ఆగష్టు 2009 నుండి టపాలు

ఆగష్టు 31, 2009

ఆయేషా కేసు నేటికి వాయిదా

విజయవాడ: బి-ఫార్మసి విద్యార్థి ఆయేషామీర హత్యకేసు విచారణలో భాగంగా పాదముద్రల నిపుణులు, డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం కోర్టులో హాజరయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్రలు ఈ కేసులోని నిందితుడైన సత్యంబాబు పాదముద్రలతో సరిపోయాయని నిపుణులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే బిఎన్‌ఎ పరీక్షల్లో కూడా సత్యబాబు సంబంధించిన అంశాలే ఉన్నట్లు తెలిందని అధికారులు కోర్టులో వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించామని అన్ని సరిగానే ఉన్నాయని వారు నిందితుడి తరపు న్యాయ వాధి కె. రామ్మోహన్‌రావు [...]

ఆగష్టు 31, 2009

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

విజయవాడ: విజయవాడ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌పై, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వర్గీయులు కుర్చి విసరగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. సమావేశం వేదికపైకి ఇబ్రహీంపట్నం ఎంపిపి మధవరావును పిలవకపోవడం ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఎమ్మెల్యే రమేష్‌ వర్గీయుడు అగ్రహోదగ్రులై లగడపాటి మీద కుర్చీలు విసిరారు. కాగా, ఎంపి వర్గీయులు కూడా [...]

ఆగష్టు 31, 2009

ఆరవిదనగర్‌లో గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం

కడప: రాష్ట్ర గ్రామీణ బ్యాంకు ఐదు జిల్లాల్లో 359 శాఖల్లో 72లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నదని ఆ బ్యాంకు చైర్మన్‌ జయప్రకాశ్‌ చెప్పారు. కడపలోని అరవిదనగర్‌లో సోమవారం గ్రామీణ బ్యాంకు శాఖను ప్రారంభించారు. 6200 కోట్ల రూపాయలు లావాదేవీలు తమ బ్యాంకు ద్వారా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే తమ శాఖలో అన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. గత ఏడాది స్వయం సంఘాలకు 750 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, ఈ ఏడాది 800 [...]

ఆగష్టు 31, 2009

9న సిఎం కడప జిల్లా పర్యటన

కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్‌ 9న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది. సింహాద్రిపురం మండలం పైడిపాటెం రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను తనిఖీ చేస్తారని ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది.

ఆగష్టు 31, 2009

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

కడప: పొద్దుటూరు పట్టణంలోని గోకుల్‌నగర్‌లో మహేశ్వరి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు చెప్పారు. చాపాడు మండలం గుడివాడకు చెందిన మహేశ్వరికి గోకుల్‌నగర్‌కు చెందిన రవికుమార్‌రెడ్డితో పెళ్లిఅయింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను పాము కాటు వేసినట్టు, పాటు చంపి శరీరంవద్ద పడవేశారు. కాగా, తమ కుమార్తెను అదనంపు కట్నం కోసం భర్త రవికుమార్‌, అత్తమామలు వేధించి, హత్య చేసి, పాము కాటుకు గురైనట్టుగా చిత్రికరించారని మహేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు [...]