అసెంబ్లీ అర్ధాంతర వాయిదా

హైదరాబాద్: ఆర్ధిక మంత్రి రోశయ్య వ్యాఖ్యలు అసెంబ్లీలో సెగలను రగిలించాయి. బుధవారం నాటి శాసనసభ మూడో రోజు బడ్జెట్ సమావేశం అర్ధాంతరంగా వాయిదాపడింది. `నువ్వు పెద్ద మగాడివా. మాట్లాడటానికి సిగ్గూ శరం ఉండాలి’ అంటూ తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడిపై చేసిన వ్యాఖ్యలకు రోశయ్య క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం నేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. అత్యంత అభ్యంతరకరంగా, సభా మర్యాదకు విరుద్ధంగా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయన పట్టుపట్టారు. సభలో రోశయ్య లేరని, తాను [...]

పోటీ ధర్నాలు

హైదరాబాద్: ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కొత్త తరహా ఆందోళలకు తెర తీసాయి. దీనికి బుధవారం నాడు అసెంబ్లీ వేదికగా మారింది. తెలుగుదేశం రాద్ధాంతంలో అర్ధాంతరంగా అసెంబ్లీ వాయిదా పడిపోయిన తరువాత రెండు ప్రధాన పక్షాలు పోటీ ధర్నాలకు దిగాయి. అసెంబ్లీ ప్రవేశ ద్వారానికి అడ్డంగా రెండు పార్టీన ఎమ్మెల్యేలు బైటాయించి ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. రోశయ్య వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని సమావేశాలు నడవకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందని, బడ్జెట్ పై చర్చ జరిగితే [...]

కన్నబాబుకు ప్రశంసలు

హైదరాబాద్: తాజా శాసనసభలో కొత్త సభ్యులు అదరగొడుతున్నారు. పార్టీల అధినేతలే కాదు యువకులు సైతం తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే జయప్రకాశ్ నారాయణ్, చిరంజీవి లాంటి నాయకులు సభ తీరులో తమదైన ముద్రను వేసుకున్నారు. మంగళవారం నాటి బడ్జెట్ సమావేశంలో జరిగిన చర్చలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మాట్లాడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అందరి ప్రశంసలను అందుకున్నారు. సీనియర్ జర్నలిస్టు అయిన కన్నబాబు గతంలో నాలుగు సార్లు బడ్జెట్ సమావేశాలను రిపోర్టర్ గా కవర్ [...]

బ్రేక్ దర్శనాలకు బ్రేక్!

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో విపరీతమైన భక్తుల రద్దీ ఉండే శని, ఆదివారాల్లో సాయంత్రం విఐపిలకు కల్పిస్తున్న బ్రేక్ దర్శనాలకు టిటిడి ట్రస్ట్ బోర్డ్ స్వస్తి పలికింది. దీనితో సామాన్య భక్తులకు కొంత ఊరట లభించినట్లైంది. ఓఎస్ డి డాలర్ శేషాద్రి పదవీ కాలాన్ని రెండేళ్ళ పాటు పొడిగిస్తూ మరో తీర్మానించింది. అక్టోబర్ 28న కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఆర్జిత సేవలన్నీ యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి [...]

కలుషిత నీరు తాగి మేకలు మృతి

వేముల: వేముల సమీపంలోని కృపానగర్‌ క్రాస్‌ వద్ద ఆదివారం మద్యాహ్నం పెద్దజూటూరు గ్రామానికి చెందిన మేకల కాపర్లు పెద్ద వడ్డారపు గంగన్నకు చెందిన 40 మేకలు, రామిరెడ్డి ఉత్తమారెడ్డి 6 మేకలు, చాకలి మోకూరి వెంకటనారాయణవి 20 మేకలు, చిన్నవడ్డారపు ఓబులేసువి 20 మేకలు, మల్లేసు 2 మేకలు మేకలను మేపుతూ సమీపంలోని చెలిమి వద్ద దాహం తీర్చేందుకు మేకలను అక్కడికి తోలుకొని వెళ్లారు. ఆ సమయంలో ఆ నీరుతాగిన మేకలు ఒక్కొక్కటే మరణించసాగాయి. ఈ హఠాత్తు [...]

