అక్టోబర్ 2009 నుండి టపాలు

అక్టోబర్ 31, 2009

రబీ సీజన్‌లో విత్తనాలకు 50 శాతం సబ్సిడీ

హైదరాబాద్: రబీ సీజన్‌లో రైతుకు కావాల్సిన ప్రతి విత్తనాన్ని 50 శాతం సబ్సిడీతో ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో సిఎం రోశయ్య అధ్యక్షతన రబీ సీజన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. రబీకి అవసరమైన విత్తనాల్లో ఐదు లక్షల క్వింటాళ్లు ఇప్పటికే పంపించామని, మరో 8 లక్షల క్వింటాళ్లు మండల కేంద్రాల్లో సిద్థంగా ఉంచామని రఘువీరా తెలిపారు. ఆహార భద్రత దృష్ట్యా రబీ వరి సాగు ఎక్కువగా చేయాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ రబీ [...]

అక్టోబర్ 31, 2009

‘ఇస్రో’ బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్‌

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా నిమితులైన రాధాకృష్ణన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గత చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ స్థానంలో నిమితులైన రాధాకృష్ణన్‌ 35 సంవత్సరాలుగా భారత అంతరిక్ష పరిశోధన రంగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో నేనీ బాధ్యతలు చేపట్టాను. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.

అక్టోబర్ 31, 2009

తెరాస పోటీ చేయాలి: తలసాని

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఫ్రీజోన్‌ వంటి పెద్ద అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెరాస అనుకోవడం విడ్డూరమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోటీ చేస్తే తెరాసకు సహకారం ఎంత లభిస్తుందో తెలుస్తుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం [...]

అక్టోబర్ 31, 2009

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన సిఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం గాంధీభవన్‌లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతికోసం కృషి చేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అని రోశయ్య పేర్కొన్నారు. దేశం కోసమే ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. అలాంటి త్యాగమూర్తిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అక్టోబర్ 31, 2009

110 డివిజన్లలో ‘రాజ్యం’ పోటీ

హైదరాబాద్: రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ ఒక ప్రకటన వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తాము 110 పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమకు 40 డివిజన్లలో గెలుపు గుర్రాలున్నాయని, వీటిలో తమకు 20 నుంచి 30 స్థానాలు వచ్చినా కార్పొరేషన్‌ను ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనేక పార్టీలు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి 50కి మించి సీట్లు [...]