నెల్లూరు: దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. రాజశేఖర్ఖరరెడ్డి మరణించిన తరువాత జరిగిన చావులన్నీ బోగస్లని రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ప్రకటించడాన్ని జిల్లా కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం పత్రికావిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కనీస నైతిక విలువలు కూడా తెలియని హనుమంతరావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హనుమంతరావును చంపుతామంటూ జగన్ వర్గీయులు బెదిరింపుకాల్స్ చేస్తున్నారన్న, వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి [...]
సెప్టెంబరు 2009 నుండి టపాలు
సెప్టెంబరు 30, 2009
సమస్యల పరిష్కారాలకు సింగరేణి సన్నాహలు
ఖమ్మం: సింగరేణిలో చేసిన ఫిర్యాదులు నెలల తరబడి పరిష్కృతం కాకుండా ఉంటాయన్న అపోహకు తెరదించేందుకు సింగరేణి సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తమకు అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తమకు అందే ప్రతీ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సిద్ధం చేసే బాధ్యతను సిబ్బందికి అప్పగించారు. ఇకపై అపరిష్కృత ఫిర్యాదులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత క్లర్కులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారికి తగిన [...]
సెప్టెంబరు 30, 2009
ఇంటర్ పరీక్షా ఫీజు గడువు పెంపు
శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫీజు గడువు అక్టోబర్ 8వ తేదీవరకు పెంచినట్లు ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ఎం. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము వంద రూపాయలతో అక్టోబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని అన్నారు.
సెప్టెంబరు 30, 2009
జీడిపప్పు నుండి నూనె ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభం
శ్రీకాకుళం: బాయిలింగ్ విధానంలో జీడిపప్పు తీసివేయగా మిగిలిన జీడిపప్పుల నుండి నూనె ఉత్పత్తిచేసే పరిశ్రమను పలాసా పారిశ్రామిక వాడలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కె. కృపారాణి ప్రారంభించారు. శ్రీరామ సిఎంఎస్ ఆయిల్ ఇండస్ట్రీ పేరిట నెలకొల్పిన ఈ పరిశ్రమలో 20బాయిలింగ్ పరిశ్రమల నుండి విడుదల అవుతున్న వ్యర్థాల నుండి ఆయిల్ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ యజమాని నాగేశ్వరరావు తెలిపారు. ఈసందర్భంగా పారిశ్రామిక వాడలోని మౌలిక సమస్యలను జీడిఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం. రామేశ్వరరావు తదితరులు [...]
సెప్టెంబరు 30, 2009
ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: ఇన్ఫోసిస్లో అకౌంటింగ్, ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి. పోలీసు తెలిపారు. కమీషనర్ ఆఫ్ కాలేజీ హేడ్ ఎడ్యూకేషన్ హైదరాబాదు సహాకారంతో జరుగుతున్న ఉద్యోగమేళాకు 2009 సంవత్సరం బికాం, లేదా ఎంకాం 50శాతం ఉత్తీర్ణత పొంది ఎదైనా జెకేసీ ద్వారా శిక్షణ పొందిన వారు మాత్రమే అర్హులని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల విద్యార్థులు తమ కళాశాలల్లో అక్టోబర్ 3నుండి 6లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. [...]