అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా చేపడుతున్న ఆందోళనను అడుకునేందుకు అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ దాడిలో పోలీసులతోపాటు, కొందరు మీడియా సిబ్బంది కూడా గాయపడ్డారు.
Filed under: వార్తలు | Leave a Comment »




