నవంబరు 2009 నుండి టపాలు

నవంబరు 28, 2009

మావోల ఉనికికోసమే ఈ చర్యలు

రెబ్బెన: రోజురోజుకూ మావోయిస్టులు తమ ఉనికికోసం దానిని నిలదొక్కుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి అడిషనల్‌ ఎస్‌పి రమేష్‌బాబు అన్నారు. సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి ఓపెన్‌కాస్టులో మావోయిస్టులు వాహనాలను ద్వంసం చేసిన విషయంపై స్పందించిన ఆయన రెబ్బెన మండలం గోలేటి జిఎం కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఆగస్టు మాసం నుంచి చత్తీస్‌ఘడ్‌ నుంచి మావోలు వచ్చి సంచరించడం జరుగుతుందన్నారు. మంగి, ఇంద్రవెల్లి ఏరియాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్‌ 2 నుంచి 8 [...]

నవంబరు 28, 2009

ఆదిలాబాద్‌లో మావోల పంజా

తిర్యాణి: ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని డోర్లి ఒసిపి-1 లో మావోలు పంజా విసారారు. సింగరేణిలో ఆరు వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. గత ఐదారు సంవత్సరాలుగా జిల్లాలో మావోయిస్టులు ఎలాంటి విద్వంసాలకు పాల్పడకుండా ఉండడంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా, డోర్లి ఒసిపిలో జరిగిన సంఘటనతో జిల్లాలో మళ్ళీ మావోల ప్రభావం ప్రారంభమైంది. బుధవారం రాత్రి 10 గంటలకు దాదాపు 50 మంది మావోయిస్టులు డోర్లి ఒసిపి-1 సింగరేణి కార్యాలయానికి రాగా [...]

నవంబరు 28, 2009

అక్రమ కలప తరలిస్తున్న లారీ పట్టివేత

ఇచ్చోడ: మండలంలోని దేవులనాయక్‌తాండ గ్రామ సమీపం నుంచి అక్రమంగా కలపను తరలిస్తున్న లారీ ఈజ్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇచ్చోడ అటవీశాఖ అధికారి వినయ్‌ కుమార్‌ సాహు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవులనాయక్‌తాండ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలుతోందని సమాచారం అందుకుతున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఆ ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా లారీ హెచ్‌ఆర్‌ 38 ఎం 3872 కనిపించడంతో అటుగా వెళ్లిన సిబ్బందిని చూసి ఆ ప్రాంతం నుంచి [...]

నవంబరు 28, 2009

కేసీఆర్‌ దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు

హైదరాబాదు: తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ేసీఆర్‌ చేపట్టే దీక్షను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు ఉంటాయని అవసరమైతే పెట్రోల్‌ పోసుకుని చావనైనా చస్తాముకాని దీక్షను విరమించమని ఈటెల స్ఫష్టం చేశారు. అసలు దీక్షను చేపట్టకుండానే అడ్డుకుంటామనడం విడ్డూరమని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉద్యమం చేసే తమను అనవసరంగా ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఈటెల అన్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని [...]

నవంబరు 28, 2009

ఘనంగా బక్రీద్‌ పండగ

హైదరాబాద్‌: త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్‌ పండగను ముస్లింలు సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం నగరంలోని పాతబస్తీలో ముస్తాబైన మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దైవప్రేమలో తనకు చెందిన సర్వస్వాన్ని త్యాగం చేసే వాగ్దానాల పండుగ అయిన బక్రీద్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సామూహిక ప్రార్థనలు జరుపుకున్నారు.