార డివిజన్‌ కార్యాలయ ఆవరణలో ప్రాజెక్టు పరిధిలోని 8 డిస్ట్రిబ్యూటరీ నీటి సంఘాల సమావేశం జరిగింది. ఆయా నీటి సంఘాల పరిధిలోని అవసరాలు నిధులు బేరీజు వేసుకుని తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆయన సూచించారు. ప్రతి సంఘంలోని ఆయకట్టు ద్వారా సమకూరే నిధులతో అభివృద్ధి చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చే నెల 15 నాటికి నీటి సంఘాల ప్రణాళికలు [...]

డిఎం పద్ధతి మారకుంటే ఆందోళన

ఎంప్లాయిస్‌ యూనియన్‌ శ్రీకాకుళం: ఆర్టీసీ శ్రీకాకుళం 1వ డిపో మేనేజర్‌ తన పద్ధతి మార్చుకోకుంటే రీజియన్‌ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి టి.దామోదరరావు హెచ్చరించారు. డిపో మేనేజర్‌ వైఖరికి నిరసనగా స్థానిక కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహించిన ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, వినతి పత్రం సమర్పించినప్పటికీ స్పందించడం లేదని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. ఉపాధ్యక్షుడు కె.శంకరరావు మాట్లాడుతూ డిపో మేనేజర్‌ [...]

Follow

Get every new post delivered to your Inbox.