వర్షం కోసం భగీరథ దీక్ష

తంబళ్ళపల్లె: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా గ్రామాలలో పంటలు పండి ప్రజలు సుభీక్షంగా వుండాలనే సంకల్పంతో వర్షంకోసం కఠోర దీక్షక పూనుకొన్నాడు ఓ కలియు భగీరథుడు. వర్షం కోసం అన్నపానాదులు మాని ఓ స్వామి 21రోజులుగా పాలునే ఆహారంగా తీసుకొంటూ కఠోర దీక్ష సాగిస్తున్నాడు. కన్నెమడుగు పంచాయతీ, చిన్నమాచిరెడ్డిగారిపల్లెకు చెందిన గోవిందస్వామి మరిమాకులపల్లె కుంట చెరువులో ఈ దీక్షకు పూనుకొన్నాడు. ఆ గ్రామస్తుల సహకారంతో వారిచ్చే పాలు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ వరుణ దేవుని కోసం జపం చేస్తున్నాడు. [...]

గుడ్డు ధర గుభేల్‌…

అమలాపురం: ఓ పనిని దక్కించుకున్న కాంట్రాక్టర్‌ … ఆ పనికి వినియోగించే వస్తువుల ధరలు పెరిగితే అతనుఆ పనిని నిలుపుదల చేసే సౌలభ్యం ఉంది… ధరలు తగ్గినపుడు తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యత తీసుకున్న వారికి ఆ సావకాశం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా ఆ పథకాన్ని మాత్రం యథావిధిగా నడపవలిసిన బాధ్యత వారిపై ఉంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో మధ్యాహ్నభోజన [...]

ఏలేరు… కన్నీరు… ఆధునికీకరణ హుళక్కే

కాకినాడ: అనుకున్నంతా అయింది.. ఏలేరుకు కన్నీరే మిగిలింది. వరుసగా మూడో ఏడూ ఏలేరు ఆధునికీకరణకు రిక్త౎హస్తమే* ఎదురైంది. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాజెక్టు నిర్వహణకు రూ.12 కోట్లు కేటాయించినా కాలువల ఆధునికీకరణకు మాత్రం వెక్కిరింపే మిగిలింది. మెట్ట రైతుల ఎదురుచూపు నిరాశనే మిగిల్చింది. జిల్లాలో సుమారు లక్షా తొమ్మిదివేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఏలేరు నదిపై ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టును నిర్మించారు. మూడు దశాబ్దాల క్రితం 1979లో నిర్మించిన ప్రాజెక్టు ప్రస్తుతం శిథిలస్థితికి చేరుకుంది. ప్రాజెక్టు కింద [...]

డిసిసిబిలో పోస్టుల భర్తీకి కసరత్తు

కాకినాడ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో ఖాళీ పోస్టుల భర్తీకి కసరత్తులు చేస్తున్నారు. సహకార వ్యవస్థ పటిష్ఠతకు వైద్యనాధన్‌ కమిటీ సిఫార్సుల అమలుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, రాష్ర్టంలోని డిసిసిబిలన్నింటికీ పోస్టుల భర్తీ, బదిలీలు, పదోన్నతల విషయంలో అధికారం లభించింది. డిసిసిబి పాలకవర్గంలో ఉండే వృత్తిపరమైన నిపుణత కలిగిన డైరెక్టర్ల సంఖ్యను రెండు నుంచి మూడుకు పెంచనున్నారు. కొత్త అధికారంతో డిసిసిబి మేనేజ్‌మెంట్‌ గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 24 మంది ఉద్యోగులకు డిసిసిబి ఇటీవలే [...]

బల్దియాలో డీజిల్‌ దొంగలు

హైదరాబాద్‌: బల్దియాలో డీజిల్‌ అక్రమ విక్రయం కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతోం ది. డీజిల్‌ బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ సిబ్బందిపై బల్దియా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యధేచ్చగా డీజిల్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ప్రతినిత్యం చెత్త రవాణా వాహనాల నుంచి 2800 లీటర్ల డీజిల్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు సమాచా రం. ఏటా బల్దియాలో రూ. మూడున్నర కోట్ల డీజిల్‌ కుంభకోణం జరుగుతున్నట్లు అధికారులు పసిగట్టారు. డీజిల్‌ అక్రమాలకు పాల్పడుతున్న వాహనాల ఇన్స్‌పెక్ట [...]

Follow

Get every new post delivered to your Inbox.