విజయవాడ: పశ్చిమకృష్ణాలో రాజకీయ హత్యల పరంపర ప్రారంభమైంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట కాంగ్రెస్నేత గింజుపల్లి వీరయ్యచౌదరిని ఈఉదయం ప్రత్యర్థులు గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. నెలరోజుల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన ఏబీసీ సంస్థల అధినేత, తెలుగుదేశం నాయకుడు ఆలూరి బుచ్చియ్య చౌదరి కేసులో వీరయ్య ప్రధాన అనుమానితుడు. బుచ్చయ్య హత్యకు ప్రతీకారంగానే వీరయ్యను ప్రత్యర్థులు హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు.
Filed under: వార్తలు | Leave a Comment »




